ఆయుష్

ఆయుర్వేద శాస్త్రం జంతు, వృక్షాలతో పాటు మానవ జీవితాన్ని మలచుకునే పర్యావరణానికి మేలు చేస్తుంది: సర్బానంద సోనోవాల్


ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన నెల రోజుల ఆయుర్వేద సెలబ్రేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన కేంద్ర ఆయుష్ మంత్రి

2023 నవంబర్ 10న 'ప్రతిరోజూ ప్రతి ఒక్కరికీ ఆయుర్వేదం' అనే ఇతివృత్తం (థీమ్) తో 8వ ఆయుర్వేద దినోత్సవం

Posted On: 10 OCT 2023 2:50PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ
రోజు మీడియా సెంటర్ లో కర్టెన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారతదేశం అంతటా 8
వ జాతీయ ఆయుర్వేద దినోత్సవానికి సంబంధించి నెల రోజుల వేడుకల డ్రైవ్ ను
ప్రారంభించారు.
ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి దేవుని గౌరవ సూచకంగా భారతదేశం అంతటా ఆయుర్వేద
దినోత్సవాన్ని జరుపుకుంటారు. ధంతేరాస్ తో పాటు జరిగే ఆయుర్వేద దినోత్సవం ఇతరులకు
మంచి ఆరోగ్యం కోసం తమకు, ఇతరులకు భగవంతుడి ఆశీర్వాదాలను కోరుతుంది.

కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆయుర్వేదం "జన్ సందేశ్, జన్ భాగీధరి, జన్
ఆందోళన్" గురించి ప్రముఖంగా చెప్పారు, "8 వ ఆయుర్వేద దినోత్సవం కోసం ఆయుష్
మంత్రిత్వ శాఖ మానవుడి శ్రేయస్సును మాత్రమే కాకుండా పర్యావరణం, మొక్కలు,
జంతువులు మొదలైన వాటి శ్రేయస్సును ప్రోత్సహించడంలో ఆయుర్వేదం సామర్థ్యాన్ని
అన్వేషించాలని భావిస్తోంది. ప్రజల శ్రేయస్సుతో పాటు.. అందుకే అందరి ఆరోగ్యం
కోసం ఆయుర్వేదం' అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేశాం” అని చెప్పారు.
భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ 'వసుధైక కుటుంబం‘ ఇతివృత్తానికి అనుగుణంగా ఈ థీమ్ ఉంది,
ఆయుర్వేద దినోత్సవం -2023 కేంద్ర థీమ్ ' ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం'
అంటే 'ప్రతిరోజూ ప్రతి ఒక్కరికీ ఆయుర్వేదం' - 'హర్ దిన్ హర్ కిసి కే లియే ఆయుర్వేదం'
అనే టాగ్ లైన్ తో నిర్ణయించారు. ఇది మానవ-జంతు-మొక్కల-పర్యావరణ అంతరాళం పై
దృష్టి పెడుతుంది.

శ్రీ సర్బానంద సోనోవాల్ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల పై మొత్తం ప్రభుత్వ
విధానాన్ని, ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ
నాయకత్వంలోని భారతదేశం వసుధైక కుటుంబం సూత్రాన్ని విశ్వసిస్తోందన్నారు. సంపూర్ణ
వైద్యం , ఆరోగ్యకరమైన జీవనం శాస్త్రమైన ఆయుర్వేదం సామర్థ్యాన్ని
సద్వినియోగం చేసుకోవడం ద్వారా, ఒకే ఆరోగ్యం (వన్ హెల్త్) ఆందోళనలను
పరిష్కరించడానికి ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకురావచ్చు" అని అన్నారు.
ఆయుర్వేదంపై విద్యార్థులు, రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు
దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం 8 వ ఆయుర్వేద
దినోత్సవం 2023 నవంబర్ 10 న జరుగుతుంది. ఆయుర్వేదం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలను
పరిష్కరించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం కోసం
వేర్వేరు థీమ్ లను ఎంచుకుంది. ఈ థీమ్ పై దేశవ్యాప్తంగా లక్షలాది మందితో వివిధ
కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఆరోగ్య సమస్య గురించి, సమస్య నివారణ ,
చికిత్సలో ఆయుర్వేదం సంభావ్య పాత్ర గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి
సహాయపడుతుంది.

వ్యవసాయ-ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడం, స్వీయ భాగస్వామ్యం కోసం ప్రజలను
శక్తివంతం చేయడం , ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించడం,
ఆయుర్వేదం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి నిపుణులను ప్రోత్సహించడంపై
దృష్టి సారించి ఈ థీమ్ ను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఇది సుస్థిర వ్యవసాయం, మానవ,
జంతు, వృక్ష, అటవీ , ఆక్వాకల్చర్ ఆరోగ్యం, ఆహార భద్రత మొదలైన వాటిపై దృష్టి
సారించే రంగాలను కలిగి ఉంటుంది. ఈ థీమ్ రైతులకు ఆయుర్వేదం, విద్యార్థులకు
ఆయుర్వేదం ఇంకా ప్రజలకు ఆయుర్వేదం అనే మూడు ప్రధాన రంగాలపై దృష్టి సారించింది:
నామ్ కింద మొత్తం 12,500 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు అనుమతి
లభించిందని, వీటిలో ఇప్పటికే 8095 పనిచేస్తున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ
కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా తెలిపారు. నెల రోజుల పాటు సాగే ఆయుర్వేద
ప్రచారంలో ఇవి ఉంటాయి: ఆయుర్వేద సంస్థల్లో ఎగ్జిబిషన్ కమ్ మినీ ఎక్స్ పో;
రీసెర్చ్ స్టడీస్ ఫలితాల వ్యాప్తి; వైద్య శిబిరాలు; పాఠశాలలు, కళాశాలల
విద్యార్థులు, సిబ్బందికి అవగాహన సదస్సులు; రైతులకు సాధారణ ఔషధ మొక్కల పంపిణీ;
సాధారణ ప్రజలలో ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి వివిధ పోటీలు; రన్
ఫర్ ఆయుర్వేద, ది రైడర్స్ ర్యాలీతో పాటు అనేక ఇతర కార్యక్రమాలు ఉన్నాయి.
ఆయుష్ మంత్రి ఆయుర్వేద సలహాదారు డాక్టర్ మనోజ్ నేసరి మాట్లాడుతూ, ఆయుర్వేద
దినోత్సవ వేడుకలు, ముఖ్యాంశాలను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద
సైన్స్ (సి సి ఆర్ ఎ ఎస్) 2023లో ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమాలకు దేశం లని 30
యూనిట్ లతో కలసి సమన్వయ సంస్థగా వ్యవహరిస్తుంది.

*****



(Release ID: 1966748) Visitor Counter : 51