రైల్వే మంత్రిత్వ శాఖ
ఈ వేసవి కాలంలో ప్రయాణీకులకు సాఫీగా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి అదనంగా 4010 ప్రత్యేక ట్రిప్పులకు రైల్వే విభాగం ఆమోదం
4010 ట్రిప్పులు తిరగనున్న 217 ప్రత్యేక రైళ్లు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన గమ్యస్థానాలను అనుసంధానించనున్న ప్రత్యేక రైళ్లు
Posted On:
11 APR 2023 4:43PM by PIB Hyderabad
ఈ వేసవి కాలంలో రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం, రద్దీకి తగ్గట్లుగా 217 ప్రత్యేక రైళ్లతో 4010 ట్రిప్పులను రైల్వే విభాగం నడుపుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన గమ్యస్థానాలకు అనుసంధానించేలా ప్రత్యేక రైళ్లను నడుపుతారు.

దౌర్జన్యంగా సీట్లను అక్రమించుకోవడం, సీటు ఇచ్చినందుకు డబ్బులు వసూలు చేయడం వంటి అవకతవకలపై రైల్వే విభాగం నిఘా పెడుతుంది. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధరణ అయితే తగిన చర్యలు తీసుకుంటుంది.
*****
(Release ID: 1915848)