భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు అధ్యక్షతన జోధ్ పూర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల తొలి సంయుక్త సమావేశం

Posted On: 28 OCT 2023 6:59PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు  ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ అధ్యక్షతన 2023 అక్టోబర్ 26-27 తేదీల్లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ అండ్ టీ) క్లస్టర్ల మొదటి సంయుక్త  సమావేశం జరిగింది. జోధ్ పూర్ సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (జె సి కె ఐ ఎఫ్), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జోధ్ పూర్ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి.

2020లో ప్రారంభమైన సిటీ ఎస్ అండ్ టి క్లస్టర్ లు అనేవి ప్రధాన మంత్రి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (పిఎం-ఎస్ టిఐ ఎ సి ) సిఫార్సు మేరకు  భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం తీసుకున్న ఫ్లాగ్ షిప్ చొరవ. విద్యారంగం, ఆర్ అండ్ డీ సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్ లు, స్థానిక ప్రభుత్వాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఎస్ అండ్ టీ జోక్యాల ద్వారా స్థానిక సవాళ్లను అధిగమించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రస్తుతం బెంగళూరు, భువనేశ్వర్, ఢిల్లీ, హైదరాబాద్, జోధ్ పూర్ , పుణె, చండీగఢ్ లో ఇటీవల ఏర్పాటు చేసిన నార్తర్న్ రీజియన్ క్లస్టర్లలో ఏడు ఎస్ అండ్ టీ క్లస్టర్లు పనిచేస్తున్నాయి.

పరిశోధన  అనువాద అంశాలపై దృష్టి సారించిన భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం ప్రత్యేక చొరవ ఎస్ అండ్ టి క్లస్టర్లు అని ప్రొఫెసర్ సూద్ తన కీలక ప్రసంగంలో తెలిపారు. క్లస్టర్ల సమిష్టి బలాన్ని వివరిస్తూ, సినర్జిస్టిక్ ఎస్ అండ్ టీ జోక్యాల ద్వారా ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని  గురించి తెలియచేశారు. ఈ జాయింట్ క్లస్టర్ల మీట్ లో క్లస్టర్ లు ఏకతాటిపైకి రావడంతో, ఇంటర్ డిసిప్లినరీ , జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా మరిన్ని క్రాస్ కోఆపరేషన్ ప్రాజెక్టులు రాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా క్లస్టర్ల సుస్థిరత అవసరాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారు, అందువల్ల ప్రతి క్లస్టర్ తమ సుస్థిర ప్రణాళిక కోసం పనిచేయడం చాలా ముఖ్యం.

(జాయింట్ ఎస్ అండ్ టీ క్లస్టర్స్ సమావేశంలో కీలకోపన్యాసం చేస్తున్న పి ఎస్ ఎ ప్రొఫెసర్ సూద్)

ఇటీవల ప్రకటించిన నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ ముసాయిదాను ప్రస్తావిస్తూ, ఈ పాలసీ ఫ్రేమ్వర్క్ కింద పనిచేసే డీప్ టెక్ స్టార్టప్ లతో క్లస్టర్లు సమర్థవంతంగా సహకరించవచ్చని ప్రొఫెసర్ సూద్ సూచించారు.

భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ పర్వీందర్ మైనీ తన ప్రసంగంలో, "క్లస్టర్లు ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థాపకత , ఆవిష్కరణలను ప్రేరేపించాయి. సంస్థల సరిహద్దులను చెరిపి వేయడం లో సహాయపడ్డాయి" అని అన్నారు. జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తూ, భాగస్వామ్య పర్యావరణ వ్యవస్థలు , ప్రాంతీయ పరిష్కార ప్రదాతలుగా ఎస్ అండ్ టి క్లస్టర్ల పాత్రను వివరించారు. భారతదేశ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జిఐఐ) ను పెంచడంలో , ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయడంలో ఎస్ అండ్ టి క్లస్టర్లు పోషించగల ప్రముఖ పాత్రను డాక్టర్ మైని ప్రముఖంగా చెప్పారు.

అంతేకాకుండా, విజ్ఞాన మార్పిడి (నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్) కు వేదికగా జాయింట్ ఎస్ అండ్ టి క్లస్టర్స్ మీట్ ప్రాముఖ్యతను డాక్టర్ మైనీ వివరించారు. స్థాపించిన క్లస్టర్ల నుండి కొత్త క్లస్టర్ లకు ఉత్తమ పద్ధతులను భాగస్వామ్యం చేయడానికి , అన్ని క్లస్టర్ల మధ్య పరస్పర అభ్యాసం , ఎదుగుదల వాతావరణాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది.

(జాయింట్ ఎస్ అండ్ టీ క్లస్టర్ల సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తున్న పి ఎస్ ఎ  కార్యాలయం సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ పర్వీందర్ మైనీ)

రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో క్లస్టర్ల మధ్య ఇంటర్ డిసిప్లినరీ సహకారానికి ఉన్న అవకాశాలపై లోతైన చర్చలు జరిగాయి. ఇందులో హెల్త్ కేర్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్ మెంట్, అగ్రిటెక్ అండ్ న్యూట్రిషన్, స్టెమ్ ఎడ్యుకేషన్, ఎస్ అండ్ టీ ద్వారా జీవనోపాధి, నార్త్ ఈస్ట్ ఇంపాక్ట్ అండ్ ఇండస్ట్రీ 4.0 మొదలైన అంశాలు ఉన్నాయి.

తొలిరోజు వివిధ ఎస్ అండ్ టీ క్లస్టర్లు నాలుగు కీలక అంశాలపై సంయుక్త ప్రజెంటేషన్లు ఇచ్చారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్), హైదరాబాద్ సి ఇ ఒ  శ్రీమతి రష్మీ పింపలే హెల్త్ కేర్ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే అంశంపై ఢిల్లీ రీసెర్చ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇన్నోవేషన్ (డి ఆర్ఐఐవి) సి ఇ ఒ  శ్రీమతి షిప్రా మిశ్రా ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం అగ్రిటెక్ అండ్ న్యూట్రిషన్ అనే అంశంపై బెంగళూరులోని బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ (బి ఇ ఎస్ టి) సి ఇ ఒ  రవి తెన్నేటి ప్రజెంటేషన్ ఇచ్చారు. స్టెమ్ ఎడ్యుకేషన్ థీమ్ పై మొదటి రోజు తుది ప్రజెంటేషన్ ను పుణె నాలెడ్జ్ క్లస్టర్ (పికెసి) సిఇఒ డాక్టర్ ప్రియా నాగరాజ్ ఇచ్చారు. ప్రజెంటేషన్లు సమిష్టిగా ఈ ప్రాంతాలలో క్లస్టర్ల సహకార బలాన్ని ఆవిష్కరించాయి. ఆయా ప్రాంతాలలో సహకార ఎస్ అండ్ టి చొరవలను నడిపించడంలో వారి పాత్రను వివరించాయి.

ప్రజెంటేషన్ల అనంతరం ఐఐటీ జోధ్ పూర్ అధ్యాపకులతో ప్రొఫెసర్ సూద్ ముచ్చటించారు. ఇన్నోవేషన్ గ్యాలరీ, జీవనోపాధి మద్దతు కార్యక్రమాలతో కూడిన ' కళాన్ భవ్' అనే ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు.

(ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకారులతో ముచ్చటిస్తున్న పి ఎస్ ఎ  ప్రొఫెసర్ సూద్, ఐఐటీ జోధ్ పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతను చౌదరి.)

జోధ్ పూర్ లోని జె సి కె ఐఎఫ్ సి ఇ ఒ  డాక్టర్ జిఎస్ తోతేజా ఎస్ అండ్ టి ద్వారా జీవనోపాధి అనే అంశంపై సంయుక్త ప్రజెంటేషన్ తో రెండో రోజు ప్రారంభమైంది. నార్త్ ఈస్ట్ ఇంపాక్ట్ అండ్ ఇండస్ట్రీ 4.0 అనే థీమ్ పై భువనేశ్వర్ సిటీ నాలెడ్జ్ ఇన్నోవేషన్ క్లస్టర్ (బిసికెఐసి) చైర్మన్ డాక్టర్ ఎం.సువార్, సి ఇ ఒ  డాక్టర్ ఎన్.మిశ్రా తుది సంయుక్త ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవనోపాధిని సృష్టించడానికి సాంప్రదాయ కళను పెంపొందించడంలో క్లస్టర్ల క్రియాశీలక భాగస్వామ్యం , ఆన్ లైన్ అమ్మకాల వేదికల ద్వారా ఉత్పత్తుల విలువను పెంచడంపై రెండవ రోజు నుండి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ ప్రయత్నాలను బిసికెఐసి ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో పునరావృతం చేయాలని చర్చించారు.

భవిష్యత్తులో ఎస్ అండ్ టి క్లస్టర్లు స్వయం సమృద్ధి సాధించే దిశగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ప్రొఫెసర్ సూద్ తన ముగింపు ప్రసంగంలో పునరుద్ఘాటించారు. మునుపెన్నడూ లేని వేగంతో ఆవిష్కరణలను నడిపించడంలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, దార్శనికుల పరస్పర అనుసంధాన పర్యావరణ వ్యవస్థ శక్తిని సంయుక్త ఎస్ అండ్ టీ క్లస్టర్ల సమావేశం చాటిచెప్పిందని ఆయన ఉద్ఘాటించారు. హాజరైన వారిలో ఆలోచనల వైవిధ్యాన్ని ప్రశంసించిన ప్రొఫెసర్ సూద్, "సమ్మిళితత్వం , విభిన్న దృక్పథాలను స్వీకరించడానికి సుముఖతతో పురోగతి అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది" అని అన్నారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాల నుంచి సుస్థిర ఇంధన కార్యక్రమాల వరకు సాంకేతిక ఆవిష్కరణలు, పురోగతిని వీక్షించే అవకాశం లభించింది. ఐఐటీ జోధ్ పూర్ విద్యార్థులు వైద్య సాంకేతిక రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలను ప్రదర్శించారు. ప్రొఫెసర్ సూద్ సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించిన హెల్త్ కేర్ సంకలనాన్ని కూడా ప్రారంభించారు.

(సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించిన హెల్త్ కేర్ సంకలనాన్ని ప్రారంభిస్తున్న పి ఎస్ ఎ ప్రొఫెసర్ సూద్)

ఈ కార్యక్రమం ఈ క్లస్టర్ల సహకార ప్రయత్నాల సామర్థ్యాన్ని బలపరిచింది.సైన్స్,  టెక్నాలజీ ద్వారా సానుకూల మార్పు దిశగా వారి నిబద్ధతను ప్రదర్శించింది.

(ఐఐటీ జోధ్ పూర్ క్లాక్ టవర్ లో జాయింట్ ఎస్ అండ్ టీ క్లస్టర్స్ మీట్ లో పాల్గొన్న పి ఎస్ ఎ ప్రొఫెసర్ సూద్, సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ మైనీ

***



(Release ID: 1972715) Visitor Counter : 44


Read this release in: English , Urdu , Hindi , Punjabi