బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖలో జోరుగా స్వచ్ఛత కార్యక్రమం


- స్వచ్ఛత ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 బొగ్గు పీఎస్‌యుల క్రియాశీల భాగస్వామ్యం

- 763 ప్రాంతాలలో క్లీన్లీనెస్ డ్రైవ్ - పారవేయడం కోసం 5218 ఎంటీల చెత్త గుర్తింపు

Posted On: 10 OCT 2023 1:35PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ దాని పరిధిలోని అన్ని ఫీల్డ్ ఆఫీసులతో పాటుగా పి.ఎస్.యులలో స్వచ్ఛతపై ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0ని పాటిస్తోంది.  02 అక్టోబర్ 2023 నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమ సమయంలో సాధించాల్సిన లక్ష్యాలను గుర్తించే లక్ష్యంతో.. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రచార సన్నాహక దశ ప్రారంభమైంది. ప్రచారం యొక్క ప్రధాన దశ అధికారికంగా అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రారంభమైంది. అక్టోబర్ 31, 2023 వరకు కొనసాగుతుంది. ప్రజా ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడం, పార్లమెంటు సభ్యుల సూచనలు, పార్లమెంటు హామీలు, పరిశుభ్రత డ్రైవ్, స్క్రాప్‌ల తొలగింపు మరియు ఫైళ్లు మరియు ఇతర స్వచ్ఛత సంబంధిత కార్యకలాపాల నుండి వ్యర్థాల తొలగింపుపై ఈ  కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తోంది.  అదనపు కార్యదర్శి స్థాయిలో సన్నాహక సమావేశం బొగ్గు పీఎస్‌యులతో సహా అన్ని వాటాదారులతో వ్యూహాన్ని రూపొందించడానికి, అవగాహన కల్పించడానికి మరియు ప్రచారాన్ని విజయవంతంగా అమలు చేయడానికి మరియు ప్రత్యేక ప్రచారం యొక్క వివిధ కేటగిరీల లక్ష్యాలను సాధించడానికి మంత్రిత్వ శాఖ పరిధిలోని భాగస్వామ్య పక్షాల వారందరినీ సన్నద్ధం చేసింది.  సన్నాహక దశలో బొగ్గు మంత్రిత్వ శాఖ పరిశుభ్రత ప్రచారం కోసం 763 సైట్‌లను గుర్తించింది. మెరుగైన రికార్డు నిర్వహణ కోసం 129,301 భౌతిక ఫైల్‌లు & 59,213 ఈ-ఫైళ్లను సమీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారవేయడానికి మొత్తం 5218 ఎంటీ వ్యర్థ పదార్థాలు గుర్తించబడ్డాయి.  బొగ్గు మంత్రిత్వ శాఖ ఉత్తమ అభ్యాసాలుగా వివిధ కార్యకలాపాలను చేపడుతోంది. పర్యావరణానికి సంబంధించి శాశ్వత మార్పును ప్రభావితం చేసే పరిశుభ్రతను పెంపొందించడం మరియు కార్యాలయ అనుభవాలను మెరుగుపరిచేలా పరిసరాలను తీర్చి దిద్దడం..  ప్రచారం ముగిసేలోపు ఈ పనులను పూర్తి చేయాలని కోరుకుంటోంది.

 

***



(Release ID: 1966370) Visitor Counter : 53