వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్' (డొమెస్టిక్‌) ద్వారా, 2.85 ఎల్‌ఎంటీ గోధుమలు, 5,180 ఎంటీ బియ్యాన్ని 2,316 బిడ్డర్లకు విక్రయించిన కేంద్ర ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2023 4:03PM by PIB Hyderabad

దేశంలో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి చిల్లర ధరలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, గోధుమలు & బియ్యానికి వారానికి ఒకసారి ఇ-వేలం నిర్వహిస్తోంది. 20వ ఇ-వేలం 08.11.2023న జరిగింది, ఇందులో 'ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్' (డొమెస్టిక్‌) {ఓఎంఎస్‌ఎస్‌(డి)} కింద 3 ఎల్‌ఎంటీ గోధుమలు & 2.25 ఎల్‌ఎంటీ బియ్యాన్ని సరఫరా చేసింది. దీంతోపాటు, 2.85 ఎల్‌ఎంటీ గోధుమలు, 5,180 ఎంటీ బియ్యాన్ని 2,316 మంది బిడ్డర్లకు విక్రయించింది.

ఎఫ్‌ఏక్యూ గోధుమల రిజర్వ్ ధర రూ.2,150/క్వింటాల్‌గా ఉంటే, దేశవ్యాప్త సగటు అమ్మకపు ధర రూ. 2,327.04/క్వింటాల్‌గా ఉంది. యూఆర్ఎస్‌ గోధుమల రిజర్వ్ ధర రూ.2,125/క్వింటాల్‌ అయితే, సగటు అమ్మకపు ధర రూ.2,243.74/క్వింటాల్‌గా ఉంది.

గోధుమలతో పాటు, ఓఎంఎస్‌ఎస్‌(డి) కింద కేంద్రీయ భండార్/ఎన్‌సీసీఎఫ్‌/నాఫెడ్‌ వంటి ప్రభుత్వ రంగ, సహకార సంస్థలకు 2.5 ఎల్‌ఎంటీ గోధుమలను కేటాయించింది. వీటిని గోధుమ పిండిగా మార్చి 'భారత్ ఆటా' బ్రాండ్ కింద ₹27.50/కిలోకు మించని ధరతో ప్రజలకు విక్రయిస్తారు. 07.11.23 వరకు, అటాగా మార్చడానికి 6,051 ఎంటీ గోధుమలను ఈ 3 సహకార సంఘాలకు కేంద్రం కేటాయించింది.

ఓఎంఎస్‌ఎస్‌(డి) కింద గోధుమలు పొందిన వర్తకులు, వాటిని గోధుమ పిండిగా మార్చి విక్రయించకూడదు. 07.11.23 వరకు, అక్రమ నిల్వలు ఉండకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా 1,851 తనిఖీలు జరిగాయి.

 

***


(రిలీజ్ ఐడి: 1976025) సందర్శకుల సూచీ సంఖ్య : : 103
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada