గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఎస్‌సిఎస్‌టిఐ అక్రెడిటేష‌న్ ప్ర‌మాణాల‌ను నెర‌వేర్చేందుకు సంస్థ‌ల‌ను ఆధునీక‌రించి, బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి పెట్టాలిః హ‌ర్దీప్ సింగ్ పూరీ


ఈ ప్ర‌మాణాలు 21వ శ‌తాబ్దంలో త‌లెత్తుతున్న స‌వాళ్ళ‌ను ప్ర‌భావ‌వంతంగా ప‌రిష్క‌రించ‌డానికి శిక్ష‌ణా సంస్థ‌ల‌ను స‌న్న‌ద్ధం చేస్తాయి.

ప‌ట్ట‌ణ రంగంలో శిక్ష‌ణా సంస్థ‌ల స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి శ్రీ హ‌ర్దీప్ ఎస్ పూరీ

Posted On: 11 JUL 2023 3:42PM by PIB Hyderabad

 వివిధ పారామితుల ఆధారంగా ప‌ట్ట‌ణ రంంలోని శిక్ష‌ణా సంస్థ‌ల‌ను మంగ‌ళ‌వారంనాడు గృహ & ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాలు, పెట్రోలియం & స‌హ‌జ‌వాయువుల మంత్రి శ్రీ హ‌ర్దీప్ సింగ్ పూరీ స‌మీక్షించారు.  వ్య‌వ‌స్థాగ‌త ఏర్పాటు, సామ‌ర్ధ్య‌నిర్మాణం & నైపుణ్యాల అభివృది్ధ‌, సంస్థ మూల నైపుణ్యాల‌కు సంబంధించిన అంశాలు, ఆర్ధిక మ‌నుగ‌డ‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌లు వంటి ప‌లు పారామితుల ఆధారంగాను, సివిల్ స‌ర్వెంట్ల కోసం ఆన్‌లైన్ లో ఐజిఒటి ప్లాట్‌ఫాం (iGoT platform)లో ఉంచ‌ద‌గిన కోర్సుల వివ‌రాలు ఉంచేందుకు శిక్ష‌ణా సంస్థ‌ల‌ను స‌మీక్షించారు.  నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ ఫ‌ర్ సివిల్ స‌ర్వీసెస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూష‌న్స్ (ఎన్ఎస్‌సిఎస్‌టిఐ) అక్రెడిటేష‌న్ ప్ర‌మాణాల‌ను నెర‌వేర్చేందుకు ఈ సంస్థ‌ల‌ను ఆధునీక‌రించి, బ‌లోపేతం చేయ‌డంపై స‌మావేశం దృష్టి పెట్టింది. ఈ ప్ర‌మాణాలు 21వ శ‌తాబ్దంలో ఉద్భ‌విస్తున్న స‌వాళ్ళ‌ను ప్ర‌భావ‌వంతంగా ప‌రిష్క‌రించేందుకు ఈ శిక్ష‌ణా సంస్థ‌ల‌ను సిద్ధం చేస్తాయ‌ని మంత్రి ఉద్ఘాటించారు. 
మంత్రిత్వ శౄఖ ప‌రిధిలోని ఎనిమిది శిక్ష‌ణా సంస్థ‌ల‌ను స‌మీక్షించేందుకు గృహ & ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ (ఎంఒహెచ్‌యుఎ) నేడు ఒక్క‌డ స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ సంస్థ‌ల ప్ర‌స్తుత సామ‌ర్ధ్యాన్ని అంచ‌నా వేసి, మిష‌న్ క‌ర్మ‌యోగి పూర్తి ల‌క్ష్యాల‌తో క‌లిపాల‌న్నది స‌మావేశం ఉద్దేశ్యం. స‌మావేశానికి గృహ‌& ప‌ట్ట‌ణ‌వ్య‌వ‌హారాల మంత్రి శ్రీ హ‌ర్దీప్ పూరీ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా, హెచ్‌యుఎ కార్య‌ద‌ర్శి శ్రీ మ‌నోజ్ జోషి, సామ‌ర్ధ్య నిర్మాణ క‌మిష‌న్ (సిబిసి) స‌భ్యుడు శ్రీ ప్ర‌వీణ్ ప‌ర్దేశీ,  ఎంఒహెచ్‌యుఎ ప‌రిధిలోని ఎనిమిది శిక్ష‌ణా సంస్థ‌ల అధిప‌తులు, మంత్రిత్వ శాఖ‌, సిబిసికి చెందిన అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. 
గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దార్శ‌నిక చొర‌వ అయిన మిష‌న్ క‌ర్మ‌యోగి, భార‌తీయ బ్యూరోక్ర‌సీలో సామ‌ర్ధ్య నిర్మాణ చ‌ట్రాన్ని విప్ల‌వీక‌రించి, బ‌లోపేతం చేయ‌డాన్ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. సివిల్ స‌ర్వెంట్ల‌కు అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు, జ్ఞానం, దేశ అభివృద్ధికి, పాల‌న‌కు ప్ర‌భావ‌వంతంగా దోహ‌దం చేసే మాన‌సిక స్థితితో సంసిద్ధం చేయాల‌నే ఉద్దేశ్యంతో ప‌ని చేస్తుంది.  మిష‌న్ క‌ర్మ‌యోగి త్వ‌రిత‌గ‌తిన అభివృద్ధి చెందుతున్న దేశ‌పు ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికి అవ‌స‌ర‌మైన సంస్క‌రించిన పౌర సేవ‌ల కోసం గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త‌కు క‌ట్టుబ‌డి ఉంది. 
ఉద్భ‌విస్తున్న సివిల్ స‌ర్వెంట్ల అవ‌స‌రాల‌ను, ఆధునిక యుగ‌పు స‌వాళ్ళకు అనుగుణంగా శిక్ష‌ణా సంస్థ‌ల‌లో నిరంత‌ర మెరుగుద‌ల‌లు, కొత్త నైపుణ్యాలను తీసుకురావ‌డం ప్రాముఖ్య‌త నొక్కి చెప్ప‌డం జ‌రిగింది. సంస్థ‌ల వ్యాప్తంగా నాణ్య‌త క‌లిగిన‌, స‌మ‌ర్ధ‌త‌తో కూడిన శిక్ష‌ణ‌ను అందించేలా వాటిని వృద్ధి చేయ‌వ‌ల‌సిన ప్రాముఖ్య‌త‌ను ఎంఒహెచ్‌యుఎ కార్య‌ద‌ర్శి శ్రీ మ‌నోజ్ జోషి ఉద్ఘాటించారు. స‌మ‌ర్ధ‌వంత‌మైన నైపుణ్యాభివృద్ధికి శిక్ష‌ణా ప్ర‌మాణాల‌ను స‌మ‌న్వ‌యం చేయాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న ప‌ట్టి చూపారు. ఈ సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డం అన్న‌ది సివిల్ స‌ర్వెంట్ల సామ‌ర్ధ్యాల‌ను పెంపొందించ‌డంలో, వారు స‌మ‌ర్ధ‌వంతంగా దేశానికి సేవ‌ల‌ను అందించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. 
ఈ స‌మావేశంలో పాల్గొన్న ఎనిమిది శిక్ష‌ణా సంస్థ‌ల‌లో ఢిల్లీ మెట్రో రెయిల్ అకాడెమీ (డిఎంఆర్ఎ, ఢిల్లీ), నేష‌న‌ల్ సిపిడ‌బ్ల్యుడి అకాడెమీ, ఘ‌జియాబాద్‌, రీజిన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్ (ఆర్‌సియుఇఎస్ - ల‌క్నో, హైద‌రాబాద్‌, ముంబై), ది హ్యూమ‌న్ సెటిల్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (హెచ్ఎస్ఎంఐ - హ‌డ్కో, ఢిల్లీ), బిల్డింగ్ మెటీరియ‌ల్స్ అండ్ టెక్నాల‌జీ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ (బిఎంటిపిసి, ఢిల్లీ), సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ స్ట‌డీస్ (సియుఎస్, ఐఐపిఎ, ఢిల్లీ) ఉన్నాయి. 

 

***


(Release ID: 1938814)