ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమృత్కాల్ లో పేదలకు సాధికారత

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2023 6:26PM by PIB Hyderabad

ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో , ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్రభుత్వాలకు పేదరికం అనేది కీలకమైన సమస్య.
భారత్ వంటి వర్థమాన దేశంలో , పేదరికం సమస్యను పరిష్కరించడం సవాలుతో కూడుకున్నది. ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని
కేంద్రప్రభుత్వం  సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో అందరికీ సామాజిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
2014 నుంచి ప్రభుత్వం ఇందుకు సంబంధించి పలు చర్యలు తీసుకుంది. ఏ ఒక్కరూ వెనుకబడ కూడదని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, ప్రగతి ఫలాలు అందాలన్న  ఉద్దేశంతో చర్యలు తీసుకుంది.

గడచిన 9 సంవత్సరాలలో వివిధ ప్రభుత్వ పథకాలను సమర్ధంగా అమలు చేయడం, లక్షిత ప్రయోజనాలు అందరికీ అందేలా చేయడం,
వంటివి దేశవ్యాప్తంగ సమగ్ర అభివృద్ధికి దోహదపడ్డాయి.
ప్రధానమంత్రి కార్యాలయం, ప్రధానమంత్రి వెబ్సైట్నుంచి ఒక వ్యాసాన్ని షేర్ చేసింది.

***

DS/SKS


(రిలీజ్ ఐడి: 1929306) సందర్శకుల సూచీ సంఖ్య : : 221