ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

క్యాన్సర్ & సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా


- మహారాష్ట్రలోని లాతూర్‌లో వివేకానంద మెడికల్ ఫౌండేషన్ మరియు రీసెర్చ్ సెంటరుకు చెందిన వివేకానంద క్యాన్సర్ & సూపర్ స్పెషాలిటీ ఎక్స్‌టెన్షన్ హాస్పిటల్‌ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి

- సాంప్రదాయ జీవన విధానం మరియు ఆహారం అనేక ఔషధపరమైన అంతర్దృష్టులను అందిస్తాయి మరియు ఆరోగ్య సంరక్షణ విషయంలో వస్తోన్న భయానక మార్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి: డాక్టర్ మాండవ్య

-మన సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, నివారణ విధానాలు నేటి ఆధునిక యుగంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి

-ఇటీవలి కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో మన విధానాలు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే

Posted On: 20 FEB 2024 12:50PM by PIB Hyderabad

"మన సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, వ్యాధి నివారణ విధానాలు నేటి ఆధునిక యుగంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని. ఇటీవలి మహమ్మారి సంక్షోభ సమయంలో ఇవి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందేనని." కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అన్నారు. ఈ రోజు మహారాష్ట్రలోని లాతూర్లో వివేకానంద మెడికల్ ఫౌండేషన్ మరియు రీసెర్చ్ సెంటర్ యొక్క వివేకానంద క్యాన్సర్ & సూపర్ స్పెషాలిటీ ఎక్స్టెన్షన్ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియారాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ శ్రీ మోహన్ మధుకర్ రావు భగవత్ సమక్షంలో  విషయాన్ని తెలిపారు సందర్భంగా డాక్టర్ మాండవ్య మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆరోగ్య నమూనాలు ఉన్నాయనిఅయితే భారతదేశం తన సొంత ఆరోగ్య నమూనాను భారతీయ జన్యుశాస్త్రంతో సమలేఖనం చేసుకోవాలని మరియు దాని భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన వ్యాధుల ఖండాంతర నమూనాలపై దృష్టి పెట్టాలని ఆయన నొక్కి చెప్పారు. "మనం మన మూలాలు మరియు జీవనశైలిలో అంతర్లీనంగా జీవించే సాంప్రదాయ పద్ధతులను ప్రతిబింబించుకోవాలి రోజుల్లో ప్రమాణంగా ఉన్న ఆహార విషయాలు వ్యవస్థల ద్వారా  రోజు ప్రబలంగా ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చుఅని ఆయన నొక్కిచెప్పారుగత ఐదేళ్లలో పెరుగుతున్న క్యాన్సర్ మరియు మానసిక ఆనారోగ్యపు రోగుల గురించి కేంద్ర మంత్రి  మాట్లాడుతూ "సాంప్రదాయ జీవన విధానం మరియు ఆహారం అనేక ఔషధ అంతర్దృష్టులను అందిస్తాయి మరియు ఆరోగ్య సంరక్షణ దృశ్యాలలో  భయంకరమైన మార్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయిఅని అన్నారుభారతదేశ వారసత్వం మరియు భారతదేశ ఆరోగ్య నమూనాలో ఉన్న మూలాలు వివిధ వ్యాధులను ఎదుర్కోవడానికి మరియు చికిత్స  అందించే జ్ఞానాన్ని కలిగి ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారుసమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంలోప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ సేవలలో సమానత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తోందిఅట్టడుగున ఉన్నవారికి కూడా భరోసానిస్తూ అనేక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.  మానవాళికి సేవలను అందించడంలో భారతీయ ఆరోగ్య సంరక్షణ నిపుణుల నిబద్ధతను అభినందిస్తూ..  సంప్రదాయం మన ప్రాచీన సంస్కృతిలో పాతుకుపోయిందనిఇప్పుడు ప్రపంచం గుర్తించిందని కేంద్ర మంత్రి అన్నారు. “కోవిడ్ సంక్షోభం వైద్య మరియు ఔషధ రంగాలలో భారతదేశం యొక్క బలాన్ని మాత్రమే కాకుండా దాని విలువలను కూడా ప్రపంచానికి చూపింది” మరియు వసుధైవ కుటుంబం అనే భావనను” చాటిందని అన్నారు. భారతదేశంలో ఆరోగ్యం ఒక సేవగా భావించబడుతుందని పునరుద్ఘాటించిన ఆయనప్రజల-కేంద్రీకృతవిలువ-ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రూపొందించాలని దేశం ఆకాంక్షిస్తున్నదని ప్రధానంగా ప్రస్తావించారు.  “మన సంస్కృతి ప్రజలకు సేవ చేయడం నేర్పింది. ఆరోగ్యం అనేది వాణిజ్యం కాదు, మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉండే సేవ" అని అన్నారు.. ప్రపంచానికి ఆరోగ్య సేవలలో భారతదేశం యొక్క సహకారం మరియు ప్రమోషన్‌ను నొక్కి చెబుతూ "విదేశాల్లోని 10 మంది వైద్య పరిశోధన నిపుణులలో ముగ్గురు భారతీయులే" అని పేర్కొన్నారు. "భారతదేశం యొక్క వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ సేవలు మన సరిహద్దులను దాటి, మొత్తం ప్రపంచాన్ని ఆలింగనం చేసుకుంటున్నాయి." అని వివరించారు. "నివారణ ఆరోగ్య సంరక్షణ మరియు ఆధునిక వైద్య సదుపాయాల మధ్య సమన్వయంతో ఆరోగ్య రంగంలో సమగ్రంగా పని చేయడం మరియు దేశంలోని ఆరోగ్య సంరక్షణ అందరికీ చేరేలా ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాలలో ఊపందుకోవడం మా లక్ష్యం" అని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.

***



(Release ID: 2007532) Visitor Counter : 61