సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 3.0 మొదటి వారంలో సాధించిన పురోగతిని సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్; దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని అనుబంధ/సబార్డినేట్/ ఫీల్డ్ ఆఫీసులు/ మిషన్‌లు/ రక్షణ సంస్థలు మరియు స్థాపనలు/ కార్యాలయాలు/ పిఎస్‌యులలో సంతృప్త విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు.


స్వచ్ఛతను సంస్థాగతీకరించడం మరియు పెండెన్సీని తగ్గించడం కోసం దేశవ్యాప్తంగా భారీ భాగస్వామ్యం స్వచ్ఛత కోసం 2.18 లక్షల సైట్లు గుర్తించబడ్డాయి

స్వచ్ఛత ఉద్యమం 42,000 సైట్లలో విజయవంతంగా నిర్వహించబడింది. తద్వారా 7.75 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ చేయబడింది. స్క్రాప్ పారవేయడం ద్వారా రూ. 28.23 కోట్ల ఆదాయం ఆర్జించబడింది

64,000 కంటే ఎక్కువ ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి, 743ఎంపీ రిఫరెన్స్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వబడ్డాయి మరియు 7.56 లక్షల భౌతిక ఫైల్‌లు సమీక్షించబడ్డాయి

Posted On: 09 OCT 2023 9:53AM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్..భారతదేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్న ప్రత్యేక స్వచ్చత ఉద్యమం 3.0 యొక్క మొదటివారం పురోగతిని సమీక్షించారు. అక్టోబర్ 2-7, 2023 మధ్య కాలంలో పెండెన్సీని తగ్గించడంలో మరియు స్వచ్ఛతను సంస్థాగతీకరించడంలో సాధించిన పురోగతిని అభినందించారు.

మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు మరియు వాటి ఫీల్డ్/అవుట్‌స్టేషన్ కార్యాలయాల్లో పెద్దఎత్తున పాల్గొనడం జరుగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పబ్లిక్ ఇంటర్‌ఫేస్‌తో కార్యాలయాలను కవర్ చేయడమే ప్రచారం యొక్క దృష్టి అని ఆయన పునరుద్ఘాటించారు. దేశంలోని అన్ని ప్రాంతాలలోని అన్ని అవుట్‌స్టేషన్ కార్యాలయాలు/రక్షణ సంస్థలు మరియు పిఎస్‌యులను కవర్ చేసేలా కార్యక్రమ  అమలులో సంతృప్త విధానాన్ని అనుసరించాలని మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లను ఆయన కోరారు.

ప్రత్యేక స్వచ్ఛతా ఉద్యమం 3.0 మొదటి వారంలో పరిమాణం మరియు స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల నుండి విస్తృతంగా భాగస్వామ్యాన్ని సాధించింది. 42000 కంటే ఎక్కువ సైట్‌లు కవర్ చేయబడ్డాయి మరియు అన్ని మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల నుండి 4000 ట్వీట్‌లు జారీ చేయబడ్డాయి. వేలాది మంది అధికారులు మరియు పౌరుల కృషి ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛత కోసం పెద్ద ఎత్తున ఉద్యమం సృష్టించింది.

ప్రత్యేక  స్వచ్ఛతా ఉద్యమం 3.0ని క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు మరియు భారత ప్రభుత్వ కార్యదర్శులు అమలులో నాయకత్వం మరియు మార్గదర్శకత్వం అందించడం ద్వారా సమీక్షించారు. మొదటి వారంలో అమలులో తపాలా శాఖ 12785 సైట్లలో, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 11588 సైట్లలో, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ 8652 సైట్లలో, సైనిక వ్యవహారాల శాఖ 3000 సైట్లలో మరియు ఎరువుల శాఖ 1585 సైట్లలో పరిశుభ్రత ప్రచారాన్ని నిర్వహించాయి.

ప్రత్యేక  స్వచ్ఛతా ఉద్యమం 3.0 యొక్క పురోగతి ప్రతిరోజూ ప్రత్యేక పోర్టల్ (https://scdpm.nic.in/)లో పర్యవేక్షించబడుతుంది. ప్రచారం పురోగతిని సమీక్షించేందుకు నోడల్ అధికారులతో సెక్రటరీ డిఏఆర్‌పిజి అధ్యక్షతన రెగ్యులర్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల ద్వారా 4,000కు పైగా ట్వీట్‌లు, డిఏఆర్‌పిజి హ్యాండిల్ ద్వారా 250 ట్వీట్లు, #SpecialCampaign3.0లో 300 ఇన్ఫోగ్రాఫిక్‌లు మరియు 115 పిఐబి స్టేట్‌మెంట్‌ల జారీతో ప్రత్యేక ప్రచారం 3.0 సోషల్ మీడియాలో గణనీయమైన ట్రాక్‌ను పొందింది.

అక్టోబర్ 2-7, 2023 నుండి ప్రత్యేక ప్రచారం 3.0 యొక్క 1వ వారంలో, కింది పురోగతి సాధించబడింది:

 

క్రమ సంఖ్య

అంశం

7, 2023 నాటికి

సాధించిన పురోగతి

1.

స్వచ్ఛత ప్రచార సైట్లు

42,072

2.

సమీక్షించబడ్డ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ ఫైల్‌లు

(భౌతిక ఫైల్‌లు + ఇ-ఫైళ్లు)

7,70,448

3

పరిష్కరించబడ్డ ప్రజా ఫిర్యాదులు + అప్పీళ్లు

66,641

4.

సంపాదించిన ఆదాయం (రూ. కోట్లలో)

28.23

5.

ఖాళీ స్థలం (లక్ష చ.అ.)

7.75

6.

ఎంపీ సూచనలు

743

 

ప్రత్యేక ప్రచారం 3.0 మొదటి వారంలో నిర్వహించిన ఉత్తమ అభ్యాసాలు:

  1. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ - గౌరవనీయ ఆర్థిక మంత్రి ద్వారా సిబిడిటి యొక్క సిపిజిఆర్‌ఏఎంఎస్‌ పై ఐ-గాట్ ప్రారంభం
  2. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ & పబ్లిక్ గ్రీవెన్స్ – ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ (ఐజిఎంఎస్)2.0ని డాక్టర్ జితేంద్ర సింగ్ 29 సెప్టెంబర్, 2023న ప్రారంభించారు
  3. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ - కృషి భవన్‌లో వర్టికల్ గార్డెన్స్
  4. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ –ఐటిఐ బెహ్రాంపూర్‌లో ప్లాస్టిక్ బాటిళ్ల నుండి ఏనుగు విగ్రహం
  5. ఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ -విఎన్‌ఐటి, నాగపూర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల నుండి చెక్ డ్యామ్‌లు
  6. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ – ఇ-వ్యర్థాల నుండి విలువైన లోహాలను సమర్ధవంతంగా తీయడానికి చక్రాలపై రీసైక్లింగ్
  7. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం - "రోజువారీ జీవితంలో స్వచ్ఛత" అనే అంశంపై పిల్లల కోసం పెయింటింగ్ పోటీ
  8. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్థిక సేవల విభాగం)-ఎస్‌బిఐ,పిబిబి సెక్టార్ 14 పంచకుల హర్యానాలో ప్రత్యేక ప్రచార 3.0 బ్యానర్ ప్రదర్శన పౌరులలో ప్రచారానికి విస్తృత ప్రచారం కల్పిస్తోంది
  9. పాఠశాల విద్య & అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ -సిబిఎస్‌ఈ పాఠశాల విద్యార్థులు తమ పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా మరియు పరిశుభ్రత మరియు స్థిరత్వం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా స్వచ్ఛతా ప్రచారంలో శ్రమదాన్ నిర్వహించారు.

డా.జితేంద్ర సింగ్ ప్రత్యేక ప్రచారాన్ని స్వీకరించడం ద్వారా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించడంపై అభినందించారు మరియు 2వ వారం చివరి నాటికి 50% లక్ష్యాలను సాధించే ఊపును కొనసాగించాలని అధికారులందరికీ పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్రచారం 3.0 అక్టోబర్ 31, 2023న ముగుస్తుంది. నవంబర్ 1వ వారంలో మూల్యాంకనం దశ  ప్రారంభమవుతుంది.

 

****



(Release ID: 1966220) Visitor Counter : 116