చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘నేర సంబంధి న్యాయ వ్యవస్థ యొక్క పాలన లో భారతదేశం ప్రగతిశీలపథం’ అనే శీర్షిక తోరెండు రోజుల సమావేశాన్ని నిర్వహించనున్న చట్టం మరియు న్యాయం ల మంత్రిత్వ శాఖ; రేపటి నుండి గువాహాటి లో జరిగే ఈ సమావేశాని కి అసమ్ప్రభుత్వం  తోడ్పాటు కూడా ఉంటుంది


చట్టం మరియు న్యాయం ల శాఖ సహాయ మంత్రి (స్వతంత్రబాధ్యత)  శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఈకార్యక్రమం లో పాల్గొంటారు

Posted On: 17 MAY 2024 10:41AM by PIB Hyderabad

పాతవైన వలస పాలన నాటి చట్టాల ను రద్దు చేయడం తో పాటు పౌరులు ప్రధానం గా ఉన్నటువంటి మరియు ఒక చైతన్యభరితం అయిన ప్రజాస్వామ్యం యొక్క అవసరాల ను తీర్చగలిగినటువంటి చట్టాల ను తీసుకు వచ్చే దిశ లో అనేక కార్యక్రమాల ను భారత ప్రభుత్వం ఇటీవల కొన్ని సంవత్సరాల లో అమలు చేసింది. దీనిలో భాగం గా, ఇటీవల దేశం లో నేర సంబంధి న్యాయ వ్యవస్థ ను సంస్కరించడం కోసం మూడు క్రొత్త చట్టాల ను తెచ్చింది. ఈ మూడు శాసనాలు ఏవేవి అంటే వాటిలో భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023; ఇంకా భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 లు ఉన్నాయి. వీటిని ఇదివరకటి నేర సంబంధి చట్టాలు అయినటువంటి భారతీయ దండ సంహిత 1860, భారతీయ శిక్షా సంహిత, 1973 మరియు భారతీయ సాక్ష్య చట్టం, 1872 ల స్థానం లో పై మూడు క్రొత్త చట్టాల ను తీసుకు రావడమైంది. ఈ మూడు క్రొత్త నేర సంబంధి చట్టాలు 2024 జులై 1 వ తేదీ నాటి నుండి అమలు లోకి వస్తాయి అని ప్రకటించడమైంది.

 

 క్రొత్త చట్టాల ను గురించిన మరీ ముఖ్యం గా స్టేక్ హోల్డర్స్ లోను మరియు చట్టాల సంబంధిత వర్గాల లోను అవగాహన ను కలుగజేయడం కోసం చట్టం మరియు న్యాయం ల మంత్రిత్వ శాఖ నేర సంబంధి న్యాయ వ్యవస్థ యొక్క పాలన లో భారతదేశం ప్రగతిశీల పథం అనే శీర్షిక తో ఒక సమావేశాన్ని 2024 మే నెల 18 వ మరియు 19 వ తేదీ ల లో గువాహాటీ లోని ఐఐటి గువాహాటీ నమాతీ జలాహ్ లో గల డాక్టర్ శ్రీ భూపెన్ హజారికా సభాభవనం లో నిర్వహించనుంది. కార్యక్రమాని కి అసమ్ ప్రభుత్వం తన తోడ్పాటు ను అందించనుంది. కార్యక్రమాని కి ముఖ్య అతిథి గా అసమ్ యొక్క మాన్య ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ హిమంత్ బిశ్వ సర్ మా విచ్చేయనున్నారు. కార్యక్రమాని కి గౌరవ అతిథులు గా భారతదేశం సర్వోన్నత న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి మాన్య శ్రీ హృషికేశ్ రాయ్; గువాహాటి ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి మాన్య శ్రీ విజయ్ బిష్ణోయి మరియు సిక్కిమ్ ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి మాన్య శ్రీ విశ్వనాథ్ సోమద్దర్ లు వస్తున్నారు. కార్యక్రమం లో పాలుపంచుకొనే ఇతర ప్రముఖుల లో భారత ప్రభుత్వ చట్టం మరియు న్యాయం ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) మాన్య శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ మరియు భారతదేశ చట్ట సంఘం మెంబర్ సెక్రట్రి డాక్టర్ రీతా వశిష్ఠ్ గారు లు ఉన్నారు.

 

ఈ సమావేశం క్రొత్త నేర సంబంధి చట్టాలు మూడిటి లోని ముఖ్యాంశాల ను వెల్లడించడం తో పాటు ప్రశ్నోత్తరాలు మరియు సాంకేతిక అంశాల ను గురించిన సార్థక ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి అనేటటువంటి లక్ష్యాల ను కలిగివుంది. దీనికి అదనం గా వేరు వేరు న్యాయస్థానాల కు చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్య రంగ ప్రముఖులు, చట్టం అమలు సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ విచారణ కర్తలు, జిల్లా పాలన యంత్రాంగం అధికారులు మరియు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల కు చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థులు పాలుపంచుకోనున్నారు. ఈ సమావేశాల పరంపర లో ఒకటో సమావేశాన్ని 2024 ఏప్రిల్ 20 వ తేదీ న న్యూ ఢిల్లీ లో నిర్వహించిన సంగతి ని సైతం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

 

2024 మే 18 వ తేదీ నాటి ప్రారంభిక సదస్సు భారతదేశం లో నేర సంబంధి న్యాయ వ్యవస్థ యొక్క స్వరూపాన్ని పునర్ నిర్వచించే మరియు పౌరుల జీవనం పైన తీవ్ర ప్రభావాన్ని ప్రసరింపచేసే ఈ మూడు క్రొత్త క్రిమినల్ చట్టాల విస్తృత లక్ష్యాల ను గురించి వివరించనుంది. ప్రారంభిక దినాన ఉపన్యాసాల కు అదనం గా, సమావేశం రెండో రోజు న సాంకేతిక సదస్సులు మూడిటి ని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిలో ఒక్కొక్క సదస్సు ను ఒక క్రొత్త చట్టాన్ని గురించి ఈ క్రింద పేర్కొన్న విధం గా నిర్వహిస్తారు.

 

2024 మే నెల 19 వ తేదీ నాటి ఒకటో సాంకేతిక సదస్సు లో భాగం గా భారతీయ న్యాయ సంహింత, 2023 (బిఎన్ఎస్) యొక్క అమలు తీరు ను మదింపు చేయడం కోసం ఒక తులనాత్మక దృష్టికోణాన్ని అవలంబిస్తూ కూలంకష చర్చ జరపడం పై శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతుంది. ఈ సదస్సు కు గువాహాటీ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి మాన్య శ్రీ సౌమిత్ర సైకియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు యొక్క ఇతర పేనలిస్టుల లో సిక్కిమ్ ఉన్నత న్యాయస్థానం యొక్క డిప్యూటీ సాలిసిటర్ జనరల్ సంగీత ప్రధాన్ గారు, అసమ్, నాగాఁవ్ కు చెందిన ప్రత్యేక న్యాయమూర్తి (పిఒసిఎస్ఒ) ఇప్సితా బోర్‌ఠాకుర్ గారు మరియు అసమ్ ఎన్ఎల్‌యుజెఎ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ అమోల్ దేవ్ చౌహాన్ లు ఉంటారు.

 

2024 మే 19 వ నాడు జరిగే రెండో సాంకేతిక సదస్సు భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 (బిఎస్ఎ) యొక్క ముఖ్యాంశాల ను గురించి అంటే అపరాధాన్ని నిర్ణయించే ఆధారం- సాక్ష్యాన్ని గురించి చర్చించడం జరుగుతుంది. ఈ చర్చ ‘‘దస్తావేజులు’’ మరియు ‘‘సాక్ష్యం’’ ల యొక్క విస్తృత పరిధి పైన కేంద్రీకృతం కానుంది. వాటి కి సమగ్ర నిర్వచనాలను ఇచ్చి సరళీకరించడం జరిగింది. ఈ సదస్సు కు గువాహాటీ ఉన్నత న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి మాన్య శ్రీ దేవాశిస్ బఃరువా అధ్యక్షత వహిస్తారు. సదస్సు యొక్క ఇతర పేనలిస్టుల లో గువాహాటీ ఉన్నత న్యాయస్థానం యొక్క సాలిసిటర్ జనరల్ శ్రీ రంజిత్ కుమార్ దేవ్ చౌధరి, మేఘాలయ ఉన్నత న్యాయస్థానం యొక్క డిప్యూటీ సాలిసిటర్ జనరల్ డాక్టర్ శ్రీ నీతేశ్ మొజిక, అసమ్ లోని కార్బి ఆంగ్ లోంగ్ డిస్ట్రిక్ట్ ఎండ్ సెశన్స్ జడ్జి శ్రీ రౌశన్ లాల్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ లో స్పెశల్ డైరెక్టర్ (ఎన్‌ఫోర్స్‌ మెంట్ ) మోనిక శర్మ గారు లు ఉంటారు.

 

2024 మే నెల 19 వ తేదీ నాటి మూడో సాంకేతిక సదస్సు లో పోలీసు అధికారులు నేరాన్ని గురించి దర్యాప్తు చేయడం పట్ల భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023 (బిఎన్ఎస్ఎస్) ద్వారా మొదలుపెట్టినటువంటి ప్రక్రియాత్మక పరివర్తన ల యొక్క ప్రభావం మరియు న్యాయ వ్యవస్థ యొక్క, ఇంకా చట్టాల అమలు సంస్థ ల యొక్క పనితీరు పట్ల వ్యావహారిక ప్రభావాన్ని ప్రసరింప చేసే ఐసిటి ఉపకరణాల పట్ల చర్చించడం జరుగుతుంది. ఈ సదస్సు కు గువాహాటీ ఉన్నత న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి మాన్య శ్రీ అరుణ్ దేవ్ చౌధరి; మణిపుర్ ఉన్నత న్యాయస్థానం యొక్క డిప్యూటీ సాలిసిటర్ జనరల్ శ్రీ ఖోమ్‌ద్రమ్ సమర్‌ జీత్ సింహ్, మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క న్యాయవాది శ్రీ ఇ. చంద్రశేఖరన్ లతో పాటు ఎన్ఎల్‌యు దిల్లీ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ నీరజ్ తివారి లు అధ్యక్షత వహిస్తారు.

 

ఈ సమావేశం స్టేక్ హోల్డర్స్ లో మరియు పౌరుల లో చైతన్యాన్ని కలిగించి మూడు నేర సంబంధి చట్టాల ను అర్థం చేసుకోవడం లో మరియు వాటి అమలులో తోడ్పాటు ను అందించనుంది.

 

***


(Release ID: 2020883)