ప్రధాన మంత్రి కార్యాలయం
జబల్పూర్లో పురాతన మెట్ల బావి పునరుద్ధరణపై ప్రధానమంత్రి ప్రశంస
प्रविष्टि तिथि:
02 JUN 2023 6:31PM by PIB Hyderabad
జబల్పూర్లో జల సంరక్షణ దిశగా స్థానికులు చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇందులో భాగంగా అక్కడి పురాతన మెట్ల బావిని ప్రజలు పునరుద్ధరించడంపై ఆయన అభినందనలు తెలిపారు.
దీనిపై లోక్సభ సభ్యుడు శ్రీ రాకేష్ సింగ్ ట్వీట్కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
“ఇది ఎంతయినా అభినందించదగిన కృషి! జల సంరక్షణలో జబల్పూర్ ప్రజా భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1929717)
आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam