రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

"డివైన్ లైట్ హౌస్"కు శంకుస్థాపన చేసిన భారత రాష్ట్రపతి


- తమండోలోని దాసబాటియాలో గల ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు

Posted On: 27 JUL 2023 1:37PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  రోజు (జూలై 27, 2023) టమాండోలోని దసబాటియాలో ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ "డివైన్ లైట్ హౌస్"కి శంకుస్థాపన చేశారు. దీనికి తోడు సంవత్సర థీమ్‌ "సానుకూల మార్పుల సంవత్సరంప్రారంభించారు. ఈ థీమ్ ప్రకారం సెమినార్లు మరియు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రజాపితా బ్రహ్మ కుమారీస్‌ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, మహిళలు సామాజిక, ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. మానవాళికి భౌతిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి రెండూ అవసరమని రాష్ట్రపతి అన్నారు. సాంకేతికత మార్పుకు చోదకమని, మార్పు అనివార్యమని మరియు అభివృద్ధికి అవసరమని అన్నారు. భౌతిక మార్పులు మనకు ఆనందాన్ని ఇవ్వగలవని, ఆధ్యాత్మిక మార్గంలో అనుసరించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రజాపితా బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ధ్యానం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ద్వారా ఆధ్యాత్మికతకు బాటలు వేస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు కొన్ని ప్రతికూల ఆలోచనలు మన మనసులను కలవరపెడుతున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఆత్మపరిశీలన లేకపోవడం వల్ల మనం ప్రతికూల ఆలోచనలకు లోనవుతున్నాం అని రాష్ట్రపతి తెలిపారు. దీనితో మనలో అసూయద్వేషం అనే భావాలు పెరుగుతాయని ఆమె అన్నారుప్రతికూల ఆలోచనలను వదిలించుకుని సానుకూలత వైపు వెళ్లడమే నేడు మన ముందున్న అతిపెద్ద సవాలు అని ఆమె పేర్కొన్నారు. మానవాళికి అవగాహన కల్పించి ప్రజలను సానుకూల దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు బ్రహ్మ కుమారీస్ సంస్థ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.

******


(Release ID: 1943479)