ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

డాక్టర్ కమలా బేణివాల్ గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ఉప రాష్ట్రపతి


డాక్టర్ కమలా బేణివాల్ గారు మహిళల సశక్తీకరణ కుఉదాహరణ అని అభివర్ణించిన ఉప రాష్ట్రపతి

Posted On: 15 MAY 2024 6:21PM by PIB Hyderabad

త్రిపుర, గుజరాత్ మరియు మిజోరమ్ ల పూర్వ గవర్నరు, ఇంకా రాజస్థాన్ యొక్క పూర్వ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ కమలా బేణివాల్ గారి కన్నుమూత పట్ల ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ సంతాపాన్ని తెలియజేశారు.

 

ఉప రాష్ట్రపతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో నమోదు చేసిన ఒక సందేశం లో డాక్టర్ కమలా బేణివాల్ గారు ఒక కుశల పరిపాలకురాలు మరియు మహిళ ల సశక్తీకరణ ను దృఢ సమర్థకురాలు గా నిలచారు అని స్మరించుకొన్నారు. ‘‘ఆమె స్వభావం లో ఇమిడివున్న నిరాడంబరత్వం మరియు దృఢత్వం లు ఆమె కు అనేక మంది ప్రశంసకుల ను సంపాదించి పెట్టాయి.’’ అని ఉప రాష్ట్రపతి అన్నారు.

 

డాక్టర్ కమలా బేణివాల్ గారి తో గత అయిదు దశాబ్దాల కు పైగా తనకు ఉన్నటువంటి మిత్రత్వాన్ని ఉప రాష్ట్రపతి గుర్తు కు తెచ్చుకొంటూ, ఆమె నిష్క్రమించడం తనకు వ్యక్తిగతంగా లోటు అన్నారు. డాక్టర్ కమలా బేణివాల్ గారి కుటుంబాని కి, స్నేహితుల కు మరియు ప్రశంసకుల కు ఉప రాష్ట్రపతి తన హృదయ పూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 2020781) Visitor Counter : 63