ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమెరికా కుచెందిన బౌద్ధ పండితుడు మరియు విద్యావేత్త ప్రొఫెసర్ శ్రీ రాబర్ట్ థుర్ మన్ తో సమావేశమైనప్రధాన మంత్రి

Posted On: 21 JUN 2023 8:26AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కు చెందిన బౌద్ధ పండితుడు, రచయిత మరియు పద్మ శ్రీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ శ్రీ రాబర్ట్ థుర్ మన్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రపంచ సవాళ్ళ కు పరిష్కారాల ను కనుగొనడం లో బౌద్ధ ధర్మం యొక్క విలువల ను ఏ విధం గా దారిదీపం గా ఉపయోగించుకోవచ్చో అనే అంశం పై ప్రధాన మంత్రి మరియు ప్రొఫెసర్ శ్రీ థుర్ మన్ లు వారి వారి ఆలోచనల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు.

బౌద్ధం తో భారతదేశం పెంచుకొంటున్న అనుబంధం గురించి మరియు బౌద్ధ వారసత్వాన్ని పరిరక్షించడం కోసం భారతదేశం చేస్తున్నటువంటి ప్రయాసల ను గురించి కూడా వారు చర్చించారు.

 

***


(Release ID: 1934164)