రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్


- ఢిల్లీలోని రాజ్‌ఘాట్ సమీపంలోని గాంధీ దర్శన్ వద్ద 10 అడుగుల ఎత్తుతో ఏర్పాటు

Posted On: 10 DEC 2023 3:42PM by PIB Hyderabad

ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో డిసెంబరు 10, 2023  గాంధీ దర్శన్ వద్ద రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ 10 అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రక్షణ మంత్రి తన ప్రసంగంలోభారతదేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిసమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేసిన జాతిపితకు  విగ్రహం సముచితమైన నివాళి అని అభివర్ణించారు. “బలమైనసంపన్నమైన మరియు స్వచ్ఛమైన భారతదేశాన్ని ఊహించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు గాంధీజీప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని మన ప్రభుత్వం జాతిపిత అడుగుజాడల్లో నడుస్తోందిజన్ ధన్ యోజనఆయుష్మాన్ భారత్ప్రధాన మంత్రి ఆవాస్ యోజనప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనస్వచ్ఛ భారత్ వంటి పథకాలు ఆయన ఆలోచనలపై తీసుకువచ్చి అమలులో ఉన్నావే” అని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారుమహాత్మా గాంధీ ప్రతి భారతీయుడి హృదయంలో జీవించడం కొనసాగిస్తున్నారనిఅయితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ & నెల్సన్ మండేలా వంటి గొప్ప నాయకులు తమ దేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం ఆయన ఆలోచనలు,  దృక్పథం నుండి ప్రేరణ పొందారని ఆయన నొక్కి చెప్పారుదేశభక్తి మరియు నిబద్ధతతో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా గాంధీబాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి విప్లవకారులను రక్షణ మంత్రి గుర్తు చేసుకున్నారు. “ గొప్ప వ్యక్తులు మన ప్రభుత్వానికి మార్గదర్శక కాంతిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ‘సబ్కా సాథ్సబ్కా వికాస్’ దార్శనికత వారి కలలపై నిర్మించబడిందిమా భావజాలం శాంతిసామాజిక సామరస్యంఐక్యతఅభివృద్ధి ఆధారంగా మార్పు తీసుకురావడమేనని ఆయన అన్నారుప్రభుత్వ దృష్టి ఎప్పుడూ ప్రణాళికాబద్ధమైన పురోగతిపైనే ఉంటుందనిదీని ఫలితంగా భారతదేశం ప్రపంచంలోనే 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని శ్రీ రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారుగాంధీజీని స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు, 'ప్రపంచం ప్రతి ఒక్కరి అవసరాలకు సరిపోతుందికానీ ప్రతి ఒక్కరి దురాశకు సరిపోదుఅని విశ్వసించే ఆర్థిక ఆలోచనాపరుడు కూడా ఆయనే అని పేర్కొన్నారు. “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మా ప్రయత్నం బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ఉద్ధరించడమే కాదువారికి సాధికారత కల్పించడం కూడాఅన్ని వర్గాల వృద్ధి ఒకే విధంగా దేశ భద్రతను బలోపేతం చేస్తుంది, ”అని ఆయన అన్నారురక్షణ మంత్రి అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న సముచిత ప్రాముఖ్యతను ఎత్తిచూపారువారు ఇప్పుడు దాదాపు అన్ని రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. 10,000 కంటే ఎక్కువ మంది సభ్యులతో ఎఫ్ఐసీసీఐ తరహాలో బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని ఆయన ప్రస్తావించారుఇది భారత ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారుఅణగారిన వర్గాలను దేశంలోని అతిపెద్ద ఆకాంక్షలు గల వర్గంగా అభివర్ణిస్తూవారిని గుర్తించేందుకు ఉపయోగించే 'నామవాచకం'ను తొలగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు విభాగాల ఆకాంక్షలను నిర్వచించే కొత్త నామవాచకం లేదా పదజాలాన్ని రూపొందించడానికి ఇది సమయం అని ఆయన అన్నారుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం స్త్రీలు పురుషులతో సమానంగా సాధికారత సాధించేలా చూస్తోందనిదేశ నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తున్నారని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. “అబల (బలహీనమైనవంటి పదాలను నారీతో ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయికానీ ఇప్పుడుమా మహిళల నిజమైన బలాన్ని మేము గుర్తించినందునఅబల శక్తి (శక్తి)తో భర్తీ చేయబడిందివారు ఎన్నికల రాజకీయాల్లోకి రావడమే కాదువారు కూడా మాతృభూమిని రక్షించడానికి సాయుధ దళాలలో చేరారుమహిళలు తమ రాజకీయ హక్కులను పొందేందుకు నారీ శక్తి వందన్ అధినియం ఆమోదించబడిందిఅబలా నారీ టు నారీ శక్తి ఒక పరివర్తన ప్రయాణం” అని అన్నారుదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిజాయితీ మరియు అంకితభావంతో ప్రజలకు సేవ చేయడం కొనసాగించాలనే ప్రభుత్వ నిబద్ధతను రక్షా మంత్రి పునరుద్ఘాటించారుమహాత్మా గాంధీకి ఇదే నిజమైన నివాళి అని అన్నారు.

 ****



(Release ID: 1986129) Visitor Counter : 76