సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

భువనేశ్వర్ లో జరిగిన జీ-20 సంస్కృతి బృందం (కల్చర్ గ్రూప్)  రెండో రోజు చర్చలలో పాల్గొన్న మీనాక్షి లేఖి


కల్చర్ కనెక్ట్; అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఇది ఒక మార్గం: మీనాక్షిలేఖి 

ఒడిశాలోని భువనేశ్వర్ లో ముగిసిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రెండవ జి 20 కల్చర్గ్రూప్ (సిడబ్ల్యుజి) సమావేశం చర్చా సెషన్లు

సమావేశం ముగింపు రోజున ప్రసిద్ధ ఉదయగిరి గుహలను సందర్శించిన ప్రతినిధులు

Posted On: 17 MAY 2023 2:17PM by PIB Hyderabad

రెండవ కల్చరల్ వర్కింగ్ గ్రూప్ (సీడబ్ల్యూజీ) సమావేశం చర్చా సెషన్ లు 2023 మే 16న ముగిశాయి. సిడబ్ల్యుజి సూచించిన 3 , 4 ప్రాధాన్య రంగాలపై దృష్టి సారించిన చర్చా సెషన్లలో ప్రతినిధులు పాల్గొన్నారు: సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమల ప్రమోషన్ క్రియేటివ్ ఎకానమీ' ,'సంస్కృతి రక్షణ, ప్రమోషన్ కోసం డిజిటల్ టెక్నాలజీలను పెంచడం'. ఈ చర్చలు విలువైన అంతర్దృష్టులను అందించాయి, ఇవి సాంస్కృతిక రంగాన్ని ,ప్రపంచవ్యాప్తంగా విధాన ఫ్రేమ్ వర్క్ లకు సంబంధించిన సామర్థ్యాన్ని కలిగి ఉన్న స్పష్టమైన, కార్యాచరణ-ఆధారిత సిఫార్సులకు దారితీస్తాయని భావిస్తున్నారు.

 

సిడబ్ల్యుజి సమావేశంలో మొదటి రెండు సెషన్లలో ప్రతినిధులు ప్రకటనలు ఇచ్చారు, తరువాత మూడవ ,నాల్గవ ప్రాధాన్యతా రంగాలపై బహిరంగ చర్చ జరిగింది. సాంస్కృతిక, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ప్రత్యేక ప్రసంగంతో రెండవ సెషన్ ను ముగించారు. ముగింపు సెషన్ లో కల్చర్ వర్కింగ్ గ్రూప్ కార్యాచరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ,కాలక్రమాన్ని వివరించారు.

 

అమృత్ కాల్ కాలంలో అంటే 25 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలన్న ప్రధాన మంత్రి ఆకాంక్షను ప్రతిబింబిస్తూ, భారతదేశం ఒకప్పుడు ఉన్న స్థానాన్ని తిరిగి పొందడానికి నిజంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి మీడియా ప్రతినిధులతో అన్నారు. సంస్కృతి కి సంబంధించిన సంఘటిత స్వభావాన్ని నొక్కిచెప్పిన మంత్రి, "సంస్కృతి అనేది ప్రతి ఒక్కరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ముఖ్యంగా చాలా ఒత్తిడి , శ్రమ చూపుతున్న సమయంలో.ఒక మార్గ‘‘, అన్నారు. 'కల్చర్ కనెక్ట్స్'ను ప్రస్తావిస్తూ, జీ-20 తొలిసారిగా సంస్కృత పరంగా ప్రత్యేక గ్రూపుగా వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జీ-20 దేశాలు సామరస్యం, శాంతి గురించి మాట్లాడేటప్పుడు సంస్కృతిని దృష్టి లో పెట్టుకోవలసిన అవసరం ఉందన్నారు. అద్భుతమైన కళలు, సంస్కృతికి నిలయమైన 'ఉత్కర్ష్ కాలా కీ భూమి'గా రూపాంతరం చెందిన ఒడిశా లేదా ఉత్కల్ రాష్ట్రంలో రెండో కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

 

మే 16, 2023 న, ప్రతినిధులను ఒడిశాలోని పూరీ జిల్లాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కోణార్క్ సూర్య దేవాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించడానికి తీసుకెళ్లారు. హిందూ దేవుడైన సూర్యుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం 13 వ శతాబ్దంలో నిర్మించబడింది . కళింగ నిర్మాణకళలో ఒక కళాఖండంగా ఇది పరిగణించబడుతోంది. తరువాత, అదే సాయంత్రం జి -20 ప్రతినిధులను స్థానిక కళాకారులు గోటిపువా నృత్య ప్రదర్శనతో అలరించారు. ఇది పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం ఆలయ సంప్రదాయంతో ముడిపడి ఉన్న పురాతన నృత్య రూపాలలో ఒకటి. కేంద్ర మంత్రి శ్రీమతి లేఖి ఈ ప్రదర్శనకు విచ్చేసిన ప్రముఖులు, ప్రతినిధులను, ఎంతో ఉత్సాహం తో ఒడిషా సాంస్కృతిక సంపద చక్కని భాగాన్ని సృష్టించడంలో తమ వంతు కృషి చేసిన కళాకారులను సత్కరించారు.

 

దీంతో జీ-20 రెండో సాంస్కృతిక బృందం సమావేశం కింద నాలుగు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలు, మేధోమథన సమావేశాలు ముగిశాయి. జి 20 సభ్యదేశాలు, , అతిథి దేశాలు ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరైన రెండవ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశం, స్పష్టమైన, కార్యాచరణ ఆధారిత సిఫార్సుల దిశగా సాంస్కృతిక రంగం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను మరింత చర్చించడానికి ఒక వేదికను అందించింది. ఆరు సెషన్లు, గా రెండు రోజుల పాటు సాగిన కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలలో కల్చర్ ట్రాక్ ఆఫ్ ఇండియా జీ20 ప్రెసిడెన్సీ కింద పేర్కొన్న నాలుగు కీలక ప్రాధాన్య రంగాలపై దృష్టి సారించారు. 4 ప్రాధాన్యతా రంగాలు: సాంస్కృతిక సంపద రక్షణ -పునరుద్ధరణ; సుస్థిర భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించుకోవడం; సాంస్కృతిక ,సృజనాత్మక పరిశ్రమలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం; సంస్కృతి పరిరక్షణ ప్రోత్సాహం కోసం డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం.

 

ముగింపు రోజున కేంద్ర మంత్రి ప్రతినిధులతో కలిసి 2000 సంవత్సరాల క్రితం నాటి ఉదయగిరి గుహలను సందర్శించారు. భువనేశ్వర్ లోని గాంధీ శాంతి కేంద్రంలో మహాత్మాగాంధీ జీవితం, దార్శనికతకు అంకితం చేసిన మ్యూజియాన్ని కూడా వారు సందర్శించారు.

 

రాజధాని భువనేశ్వర్ శివార్లలోని ఉదయ్ గిరిలోని పురాతన రాతి గుహలను సందర్శించిన ప్రతినిధుల అభిప్రాయం గురించి అడిగినప్పుడు, ఇది ప్రతినిధులకు విజ్ఞాన భాగస్వామ్య అనుభవం అని మంత్రి అన్నారు. ఒడిశాలోని గొప్ప హస్తకళా నైపుణ్యం, సంస్కృతిని చూసి చాలా ఆశ్చర్యపోయామని ఆమె అన్నారు.

 

సాంస్కృతిక రంగానికి సంబంధించిన కీలక అంశాలు, సుస్థిర అభివృద్ధిలో దాని కీలక పాత్రపై చర్చించేందుకు సమ్మిళిత, సహకార వేదికను ప్రోత్సహించడమే సీడబ్ల్యూజీ సమావేశాల లక్ష్యం. సాంస్కృతిక వైవిధ్యం, సమ్మిళితత్వం ,సుస్థిరతను పెంపొందించడంలో సంస్కృతి పాత్రపై ప్రపంచ స్థాయిలో సంభాషణను ప్రోత్సహించడానికి ఈ సమావేశాన్ని ఉద్దెశించారు.

 

****



(Release ID: 1925109) Visitor Counter : 87


Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil