వ్యవసాయ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        భారతదేశం జి-20 అధ్యక్షతలో100వ  జి-20 సమావేశం, వారణాసిలో విజయవంతంగా ముగిసిన వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం (ఎంఏసిఎస్)
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                19 APR 2023 4:17PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                “సుస్థిర వ్యవసాయం;  ఆరోగ్యవంతమైన ప్రజలు, భూమండలానికి అవసరమైన ఆహార వ్యవస్థ” అనే అంశంపై జి-20 దేశాల వ్యవసాయ శాఖ ముఖ్య శాస్త్రవేత్తల (ఎంఏసిఎస్) సమావేశం వారణాసిలో నేటితో వారణాసిలో ముగిసింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ;  రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె.సింగ్ (రిటైర్డ్) ఈ సమావేశాన్ని 2023 ఏప్రిల్ 17న ప్రారంభించారు.
జి-20 సభ్యదేశాలు, ఆహూతులైన ఆతిథ్య దేశాలు, అంతర్జాతీయ సంఘాలకు చెందిన 80 మంది వరకు ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
మూడు రోజులు జరిగిన (2023 ఏప్రిల్ 17-19) ఈ సమావేశానికి కార్యదర్శి డాక్టర్ హిమాంశు పాఠక్ (డేర్), డైరెక్టర్  జనరల్  (ఐసిఏఆర్) డాక్టర్ హిమాంశు పాఠక్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
వ్యవసాయ ఆహార వ్యవస్థల పరివర్తనలో ఇన్నోవేషన్లు, టెక్నలాజికల్ చొరవలు;  ఆహార భద్రత, పోషకాహార సాధన కోసం సైన్స్ అండ్  టెక్నాలజీ హద్దులు;  పోషక విలువలు పెంచడంలో ఆహార పంటల బయో ఫోర్టిఫికేషన్;  పోషకాహారం, సాగర వృద్ధికి  ఉష్ణమండల సీవీడ్  వ్యవసాయం;  చిరుధాన్యాలు, ఇతర ప్రాచీన ఆహార ధాన్యాల అంతర్జాతీయ పరిశోధన కార్యక్రమం (మహరిషి);  సమగ్ర, ఏకీకృత వైఖరిగా వన్  హెల్త్ : సమన్వయపూర్వక కార్యాచరణ కోసం భాగస్వామ్యాలు, వ్యూహాలు;  సీమాంతర కీటకాలు, వ్యాధులు; ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల వ్యవసాయ-ఆహార వ్యవస్థకు ఆర్ అండ్  డి ప్రాధాన్యతలు;  సుస్థిర వ్యవసాయ-ఆహారం కోసం వాతావరణ పరిస్థితులను తట్టుకోగల టెక్నాలజీలు, ఇన్నోవేషన్లు;  ప్రకృతి సానుకూల వ్యవసాయం; ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల వ్యవసాయ-ఆహార వ్యవస్థ నిర్మాణానికి సైన్స్  అండ్  ఇన్నోవేషన్;   బయోలాజిల్  నైట్రిఫికేషన్  ఇన్ హిబిషన్ (బిఎన్ఐ) :  జిహెచ్ఎస్ వ్యర్థాల తగ్గింపు, పంట దిగుబడుల పెంపు; డిజిటల్  వ్యవసాయం, ట్రేసబులిటీ;  ఆహార నష్టం, వృధా తగ్గించడానికి డిజిటల్  టెక్నాలజీ సొల్యూషన్లు; అగ్రి-టెక్  స్టార్టప్ వ్యవస్థ;  బహుళ వ్యవసాయ విస్తరణ, సలహా సేవలు (ఇఎఎస్);  లేబరేటరీ నుంచి భూమికి చేరడాన్ని మెరుగుపరిచే భాగస్వామ్యాలు;   చిన్న కమతాలు, కుటుంబ వ్యవసాయం :  వ్యవసాయ-ఆర్ అండ్  డి కోసం జి-20 గ్లోబల్ సౌత్  సహకారం;  వ్యవసాయ ఆర్  అండ్  డిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు : ఏర్పాటులో అనుభవాలు, ఇన్నోవేషన్లు వేగవంతం అనే అంశాలపై చర్చలు కేంద్రీకృతం అయ్యాయి.
పోషకాహారం, ఆహార భద్రత కోసం వ్యవసాయ పరిశోధన, అభివృద్ధిలో సహకారం;  డిజిటల్  వ్యవసాయం;  ప్రతికూలతలను తట్టుకునే వ్యవసాయ ఆహార వ్యవస్థలు;  వ్యవసాయ ఆర్ అండ్  డిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు అనే అంశాలపై అధ్యక్షుని సందేశం, ఫలితాల పత్రాన్ని సమావేశం ఆమోదించింది. మహరిషి ప్రారంభానికి కూడా ఎంఏసిఎస్ 2023 మద్దతు ఇచ్చింది.
·       పరిశోధనాంశాలను పంపిణి చేయడంతో పాటు పరిశోధనలో వ్యత్యాసాలు, అవసరాలు గుర్తించడం కోసం  ప్రత్యేకంగా గుర్తించిన ఆహార ధాన్యాల పంటలపై కృషి చేస్తున్న పరిశోధకులు, సంస్థల అనుసంధానానికి అవసరమైన యంత్రాంగం ఏర్పాటు
·       పరిశోధకులను అనుసంధానం చేయడానికి, డేటా మార్పిడికి, పరిశోధన, సమాచార భాగస్వామ్యంతో పాటు  కమ్యూనికేషన్  ఉత్పత్తులు పంచుకునేందుకు వెబ్  వేదికల ఏర్పాటు
·       సామర్థ్యాల నిర్మాణ కార్యకలాపాలు;  అంతర్జాతీయ వర్క్  షాప్  లు, సమావేశాల నిర్వహణ
·       పనితీరు గుర్తింపు, శాస్త్రవేత్తల గుర్తింపు
 
భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్), హైదరాబాద్  లో ఇక్రిశాట్, సిజిఐఏఆర్ కేంద్రాలు, అంతర్జాతీయ సంఘాల  సాంకేతిక మద్దతుతో మహరిషి  సచివాలయం ఏర్పాటు చేస్తారు.
 
జి-20 ఎంఏసిఎస్  సందర్భంగా వ్యవసాయ పరిశోధనలో భవిష్యత్  సహకారం అనే అంశంపై ఫ్రాన్స్, యునైటెడ్  కింగ్  డమ్, అర్జెంటీనా, జర్మనీతో ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి
 
***
                
                
                
                
                
                (Release ID: 1918180)
                Visitor Counter : 311