ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వికసిత భారత్ సంకల్ప్ యాత్ర
దాదాపు 2 లక్షల వికసిత భారత్ ఆరోగ్య శిబిరాల్లో 5 కోట్లు దాటిన మొత్తం సందర్శనలు
శిబిరాల వద్ద 2.61 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడ్డాయి
2.62 కోట్ల మందికి పైగా ప్రజలకు టీబీ పరీక్షలు నిర్వహించారు మరియు సుమారు 10 లక్షల మంది ప్రజలు ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాల కోసం సూచించబడ్డారు
31.34 లక్షల మందికి పైగా సికిల్ సెల్ డిసీజ్ పరీక్షలు నిర్వహించారు వారిలో 60,900 మందికి ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు సూచించబడింది
Posted On:
19 JAN 2024 11:56AM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప్ యాత్ర కింద ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలు మరియు పట్టణ స్థానిక సంస్థలలో నిర్వహించిన 1,99,199 ఆరోగ్య శిబిరాల్లో యాత్రికుల సంఖ్య 5,19,35,933కి చేరుకుంది.
ఆరోగ్య శిబిరాల్లో కింది కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి:
ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబి-పిఎంజేఏవై): వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కోసం ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ ఫ్లాగ్షిప్ పథకం కింద ఆయుష్మాన్ యాప్ని ఉపయోగించి ఆయుష్మాన్ కార్డ్లు జారీ చేయబడుతున్నాయి మరియు లబ్ధిదారులకు భౌతిక కార్డులు పంపిణీ చేయబడుతున్నాయి. ఇప్పటి వరకు 48,96,774 ఫిజికల్ కార్డులు పంపిణీ చేశారు.
నిన్న జరిగిన ఆరోగ్య శిబిరాల్లో మొత్తం 4,51,492 ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడ్డాయి. మొత్తంగా ఇప్పటి వరకు 2,61,11,405 కార్డులు సృష్టించబడ్డాయి.
క్షయవ్యాధి (టిబి): లక్షణాల కోసం పరీక్షించడం, కఫం పరీక్ష మరియు అందుబాటులో ఉన్న చోట ఎన్ఏఏటి యంత్రాలను ఉపయోగించడం ద్వారా టిబి కోసం రోగుల స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది.టిబి ఉన్నట్లు అనుమానించబడిన కేసులను ఉన్నత సౌకర్యాలకు సూచిస్తారు. 65వ రోజు ముగిసే సమయానికి 2,62,05,700 మందికి పైగా స్క్రీనింగ్ చేయబడ్డారు. వీరిలో 9,93,800 మందికి పైగా ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు సూచించబడ్డారు.
ప్రధాన్ మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ (పిఎంటిబిఎంఏ) కింద టిబితో బాధపడుతున్న రోగుల కోసం నిక్షయ్ మిత్రస్ నుండి సహాయం పొందడం కోసం సమ్మతి తీసుకోబడింది. నిక్షయ్ మిత్రలుగా ఉండటానికి సిద్ధంగా ఉన్న హాజరైన వారికి ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అందించబడుతుంది. పిఎంటిబిఎంఏ కింద 3,62,700 కంటే ఎక్కువ మంది రోగులు సమ్మతి ఇచ్చారు మరియు 99,100 కంటే ఎక్కువ మంది కొత్త నిక్షయ్ మిత్రలు నమోదు చేయబడ్డారు.
నిక్షయ్ పోషణ్ యోజన (ఎన్పివై) కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా టిబి రోగులకు ద్రవ్య సహాయం అందించబడుతుంది. ఇందుకోసం పెండింగ్లో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేస్తున్నారు. ఇలా 69,300 మంది లబ్ధిదారుల వివరాలను సేకరించారు.
సికిల్ సెల్ డిసీజ్: గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్సిడి కోసం పాయింట్ ఆఫ్ కేర్ (పిఓసి) పరీక్షల ద్వారా లేదా సాల్యుబిలిటీ ద్వారా సికిల్ సెల్ డిసీజ్ (ఎస్సిడి)ని గుర్తించడం కోసం అర్హులైన జనాభా (40 సంవత్సరాల వరకు) స్క్రీనింగ్ జరుగుతోంది. పాజిటివ్గా వచ్చిన కేసులను నిర్వహణ కోసం ఉన్నత కేంద్రాలకు పంపుతున్నారు. ఇప్పటివరకు 31,34,600 మందికి పైగా స్క్రీనింగ్ చేయబడ్డారు వారిలో 60,900 మందికి పాజిటివ్గా ఉన్నట్లు కనుగొనబడింది మరియు ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు సూచించబడింది.
నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సిడిలు): హైపర్టెన్షన్ మరియు డయాబెటిస్కు అవకాశం ఉన్న జనాభా (30 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ) స్క్రీనింగ్ చేయబడుతోంది మరియు పాజిటివ్గా అనుమానించబడిన కేసులను ఉన్నత కేంద్రాలకు సిఫార్సు చేస్తున్నారు. దాదాపు 4,25,76,600 మందిని హైపర్టెన్షన్ మరియు డయాబెటిస్ కోసం పరీక్షించారు. వారిలో 16,44,900 మందికి పైగా హైపర్టెన్షన్ ఉన్నట్లు అనుమానించబడింది మరియు 11,74,700 మందికి పైగా మధుమేహం ఉన్నట్లు అనుమానించబడింది మరియు 25,50,700 మందికి పైగా ప్రజలు ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు రెఫర్ చేయబడ్డారు.
![image.png](https://mail.google.com/mail/u/0?ui=2&ik=86a5f4d025&attid=0.0.2&permmsgid=msg-f:1788540346053557249&th=18d22bf7f8f9fc01&view=fimg&fur=ip&sz=s0-l75-ft&attbid=ANGjdJ_OXnLnsl8ZTniIr811tQmO_o0d40Y4WvAnjwQeOHPoN_KRic_fwb8XGSrphklxpYNoKyaah2y985F9kJvPEYJPcg9xsveyOKyVnQPg8f1wPD-HHg2h5ET68Dg&disp=emb&realattid=ii_lrkwoq931)
అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్
![image.png](https://mail.google.com/mail/u/0?ui=2&ik=86a5f4d025&attid=0.0.3&permmsgid=msg-f:1788540346053557249&th=18d22bf7f8f9fc01&view=fimg&fur=ip&sz=s0-l75-ft&attbid=ANGjdJ-Xlv3CLS8ATbxuXQ6x96vS86JUQtExle5CGaiMeUJmGnxW-_AyGCAY2dACJjnRNN9qckwhNSH4CxpOOPdk_j5Jcija5UxbHEkT3kEY4Eoxxmr9OSXkdbtBv0g&disp=emb&realattid=ii_lrkwpeas3)
బక్సర్, బీహార్
![image.png](https://mail.google.com/mail/u/0?ui=2&ik=86a5f4d025&attid=0.0.4&permmsgid=msg-f:1788540346053557249&th=18d22bf7f8f9fc01&view=fimg&fur=ip&sz=s0-l75-ft&attbid=ANGjdJ-vMCN4Avszin3bVLPzVSKeSc3VHgo062f04fywC9fp02LxTaWDpYFUXaLCoObxUkAiCF-AjsOpkv46fML_BWvs85BAKyk2XV-ez_hYWBJfuBvasXVyYBhOmuk&disp=emb&realattid=ii_lrkwpsgf4)
హోషియార్పూర్, పంజాబ్
![image.png](https://mail.google.com/mail/u/0?ui=2&ik=86a5f4d025&attid=0.0.5&permmsgid=msg-f:1788540346053557249&th=18d22bf7f8f9fc01&view=fimg&fur=ip&sz=s0-l75-ft&attbid=ANGjdJ9HbwNSwZzSp_tE1ok41YnyvH0ZEz-nT6P5eBlzTWYVSwxFcNiDTEEkce_xjk0IBHMdcdSVWMmS7E5h4nXFOAdNTy90YQg_7KAg9g-Vowid1muPW5wKYehmgBQ&disp=emb&realattid=ii_lrkwq8d05)
బారాముల్లా, జమ్మూ & కాశ్మీర్
![image.png](https://mail.google.com/mail/u/0?ui=2&ik=86a5f4d025&attid=0.0.6&permmsgid=msg-f:1788540346053557249&th=18d22bf7f8f9fc01&view=fimg&fur=ip&sz=s0-l75-ft&attbid=ANGjdJ_5kS2c_vyRnwtdg3nYqNipdVWbY_1EICZiKDOUicfzt4Br0wSb7DnFOUFuB3aFNbLPXTutboNVkvEtPdGzOHk5JVE69DjgnQM3zqC_N6nks-Z5jibFoJ2Mzq4&disp=emb&realattid=ii_lrkwqmmc6)
బెమెతర, ఛత్తీస్గఢ్
![image.png](https://mail.google.com/mail/u/0?ui=2&ik=86a5f4d025&attid=0.0.1&permmsgid=msg-f:1788540346053557249&th=18d22bf7f8f9fc01&view=fimg&fur=ip&sz=s0-l75-ft&attbid=ANGjdJ-lA3KtPXiaaM_lC7vxwq9WVXBF_BlPKc-0PKuKvhmV0o5ya_hgocq0DJC2_h4fcgLon_fvI7FaBXxi0PmqMjN1_dximTIkxYigfwnFvq6eWnwOyu5fw0HYWrQ&disp=emb&realattid=ii_lrkwnfft0)
నోక్లక్, నాగాలాండ్
నేపథ్యం:
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించేందుకు గాను గౌరవనీయులైన ప్రధాన మంత్రి నవంబర్ 15న జార్ఖండ్లోని ఖుంటి నుండి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కింద ఆన్ స్పాట్ సేవల్లో భాగంగా గ్రామ పంచాయతీలలో ఐఈసీ వ్యాన్ ద్వారా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
***
(Release ID: 1998022)
Visitor Counter : 151