రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మాజీ సైనికుల కోసం ఉద్యోగ మేళా

Posted On: 15 DEC 2023 3:04PM by PIB Hyderabad

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్ (డీజీఆర్‌), ఈ ఏడాది నవంబర్ 23న గురుగావ్‌లోని దుండహేరా మిలిటరీ స్టేషన్‌లో ఉద్యోగ మేళా నిర్వహించింది. మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం ఈ ఉద్యోగ మేళా లక్ష్యం. ఇందులో 33 సంస్థలు పాల్గొన్నాయి, 1,326 మాజీ సైనికులకు ఉద్యోగావకాశాలు కల్పించాయి.

వివిధ ఉద్యోగాల కోసం, సంస్థల ఎంపిక ప్రక్రియ ప్రకారం తదుపరి ముఖాముఖి & ధ్రువపత్రాల పరిశీలన కోసం 1,139 మంది మాజీ సైనికులను ఎంపిక చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా మరో ఏడు డీజీఆర్‌ ఉద్యోగ మేళాలు నిర్వహిస్తారు. చండీగఢ్, విశాఖపట్నం, అల్వార్, పుణె, ముంబై, ఇండోర్, లఖ్‌నవూలో ఇవి జరుగుతాయి.

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

 

***



(Release ID: 1986982) Visitor Counter : 49