ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ప్రధానిశ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ని ఆయన జయంతి నాడు స్మరించుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 25 DEC 2023 9:52AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ని ఈ రోజు న ఆయన జయంతి కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

దేశ ప్రజల పట్ల శ్రీ వాజ్‌పేయి యొక్క సమర్పణ భావాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, శ్రీ వాజ్‌పేయి ఎల్లప్పటికీ ఒక ప్రేరణా మూర్తి వలె ఉంటారు అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘పూర్వ ప్రధాని గౌరవనీయులైన అటల్ బిహారి వాజ్‌పేయి గారి కి ఆయన జయంతి సందర్భం లో దేశం లోని కుటుంబ సభ్యులు అందరి పక్షాన ఇవే నా యొక్క కోటానుకోట్ల వందనాలు. ఆయన జీవనపర్యంతం దేశ నిర్మాణాని కి జోరు ను అందించడం లో నిమగ్నం అయ్యారు. భరత మాత పట్ల ఆయన యొక్క అంకిత భావం మరియు సేవా భావం లు అమృత కాలం లో సైతం ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT



(Release ID: 1990390) Visitor Counter : 64