వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాన్ కీ బాత్ ( మనస్సులో ఆలోచనలు )కార్యక్రమాలు: దేశ రైతులకు స్ఫూర్తి కలిగించి ఉత్సాహం కలిగించేలా జరిగిన కొన్ని కార్యక్రమాలు

Posted On: 24 APR 2023 6:10PM by PIB Hyderabad

ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్ ' కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వివిధ సమకాలీన అంశాలపై దేశ ప్రజలతో మాట్లాడుతున్నారు. కార్యక్రమాన్ని మొట్ట మొదటిసారిగా శ్రీ నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 3న నిర్వహించారు. 2023 మార్చి వరకు ' మన్ కీ బాత్ ' కార్యక్రమాన్ని శ్రీ మోదీ 99 సార్లు నిర్వహించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలను కార్యక్రమంలో ప్రస్తావించారు. రైతులు, వ్యవసాయ రంగం తో సంబంధం ఉన్న వారిలో స్ఫూర్తి నింపి, వ్యవసాయ రంగంలో వినూత్న ఆలోచనలు అమలు జరిగేలా చూడడం, నూనె గింజలు, పప్పు ధాన్యాల దిగుబడి ఎక్కువ చేయడం,పరిశోదన శాలల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు  సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయడం, వాతావరణ మార్పులు తట్టుకొనే విధంగా వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం, సేంద్రియ వ్యవసాయం, సమగ్ర వ్యవసాయ విధానం, సహజ వనరుల పరిరక్షణ, తేనిటీగల పెంపకం, చిరు ధాన్యాల ఉత్పత్తి- వినియోగం, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం లాంటి అనేక ప్రధాన అంశాలను ప్రధానమంత్రి తన  ' మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించారు. రైతులు, వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న వర్గాలపై, మన్ కీ బాత్ ' కార్యక్రమం చూపించిన ప్రభావం, దీనివల్ల కలిగిన ప్రయోజనాలపై భారత వ్యవసాయ పరిశోదన సంస్థ (ఐసిఎంఆర్), న్యూఢిల్లీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ మేనేజ్మెంట్ ( మేనేజ్) అధ్యయనం నిర్వహించాయి. అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడి అయ్యాయి. మన్ కీ బాత్ కార్యక్రమంలో 

సహజ వనరుల పరిరక్షణ, సమగ్ర వ్యవసాయ విధానం లాంటి అంశాలపై సన్నకారు రైతులు ఉత్సాహం, ఆసక్తి చూపించారని అధ్యయనంలో తేలింది. వ్యవసాయం, వ్యవసాయ వ్యవస్థాపక రంగాలను ' మన్ కీ బాత్ ' ప్రభావితం చేసి స్ఫూర్తి నింపిందని అధ్యయనం వెల్లడించింది. చిరుధాన్యాలు పండిస్తున్న రైతులు ' మన్ కీ బాత్' కార్యక్రమంతో ప్రభావితం అయ్యారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించిన అంశాలు, కృషి విజ్ఞాన కేంద్ర నిపుణులు అందించిన సలహాలు, సూచనలు పాటించి  రైతులు ఎక్కువ దిగుబడి సాధించారు. రైతుల వ్యవస్థాపక శక్తి కూడా పెరిగిందని అధ్యయనం పేర్కొంది. 

'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొందిన అంకుర సంస్థలు రైతులకు ప్రయోజనం కలిగించే ఆవిష్కరణలపై దృష్టి సారించి పనిచేయడం ప్రారంభించాయి. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను ప్రధానమంత్రి పలుమార్లు ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఆలోచించిన రైతులు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యత గుర్తించి, మొబైల్ ఆధారిత సలహా సేవలు పొందుతూ క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేయడం ప్రారంభించారు.  వ్యవసాయ రంగంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు పంట దిగుబడి పెరిగింది. మార్కెట్ సమాచారం రైతులకు అందుబాటులోకి వచ్చింది. 

'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చిన డ్రోన్ల అంశంపై కూడా అధ్యయనం జరిగింది. డ్రోన్ పరిజ్ఞానం వ్యవసాయ రంగానికి ప్రయోజనం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేశారు. అయితే, కొంతమంది రైతులు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం క్లిష్టంగా ఉందని దీనిని ఉపయోగించడం కష్టంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 

'మన్ కీ బాత్' కార్యక్రమం రైతు ఉత్పత్తి సంఘాలపై కూడా సానుకూల ప్రభావం చూపించింది. వ్యవసాయ వ్యాపార కార్యకలాపాలను సులువుగా నిర్వహించడం, అధిక దిగుబడినిచ్చే వంగడాల వివరాలు, ఉత్పత్తి వ్యయం తగ్గించడం (20 నుంచి 25% వరకు) అంశాలపై 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రభావం చూపింది. 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకార వివరాలు తెలుసుకున్నామని  రైతు ఉత్పత్తి సంఘం సభ్యులు తెలిపారు. తేనెటీగల పెంపకంపై కూడా 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రభావం కనిపించింది. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పాల్గొన్న  తేనెటీగల పెంపకం దారులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలు తెలుసుకుని ప్రభుత్వ సహకారం పొందడం ప్రారంభించారు. వ్యక్తిగతంగా  తేనెటీగల పెంపకం చెప్పడడం వల్ల వస్తున్న ఆదాయం ( 92,947 రూపాయలు) కంటే ఒక సమూహంగా ఏర్పడి కార్యక్రమాలు అమలు చేయడం వల్ల ఎక్కువ ఆదాయం ( 10 తేనెటీగలకు 1,28,328 రూపాయలు) పొందవచ్చునని రైతులు గుర్తించారు. అయితే, క్రిమి సంహారక మందుల వినియోగం, సరైన నిల్వ సదుపాయం లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని కొంతమంది రైతులు తెలిపారు. కిసాన్ రైల్ సదుపాయం వివరాలు కూడా 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా రైతులకు చేరాయి. తక్కువ కాలంలో పాడైపోయే ప్రమాదం ఉన్న ఆహార ఉత్పత్తులను కిసాన్ రైల్ ద్వారా వేగంగా రవాణా చేసి, మధ్య దళారుల ప్రమేయం లేకుండా  తగిన ధర పొందవచ్చు అన్న వాస్తవాన్ని 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా రైతులు గుర్తించారు. 

సహజ వ్యవసాయం/ సేంద్రియ వ్యవసాయ విధానాలకు 'మన్ కీ బాత్' కార్యక్రమం తగిన ప్రచారం కల్పించి, రైతుల్లో అవగాహన పెంచింది. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రత్యేక అంశాలతో పాటు వివిధ కాలాల్లో చేపట్టవలసిన అంశాలను ప్రస్తావిస్తే భవిష్యత్తులో కార్యక్రమం మరింత ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని కొంతమంది రైతులు వ్యక్తం చేశారు.  'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా తాము అనేక విలువైన అంశాలు తెలుసుకున్నామని, వివిధ వ్యవసాయ కార్యక్రమాలపై కార్యక్రమం సానుకూల ప్రభావం  చూపిందని మెజారిటీ రైతులు అభిప్రాయపడ్డారు. 

గమనిక: రెండు సంస్థలు నిర్వహించిన అధ్యయన నివేదికలు  ఇండియన్ జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్(),ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్[2023, 59 (3):1-6; 2023, 59(3):8-13)]; జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్స స్టెయినబుల్ డెవలప్‌మెంట్ [2023, 18(1): 315-327; 2023, 18(1): 79-88]మరియు జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ [2023, XXIV (1): 1-21;2023, XXIV నం. (1):51-83 లో ప్రచురితం అయ్యాయి. వీటిని ఆన్ లైన్ లో చూడవచ్చు. 

 

***


(Release ID: 1919367)