గనుల మంత్రిత్వ శాఖ
కీలక, వ్యూహాత్మక ఖనిజాలలో స్వావలంబన సాధించేందుకు చేపట్టిన చొరవలు
Posted On:
18 DEC 2023 3:36PM by PIB Hyderabad
కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలను గుర్తించేందుకు 01.11.2022న గనుల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తన నివేదికలో 30 ఖనిజాలను కీలకమైనవి, వ్యూహాత్మకమైనవిగా కమిటీ గుర్తించింది. వాటి ఆర్థిక ప్రాముఖ్యత, భారత ప్రాధాన్యతలు, ఇంధన పరివర్తన కోసం భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన నష్టాన్ని పరిగణనలోకి కమిటీ తీసుకుంది. దాని ఆర్ధిక ప్రాముఖ్యతను పరిగణిస్తూ రాగిని ఆ 30 ఖనిజాలలో ఒకదానిగా గుర్తించింది.
కీలక, వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించిన 20 బ్లాకులను ఇ-ఆక్షన్ తొలివిడతను కేంద్ర ప్రభుత్వం 29.11.2023న నిర్వహించింది. ఇందులో రాగి, లిథియం, ఆర్ ఇఇలు, ప్లాటినం సమూహానికి చెందిన ఖనిజాలు, నికిల్ , పొటాష్ తదితరాలు ఉన్నాయి.
ఉపరితల లేదా సముదాయ ఖనిజాలతో పోలిస్తే బంగారం, రాగి, వెండి, కోబాల్ట్, లిథియం, నికెల్ వంటి కీలకమైన, లోతుగా భూమిలో కూరుకుని ఉండే ఖనిజాలను అన్వేషించి, వెలికి తీయడం కష్టం. రాగి నిల్వలు/ వనరులు దేశంలో తక్కువ అందుబాటులో ఉన్నందువల్ల, భారతదేశం ఎప్పడూ రాగి ధాతువును & సాంద్ర ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటోంది. శుద్ధమైన రాగిని ఉత్పత్తి చేయడంలో సాంద్రమైన రాగిని ముడి పదార్ధంగా ఉపయోగిస్తారు, ఇందులో భారత్కు ఆరోగ్యవంతమైన సామర్ధ్యం ఉన్నది. మహమ్మారి నుంచి ఆర్ధిక వ్యవస్థ కోలుకున్నదని ప్రతిఫలిస్తూ రాగి శుద్ధికి డిమాండ్ పెరగడం వల్లనే గత రెండేళ్ళల్లో దిగుమతులు పెరిగాయి. ఈ వృద్ధి ముఖ్యంగా మౌలికసదుపాయాలు, నిర్మాణం, టెలికాం, విద్యుత్, పునరావృత ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాల వంటి యూజర్ రంగాలలో పెరగడం వల్లనే.
గనులు, ఖనిజాలు (అభివృద్ధి& నియంత్రణ) సవరణ చట్టం, 2023 ద్వారా భూమిలో లోతుగా కూరుకున్న రాగి సహా 29 కీలక ఖనిజాలు కోసం అన్వేషణ లైసెన్స్ అనే కొత్త ఖనిజ రాయితీని ప్రవేశపెట్టారు. దీనికింద లైసెన్స్దారు అన్వేషించడం, వెలికితీయడం కష్టమైన కీలక, లోతుగా ఉన్న ఖనిజాల కోసం భూపరిశీలన, అన్వేషణ కార్యకలాపాలు చేపట్టడానికి అనుమతి ఉంటుంది. కీలక ఖనిజాల అన్వేషణలో అధునాతన సాంకేతికత, నిధులు, నైపుణ్యాలను తీసుకురావడానికి ప్రైవేట్ ఏజెన్సీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే అన్వేషణ లైసెన్స్ లక్ష్యం. అంతేకాకుండా, ఖనిజాన్వేషణ లైసెన్సు లేని అక్రెడిటేషన్ కలిగిన ప్రైవేటు అన్వేషణ ఏజెన్సీలను, జాతీయ ఖనిజ అన్వేషణ ట్రస్టు నుంచి నిధులు అందుకునేందుకు అర్హులుగా చేస్తున్నారు. పైన పేర్కొన్న చర్యలను రాగి ఖనిజం దేశీయంగా అందుబాటులో ఉండేలా ప్రోత్సహించి, దాని దిగుమతిని తగ్గించేందుకు ఉద్దేశించినవి. ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సోమవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో వెల్లడించారు.
***
(Release ID: 1987859)