మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనపై సమీక్ష సమావేశం


రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2023-24, కేంద్ర నిధుల వినియోగం, రాష్ట్ర వాటా విడుదల, ఎన్‌ఎన్‌ఏ సంబంధిత అంశాలపై దృష్టి సారించిన సమీక్షా సమావేశం

Posted On: 22 JUN 2023 4:15PM by PIB Hyderabad

భారత ఆర్థిక వ్యవస్థలో మత్స్య రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది జాతీయ ఆదాయం, ఎగుమతులు, ఆహారం మరియు పోషకాహార భద్రతతో పాటు ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. ఈ రంగం ప్రాథమిక స్థాయిలో 2.8 కోట్ల కంటే ఎక్కువ మంది మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులకు జీవనోపాధిని అందిస్తుంది. అలాగే మత్స్య విలువ గొలుసుతో మరింత మందికి ఉపాధి లభిస్తోంది. దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నవారికి ఇది ప్రధాన ఆదాయ వనరు.

రంగాల లాభాలను ఏకీకృతం చేయడానికి మరియు మత్స్య రంగ వేగవంతమైన వృద్ధిని కొనసాగించడానికి 2014 నుండి భారత ప్రభుత్వం చేపల ఉత్పత్తి మరియు ఉత్పాదకత, సాంకేతికత ఇన్ఫ్యూషన్ రంగాలలో బహుముఖ వ్యూహాలు మరియు కేంద్రీకృత జోక్యాల ద్వారా పరివర్తన మార్పులు/సంస్కరణలకు నాంది పలికింది. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు ఆధునీకరించడం, దేశీయ వినియోగం మరియు ఎగుమతులను పెంపొందించడం, వ్యవస్థాపకత మరియు ఉపాధి వృద్ధి మొదలైనవి మత్స్యకారులు మరియు చేపల పెంపకందారుల సంక్షేమంలో ప్రధానమైనవి. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై) (2020-21 నుండి 2024-25) రూ.20,050 కోట్ల పెట్టుబడితో ప్రారంభించబడింది. ఇందులో  కేంద్ర ప్రభుత్వ వాటా రూ.9407 కోట్లు.

ఇప్పటి వరకు, పిఎంఎంఎస్‌వై కింద 2020-21 నుండి 2022-23 వరకు రూ. 14,654.67 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. ఇప్పటి వరకు ఊహించిన పెట్టుబడిలో దాదాపు ~73% సాధించబడింది. అదేవిధంగా 2020-21 నుండి 2022-23 వరకు కేంద్ర వాటా రూ. 9,407 కోట్లకు గాను రూ. 6,140.82 కోట్ల కేంద్ర వాటా ఆమోదించబడింది.

పిఎంఎంఎస్‌వై నాల్గవ సంవత్సరంలోకి అడుగుపెట్టినందున పథకం అమలును వేగాన్ని వేగవంతం చేయాలని ఈ శాఖ  యోచిస్తోంది. దీని కోసం జూన్ 21 నుండి 24వ తేదీ వరకు శ్రీ అభిలాక్ష్ లిఖి, ఓఎస్‌డి,డిఒఎఫ్‌ (భారత ప్రభుత్వం) అధ్యక్షతన రాష్ట్రాలు/యుటిల సమీక్షా సమావేశాలను నిర్వహించాలని డిపార్ట్‌మెంట్ యోచిస్తోంది. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2023-24, కేంద్ర నిధుల వినియోగం, రాష్ట్ర వాటా విడుదల, ఎస్‌ఎన్‌ఏ సంబంధిత సమస్యలు మరియు 1 జూలై 2023 నుండి 31 మార్చి 2024 వరకు వర్గీకరించబడిన ప్రాజెక్టుల అమలు వ్యూహంపై చర్చ దృష్టి సారిస్తుంది.

ఈ సిరీస్‌లో మొదటి సమీక్ష సమావేశం జూన్ 21న నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎన్‌ఈఆర్)తో జరిగింది. సంబంధిత ఎన్‌ఈఆర్‌ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు మరియు భారత ప్రభుత్వ డిఒఎఫ్‌ సీనియర్ అధికారులతో సంభాషించారు. ఎన్‌ఈఆర్‌లో మత్స్య అభివృద్ధిపై నీతిఆయోగ్ అలాగే ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పిఎంఎంఎస్‌వైకింద (ఎఫ్‌వై 2020-21 నుండి ఎఫ్‌వై 2022-23) రూ. 958.26 కోట్ల విలువైన ప్రాజెక్ట్ రూ. 525.28 కోట్ల కేంద్ర వాటాతో మంజూరు చేయబడింది.ఎన్‌ఈఆర్‌లో మొత్తం ఊహించిన పెట్టుబడిలో 72% (రూ. 1331 కోట్లు) మరియు కేటాయించిన కేంద్ర వాటాలో 68.39% (రూ. 768 కోట్లు) సాధించింది. 2014కి ముందు ఎన్‌ఈఆర్‌ రాష్ట్రాలకు అటువంటి నిర్దిష్ట కేటాయింపులేవీ జరగలేదని గమనించాలి. మంజూరైన కార్యకలాపాల్లో కొత్త చెరువులు, సమీకృత చేపల పెంపకం, అలంకారం కోసం ఉపయోగించే చేపల పెంపకం, బయోఫ్లోక్, ఆర్‌ఎఎస్‌, హేచరీలు, బ్రూడ్ బ్యాంక్‌లు, ఫీడ్ మిల్లులు మొదలైన ఉన్నాయి.

 

image.pngimage.png


 
సమావేశ ఎజెండా ప్రకారం ఆర్థిక, భౌతిక పురోగతిపై చర్చించారు. అన్ని రాష్ట్రాలు ఆమోదించబడిన కార్యకలాపాలు/ప్రాజెక్టుల గ్రౌండింగ్ మరియు అమలును వేగవంతం చేయాలని మరియు తదుపరి విడత నిధుల విడుదల కోసం యుటిలైజేషన్ సర్టిఫికేట్‌ల (యూసిలు) సమర్పణను నిర్ధారించాలని హైలైట్ చేయబడింది. అదనంగా ఎస్‌ఎన్‌ఏ సమ్మతిని నెరవేర్చడానికి, నెలవారీ పురోగతి నివేదిక (ఎంపిఆర్‌) ప్రయాశ్‌ మరియు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) వంటి ముఖ్యమైన నివేదికలను క్రమం తప్పకుండా సమర్పించడంతో పాటు రాష్ట్ర ఖజానా నుండి ఎస్‌ఎన్‌ఏకి లోటు మొత్తాన్ని బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలు కోరబడ్డాయి.

రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికలను ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ (పిఏసి) సమీక్షించిందని మరియు తదుపరి చర్య లేదా పునర్విమర్శ కోసం ప్రాజెక్ట్‌లను తరలించినట్లు రాష్ట్రాలకు తెలియజేయబడింది. ఇంకా ఎఫ్‌ఐ 20-21లో ఆమోదించబడిన అన్ని ప్రాజెక్ట్‌ల కోసం 100% కేంద్ర బాధ్యతలను క్లియర్ చేసినందుకు రాష్ట్రాలు ప్రశంసించబడ్డాయి. అస్సాం మరియు మణిపూర్ వంటి రాష్ట్రాలు వారి మంచి భౌతిక పురోగతికి మరియు ఎంఐఎస్‌పై లబ్ధిదారుల సమాచారాన్ని నింపినందుకు ప్రశంసించబడ్డాయి.


image.pngimage.png
 

వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడం కోసం మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులకు సంస్థాగత రుణాల యాక్సెస్‌ను సులభతరం చేయడానికి, కెసిసి దరఖాస్తులను పూరించడానికి లబ్ధిదారులను సమీకరించాలని రాష్ట్రాలు ప్రోత్సహించబడ్డాయి.

ప్రాజెక్ట్‌ల గ్రౌండింగ్‌ను మెరుగుపరచడంలో నిరంతరం కృషి చేయడం మరియు నిర్ణీత సమయంలో ఆశాజనకమైన మెరుగుదలలను ప్రదర్శించడం కోసం రాష్ట్ర అధికారులు చర్చ మరియు పరిష్కారం కోసం ఆన్-గ్రౌండ్ సమస్యలు మరియు సవాళ్లను ముందుకు తెచ్చారు.


 

****



(Release ID: 1934691) Visitor Counter : 105