శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం స్వచ్ఛత పరిశుభ్రత ప్రత్యేక ప్రచారం 3.0ని విజయవంతంగా పూర్తి చేసింది మరియు ప్రభుత్వంలో పెండింగ్‌ను తగ్గించింది


ప్రత్యేక ప్రచారం కింద 300 కంటే ఎక్కువ ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేశారు

37 వేలకు పైగా చ.అ. చెత్త మరియు ఇతర అనవసరమైన పదార్థాలను శుభ్రపరచడం మరియు పారవేయడం తర్వాత చాలా స్థలం ఖాళీ అయ్యింది

చెత్తను పారవేయడం ద్వారా రూ. 8.33 లక్షలు పైగా ఆదాయం సమకూరింది.

Posted On: 02 NOV 2023 11:11AM by PIB Hyderabad

స్వచ్ఛతను సంస్థాగతీకరించడానికి మరియు ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో పెండింగ్‌ను తగ్గించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత మరియు లక్ష్యం నుండి ప్రేరణ పొంది, పెండింగ్‌లను పూర్తిచేసేందుకు ప్రత్యేక ప్రేరణతో 2023 అక్టోబర్ 2 నుండి 31 అక్టోబర్ వరకు ప్రత్యేక ప్రచార 3.0 (అమలు దశ)ను ప్రారంభించారు. మెరుగైన అంతర్గత నిర్వహణ మరియు పర్యావరణాన్ని మరియు ప్రభుత్వ మౌలిక సదుపాయాలను పరిశుభ్రంగా మరియు పచ్చగా మార్చడం ప్రత్యేక ప్రచారం 3.0 లక్ష్యం.

 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ  ప్రత్యేక ప్రచారం 3.0ని విజయవంతంగా పూర్తి చేసింది.ప్రత్యేక ప్రచారం 3.0 డిపార్ట్‌మెంట్‌ దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తన సెక్షన్‌లు/డివిజన్‌లు/స్వయంప్రతిపత్తి సంస్థలు/సబార్డినేట్ కార్యాలయాల్లో నిర్వహించబడింది. ప్రచార వ్యవధిలో పరిశుభ్రత మరియు స్థల నిర్వహణ కోసం లక్ష్యాలను గుర్తించడానికి సెప్టెంబర్ 15, 2023 నుండి సన్నాహక దశతో ప్రచారం ప్రారంభమైంది.

 

ప్రచార సమయంలో, కార్యాలయాలలో స్థల నిర్వహణ మరియు పని స్థలం అనుభవాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక ప్రచారం యొక్క సన్నాహక దశ ప్రారంభమైనప్పటి నుండి, డిపార్ట్‌మెంట్ దాని సెక్షన్‌లు/డివిజన్‌లు/స్వయంప్రతిపత్త సంస్థలు/సబార్డినేట్ కార్యాలయాలతో పాటు దేశవ్యాప్తంగా శుభ్రం చేయడానికి వివిధ ప్రదేశాలను గుర్తించింది. శుభ్రం చేయడానికి దాదాపు 150 ప్రదేశాలు గుర్తించారు.  20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఖాళీ చేయబడుతుందని అంచనా వేయబడింది, 8,000 కంటే ఎక్కువ ఫిజికల్ ఫైల్‌లు మరియు 140 ఇ-ఫైల్స్ సమీక్ష కోసం గుర్తించబడ్డాయి. రోజువారీ పురోగతిని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది మరియు పాలనా సంస్కరణలు మరియు పౌర పిర్యాదులు శాఖ ఎస్ సీ పీ డి ఎం  పోర్టల్‌లో సమాచారం క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేయబడింది.

 

జాయింట్ సెక్రటరీ (అడ్మిన్), శ్రీమతి. ఎ. ధనలక్ష్మి వివిధ హైబ్రిడ్  సమావేశాల ద్వారా ప్రచార పురోగతిని చురుకుగా సమీక్షించారు మరియు కొనసాగుతున్న ప్రత్యేక ప్రచారం 3.0లో భాగంగా కార్యాలయ ఆవరణలోని అనేక ప్రదేశాలను సందర్శించారు. ఆమె అధికారుల ప్రయత్నాలను ప్రశంసించారు అలాగే

కార్యాలయంలో పరిశుభ్రతను కాపాడుకోవడానికి వారి ఉత్తమ ప్రయత్నాలను అందించాలని వారిని ప్రోత్సహించారు.

 

ప్రచారం యొక్క వివిధ లక్ష్యాల పురోగతిని సమీక్షించడానికి హైబ్రిడ్ మోడ్‌లో డి ఎస్ టీ యొక్క అన్ని ఏ ఐ లు/సబార్డినేట్ కార్యాలయాల ప్రతినిధులతో  జే ఎస్ (అడ్మిన్.), డి ఎస్ టీ అధ్యక్షతన సమావేశం జరిగింది.

 

డిపార్ట్‌మెంట్ మరియు దాని సెక్షన్‌లు/డివిజన్‌లు/స్వయంప్రతిపత్తి సంస్థలు/సబార్డినేట్ ఆఫీసులలో  ప్రత్యేక ప్రచారం 3.0 కింద కొన్నింటిని జాబితా చేయడానికి అనేక ఉత్తమ పద్ధతులు అమలు చేయబడ్డాయి.

 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ , మొహాలి, డి ఎస్ టీ యొక్క స్వయం ప్రతిపత్తి ఇన్‌స్టిట్యూట్ దాని క్యాంపస్‌లో వ్యర్ధాలను గుర్తించింది  చెత్తను తొలగించిన తర్వాత, ఆవరణలో  నడక దారికి పేవ్‌మెంట్ చేయడానికి ఉపయోగించింది.

 

ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్,  డీ ఎస్ టీ కి చెందిన స్వయంప్రతిపత్త సంస్థకాలేజీ విద్యార్థుల కోసం  స్వచ్ఛత అవగాహన ప్రోగ్రామ్‌ను చేపట్టింది. వారు "చెత్త రహిత భారతదేశం" పేరుతో ప్రభుత్వ పాఠశాల పిల్లలకు చిత్ర రచన పోటీని కూడా నిర్వహించారు.

 

(చెత్త రహిత భారత్‌పై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీ)

 

ప్రచారంలో డి ఎస్ టీ ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు కూలీ క్యాంప్, వసంత్ విహార్ మరియు ఏం సీ డీ  బాలుర మరియు బాలికల పాఠశాలలో జూట్ బ్యాగులు మరియు మెటల్ బాటిళ్లనుజే ఎస్ (అడ్మిన్.) నేతృత్వంలో పంపిణీ చేశారు. 

 

(ఒకేసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు జనపనార సంచులు మరియు మెటల్ బాటిళ్ల పంపిణీ)

 

అక్టోబర్ ప్రచారం అనేక రంగాల్లో లక్ష్యాలను అధిగమించడంతో ముగిసింది, డిపార్ట్‌మెంట్ దాని సెక్షన్‌లు/డివిజన్‌లు/స్వయంప్రతిపత్తి సంస్థలు/సబార్డినేట్ కార్యాలయాలు ప్రత్యేక ప్రచారం 3.0లో ఉత్సాహంగా పాల్గొని 300 కంటే ఎక్కువ స్తలాలలో పరిశుభ్రత పండుగగా జరుపుకుంది. ఈ ఏడాది 37 వేల చ.అ.ల విస్తీర్ణంలో విశేషమైన విస్తీర్ణం విడుదలైంది. లక్ష్యం చేయబడిన ఫైల్‌లు, భౌతిక మరియు ఇ-ఫైళ్లు రెండూ సమీక్షించబడ్డాయి మరియు ప్రచారంలో పెండెన్సీని తగ్గించడంలో భాగంగా చాలా ఫైల్‌లు మూసివేయబడ్డాయి మరియు తొలగించబడ్డాయి. డిపార్ట్‌మెంట్ దాని సెక్షన్‌లు/డివిజన్‌లు/అటానమస్ బాడీలు/సబార్డినేట్ ఆఫీసులతో కలిపి ప్రచారంలో గుర్తించి సేకరించిన చెత్తను పారవేయడం ద్వారా రూ.8.33 లక్షలు సంపాదించింది. 8,214 ఫైళ్లను పరిశీలించగా 3066 ఫైళ్లను తొలగించారు. 140 ఈ-ఫైళ్లను సమీక్షించగా, వాటిలో 130 ఈ-ఫైళ్లు మూసివేయబడ్డాయి.

 

ఈ ప్రయత్నాలు డిపార్ట్‌మెంట్ మరియు దాని సెక్షన్‌లు/డివిజన్‌లు/స్వయంప్రతిపత్త సంస్థలు/సబార్డినేట్ ఆఫీసులు చేసిన పనిలో కొంత భాగాన్ని మాత్రమే సూచిస్తాయి.

 

***



(Release ID: 1974305) Visitor Counter : 44