వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాంచీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీని సందర్శించిన కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా


తూర్పు ప్రాంతంలోని ఐసిఏఆర్ పరిశోధనా సముదాయాన్ని కూడా సందర్శించిన శ్రీ అర్జున్ ముండా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్‌లోని వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సంభాషణ

Posted On: 16 DEC 2023 2:19PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా రాంచీలోని గర్ ఖతంగాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీని సందర్శించారు. కేంద్ర మంత్రికి గిరిజన పిల్లలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీ అర్జున్ ముండా తూర్పు ప్రాంతంలోని ఐసిఏఆర్ పరిశోధనా సముదాయాన్ని కూడా సందర్శించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్‌లోని వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సంభాషించారు.

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీలో రాంచీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్, డైరెక్టర్ డాక్టర్ సుజయ్ రక్షిత్‌తో కలిసి  శ్రీ అర్జున్ ముండా మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి కోసం ఇన్‌స్టిట్యూట్ వివిధ కార్యకలాపాలను సమీక్షించారు.

శ్రీ అర్జున్ ముండా ఈ సందర్బంగా ప్రసంగిస్తూ, మన దేశం గ్రామాలలో నివసిస్తుందని, గ్రామీణ ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారమని అన్నారు. వ్యవసాయ వృద్ధికి గ్రామీణాభివృద్ధికి సన్నిహిత సంబంధం ఉంది. వ్యవసాయ వృద్ధి వేగాన్ని వేగవంతం చేయడానికి సమగ్ర పద్ధతిలో సూక్ష్మజీవుల బయోటెక్నాలజీ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే విశాల దృక్పథంతో ఇన్‌స్టిట్యూట్ పనిచేస్తోందని ఆయన అన్నారు.

తూర్పు ప్రాంతం కోసం ఐసిఏఆర్ పరిశోధనా సముదాయంలో, మంత్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పిఓ లు), స్థానిక రైతులతో సంభాషించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకారం అందిస్తున్న రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. మన రైతుల కృషి, వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యవసాయ డ్రోన్‌లను ప్రవేశపెట్టడం వంటి అదనపు కార్యకలాపాలకు పంట స్ప్రేయింగ్, క్రాప్ మానిటరింగ్ వంటి సాంకేతికతల కారణంగా దేశం ఆహార ఉత్పత్తిలో స్వావలంబన సాధించింది.

 

ప్రభుత్వం ప్రారంభించిన పిఎం ఫసల్ బీమా మరియు పిఎం కిసాన్ సమృద్ధి వంటి అనేక ముఖ్యమైన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ ముండా రైతు సమాజాన్ని కోరారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్‌లో వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ  లక్క సాగు, ప్రాసెసింగ్, మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేసే సవాళ్లు, అవకాశాలకు సంబంధించి ఇన్‌స్టిట్యూట్ విభిన్న కార్యకలాపాల గురించి శ్రీ అర్జున్ ముండా వివరంగా చర్చించారు.

 

జార్ఖండ్ రాష్ట్రం లక్క ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జార్ఖండ్‌లోని వాతావరణం కూడా లక్క సాగుకు అనుకూలంగా ఉంటుంది.

***


(Release ID: 1987642)