శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశానికి లావెండర్ రాజధానిగా, అగ్రి స్టార్టప్ గమ్యస్థానంగా ఆవిర్భవించిన భదేర్వా : కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


వన్ వీక్ వన్ ల్యాబ్ క్యాంపెయిన్ నిర్వహించిన సీఎస్ఐఆర్-ఐఐఐఎం

లావెండర్ ఫెస్టివల్ ను డే 1 ఈవెంట్ గా ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 04 JUN 2023 4:15PM by PIB Hyderabad

ఇది మనమంతా గర్వించే సమయం. భదేర్వా భారతదేశ లావెండర్ రాజధానిగా, అగ్రి స్టార్టప్ గమ్యస్థానంగా అవతరించింది.

 

జమ్మూలోని భదేర్వాలో రెండు రోజుల పాటు జరిగే లావెండర్ ఫెస్టివల్ ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

 

సిఎస్ఐఆర్- ఐఐటీ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, జమ్మూ వన్ వీక్ వన్ ల్యాబ్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ భదేర్వాను భారతదేశ పర్పుల్ విప్లవానికి జన్మస్థలంగా ,అగ్రి-స్టార్టప్ ల గమ్యస్థానంగా అభివర్ణించారు.

 

భదేర్వా లోయ కేంద్రంలోని ప్రస్తుత ప్రగతిశీల ప్రభుత్వ ఉత్తమ అభివృద్ధి ఉదాహరణ అని, దీనిని చాలా ముందుగానే జరుపుకోవాల్సిందని, భూమి, వాతావరణం పరంగా లావెండర్ సాగుకు భదేర్వా ఉత్తమ ప్రదేశం అని మంత్రి అన్నారు.

 

ఈ ప్రాంతంలో లావెండర్ సాగును డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, లావెండర్ ఉపాధి కల్పన ,పరిశోధనకు ఒక మార్గం అని, ఇది అనేక అభివృద్ధి నమూనాలను తెరుస్తుందని అన్నారు.

 

లావెండర్ సాగు చాలా మంది రైతుల జీవితాలను మార్చింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 99 వ మన్ కీ బాత్ లో, జమ్ముకశ్మీర్ లోని దోడా జిల్లా భదేర్వాలో సి ఎస్ ఐ ఆర్- ఆరోమా మిషన్ కింద

లావెండర్ సాగులో రైతులకు మద్దతు ఇవ్వడంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సిఎస్ ఐఆర్-ఐఐఐఎమ్) చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించడం హర్షణీయం.  రైతులు దశాబ్దాలుగా సంప్రదాయ మొక్కజొన్న సాగులో నిమగ్నమయ్యారని, కానీ కొందరు రైతులు భిన్నంగా ఏదో ఒకటి చేయాలని భావించారని ఆయన చెప్పారు. వారు పూల పెంపకం వైపు, అంటే పూల సాగు వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఇక్కడ రెండున్నర వేల మంది రైతులు లావెండర్ సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అరోమా మిషన్ ద్వారా కూడా దీనిని సులభతరం చేశారు. వీటిని అందజేశారు. ఈ కొత్త సాగు రైతుల ఆదాయాన్ని బాగా పెంచిందన్నారు.

 

సిఎస్ఐఆర్-అరోమా మిషన్ అనేది సిఎస్ఐఆర్ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్, దీని కింద జమ్మూ కాశ్మీర్లోని సమశీతోష్ణ ప్రాంతాలలో లావెండర్ సాగును ప్రోత్సహిస్తున్నారు.

చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ ఆధారిత స్టార్టప్ లను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టును కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)  డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు సీఎస్ఐఆర్-ఐఐఐఎం జమ్ముకశ్మీర్ లోని భదేర్వా, ఇతర ప్రాంతాల్లో లావెండర్ సాగును అమలు చేస్తోంది.

 

అనేక దశాబ్దాల శాస్త్రీయ జోక్యాలలో, సిఎస్ఐఆర్-ఐఐఐఎం తన ఎలైట్ వెరైటీ (ఆర్ఆర్ఎల్ -12) లావెండర్ సాగు ఆగ్రో టెక్నాలజీని అభివృద్ధి చేసింది. లావెండర్ రకం భారతదేశంలోని వర్షాధార సమశీతోష్ణ ప్రాంతాలలో సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. సిఎస్ఐఆర్-అరోమా మిషన్ కింద, సిఎస్ఐఆర్-ఐఐఐఎమ్ లావెండర్ సాగును ను ప్రవేశపెట్టింది . జమ్మూ కాశ్మీర్లోని వివిధ జిల్లాల రైతులకు 30 లక్షలకు పైగా ఉచిత లావెండర్ మొక్కలను అందించింది. లావెండర్ పంట సాగు, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ ప్యాకేజీని కూడా రైతులకు అందించారు. సీఎస్ఐఆర్-ఐఐఐఎం రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడంలో సహాయపడటానికి జమ్మూ కాశ్మీర్ అంతటా వివిధ ప్రదేశాలలో యాభై డిస్టిలేషన్ యూనిట్లను (45 ఫిక్స్డ్ , 5 మొబైల్) ఏర్పాటు చేసింది.

 

జమ్మూ డివిజన్ లోని సమశీతోష్ణ ప్రాంతాలలో అనేక మంది చిన్న ,సన్నకారు మొక్కజొన్న రైతులు లావెండర్ సాగును విజయవంతంగా స్వీకరించారు. లావెండర్ సాగు జమ్మూ కాశ్మీర్ లోని భౌగోళికంగా మారుమూల ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో రైతులు , యువ పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించింది.

సిఎస్ఐఆర్-ఐఐఐఎమ్ జోక్యం కారణంగా, లావెండర్ సాగు చుట్టూ ఒక కొత్త పరిశ్రమ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందింది.

2500 మందికి పైగా రైతులు జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో లావెండర్ ను సాగు చేస్తున్నారు. మహిళలు ప్రధానంగా లావెండర్ పొలాల్లో పువ్వును కోయడానికి ,ప్రాసెసింగ్ చేయడానికి పనిచేస్తున్నారు, ఇది ఈ ప్రాంతంలో మహిళల ఆదాయాన్ని పెంచింది. చాలా మంది యువ పారిశ్రామికవేత్తలు లావెండర్ ఆయిల్, హైడ్రోసోల్ , పువ్వుల విలువ జోడింపు ద్వారా చిన్న-స్థాయి వ్యాపారాలను ప్రారంభించారు. సిఎస్ఐఆర్-ఐఐఐఎం అనేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది. లావెండర్ సాగు, ప్రాసెసింగ్, విలువ జోడింపు , మార్కెటింగ్ పై జమ్మూ కాశ్మీర్ కు చెందిన 2500 మందికి పైగా రైతులు, యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చింది.

 

మొక్కజొన్న నుంచి లావెండర్ సాగుకు మారిన రైతుల నికర వార్షిక ఆదాయం హెక్టారుకు సుమారు రూ.40,000 -రూ.60,000/- నుంచి రూ.3,50,000/- రూ.6,00,000/- కు పెరిగింది. దోడా జిల్లాలోని భదేర్వా రైతులు 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో వరుసగా 300, 500, 800, 1500 లీటర్ల లావెండర్ నూనెను ఉత్పత్తి చేశారు. పొడి పూలు, లావెండర్ మొక్కలు, లావెండర్ ఆయిల్ విక్రయించడం ద్వారా 2018-2022 మధ్య రూ.5.0 కోట్లు సంపాదించారు. అరోమా మిషన్ కింద జమ్మూలోని సిఎస్ఐఆర్-ఐఐఐఎం ద్వారా లావెండర్ సాగుపై విజయవంతమైన ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ బదిలీని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జాతీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా కవర్ చేసింది. సీఎస్ఐఆర్-ఐఐఐఎం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 'పర్పుల్ రివల్యూషన్'గా మీడియా గుర్తించింది. జమ్ముకశ్మీర్ లో లావెండర్ సాగు ద్వారా పర్పుల్ విప్లవానికి గానూ ఎస్ అండ్ టి ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ (సి ఎ  ఐ ఆర్ డి -2020) అవార్డు ను సీఎస్ ఐఆర్ అవార్డును అందుకుంది.

 

కార్యక్రమంలో సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, జమ్మూ సీఎస్ఐఆర్-ఐఐఐఎం డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్, దోడా డీడీసీ చైర్మన్ ధనేతార్ సింగ్, దోడా డీడీసీ వైస్ చైర్మన్ సంగీతారాణి భగత్, దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ పాల్ మహాజన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

<><><><>



(Release ID: 1929763) Visitor Counter : 238