శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో సైన్స్-20 సదస్సుల నిర్వహణ సన్నాహాలను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర అధ్యక్షతన సమీక్షించిన ఉన్నతస్థాయి సంయుక్త సమావేశం


కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రవిజ్ఞాన సలహాదారు డాక్టర్ అజయ్ కుమార్ సూద్.. శాస్త్ర-సాంకేతిక.. జీవ సాంకేతిక.. సీఎస్‌ఐఆర్.. ఎర్త్ సైన్సెస్.. అంతరిక్ష.. అణుశక్తి సహా ఆరు శాస్త్రవిజ్ఞాన మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యదర్శులు హాజరు;

హర్యానాలోని గురుగ్రామ్‌లోగల లీలా హోటల్‌లో 2023 మార్చి 1 నుండి 3 వరకు ‘అవినీతి నిరోధక కార్యాచరణ బృందం’ (ఏసీడబ్ల్యూజీ) తొలి సమావేశ నిర్వహణకు డాక్టర్ జితేంద్ర సింగ్ నేతృత్వంలో సిబ్బంది-శిక్షణ విభాగం (డీఓపీటీ) సంసిద్ధం;

జి-20 సైన్స్ సమావేశాలతో పాటు సైన్స్ అవార్డుల సమీక్ష.. విజ్ఞాన్
ప్రసార్సహా సంకల్ప్‌ సమావేశాలు ముగిశాక కొత్త కమ్యూనికేషన్
స్వరూపంపై సమీక్ష నేటి చర్చనీయాంశాల్లో భాగంగా ఉన్నాయి

Posted On: 23 FEB 2023 4:00PM by PIB Hyderabad

   జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో సైన్స్-20 సదస్సుల నిర్వహణ సన్నాహాలను ఇవాళ కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు-పెన్షనన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సంయుక్త సమావేశం సమీక్షించింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రవిజ్ఞాన సలహాదారు డాక్టర్ అజయ్ కుమార్ సూద్; శాస్త్ర-సాంకేతిక -జీవ సాంకేతిక, సీఎస్‌ఐఆర్, ఎర్త్ సైన్సెస్, అంతరిక్ష-అణుశక్తిసహా ఆరు శాస్త్రవిజ్ఞాన మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, హర్యానాలోని గురుగ్రామ్‌లోగల లీలా హోటల్‌లో 2023 మార్చి 1 నుండి 3 వరకు ‘అవినీతి నిరోధక కార్యాచరణ బృందం’ (ఏసీడబ్ల్యూజీ) తొలి సమావేశ నిర్వహణకు డాక్టర్ జితేంద్ర సింగ్ నేతృత్వంలో సిబ్బంది-శిక్షణ విభాగం (డీఓపీటీ) పూర్తిగా సిద్ధమైంది.

   భారత జి-20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణ కాలంలో దాదాపు 40 సమావేశాలు, అనుబంధ కార్యక్రమాలు వరుసగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జి-20 సైన్స్‌ సమావేశాల సన్నాహాలతోపాటు సైన్స్ అవార్డులు; విజ్ఞాన్ ప్రసార్‌, సంకల్ప్‌ సమావేశాలు ముగిశాక చేపట్టాల్సిన కొత్త కమ్యూనికేషన్ వ్యవస్థ స్వరూపం తదితరాలను కూడా నేటి సమావేశ చర్చనీయాంశాల్లో చేర్చారు. తన అధ్యక్షతన ఆరు శాస్త్రవిజ్ఞాన మంత్రిత్వశాఖలు, విభాగాలతో జరిగిన ఈ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వివరాలు వెల్లడించారు. రాబోయే జి-20 శిఖరాగ్ర సదస్సు సంబంధిత బందోబస్తు గురించి అన్ని అంశాలపైనా కార్యక్రమాన్ని ఖరారు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే శాస్త్రవిజ్ఞాన మంత్రిత్వ శాఖలకు అప్పగించిన చర్చనీయాంశాలు, ఇతర విషయాలపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

   సైన్స్‌-20 సదస్సు, సమాంతర సమావేశాలతోపాటు ముఖ్యమైన కార్యక్రమం ‘పరిశోధన-ఆవిష్కరణలతో కూడిన చర్చాగోష్ఠి (ఆర్‌ఐఐజి) నిర్వహణ బాధ్యతను కూడా ‘డిఎస్‌టి’కి అప్పగించినట్లు డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు. కాగా, “ఆవిష్కరణాత్మక-సుస్థిర వృద్ధి కోసం వినూత్న శాస్త్రవిజ్ఞానం” ఇతివృత్తంగా సైన్స్‌-20 ప్రధాన సదస్సు 2023 జూలై 21, 22 తేదీల్లో కోయంబత్తూర్‌లో జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతోపాటు “హరిత భవిష్యత్తు కోసం సంప్రదాయేతర ఇంధనం, సమాజంతో శాస్త్రవిజ్ఞాన అనుసంధానం, సంస్కృతి-సమగ్ర ఆరోగ్యం: చికిత్స-రోగనివారణ” వంటి ఉప ఇతివృత్తాలతో చర్చాగోష్టులు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. సైన్స్‌-20 సమావేశాల తేదీలు, వేదికల వివరాలను కూడా ఆయన వెల్లడించారు.

   మేరకు ప్రారంభ సమావేశం: పాండిచ్చేరి (2023 జనవరి 30-31); సమాంతర కార్యక్రమం-1: బంగారం ఐలాండ్‌, లక్షద్వీప్‌ (2023 ఫిబ్రవరి 27-28); సమాంతర కార్యక్రమం-2: అగర్తల (2023 ఏప్రిల్‌ 3-4); సమాంతర కార్యక్రమం-3: ఇండోర్ (2023 జూన్‌ 16-17). సైన్స్‌-20 కార్యదర్శి వర్గం భేటీకి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ (ఐఐఎస్‌సి)కు చెందిన డాక్టర్ విజయ్ పి.భట్కర్ అధ్యక్షత వహిస్తారు. ప్రొఫెసర్ అజయ్ కె.సూద్, ప్రొఫెసర్ గౌతమ్ దేశిరాజు కూడా ఇందులో ప్రముఖ సభ్యులుగా ఉన్నారు.

  ‘రిసెర్చ్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ ఫర్‌ ఈక్విటబుల్‌ సొసైటీ’ అంశంపై ‘పరిశోధన-ఆవిష్కరణలతో కూడిన చర్చాగోష్ఠి (ఆర్‌ఐఐజి) నిర్వహణ బాధ్యతను కూడా ‘డిఎస్‌టి’ చూసుకుంటుందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. ‘ఆర్‌ఐఐజి’కి సంబంధించి ఉప ఇతివృత్తాలు, చర్చనీయాంశాల్లో సుస్థిర ఇంధనం సరంజామా (సీఎస్‌ఐఇర్‌); సుస్థిర నీలి ఆర్థిక వ్యవస్థ సాధనలో శాస్త్రీయ సవాళ్లు-అవకాశాలు (ఎంఓఈఎస్‌); బయో-రిసోర్స్/బయోడైవర్సిటీ-బయో-ఎకానమీ (డిబిటి); పర్యావరణ-ఆవిష్కరణల సాధనకు అవకాశాలు, ఇంధన పరివర్తన (ఎస్‌ఇఆర్‌బి) తదితరాలను ఆయా శాఖలు, విభాగాలు చూసుకుంటాయన్నారు.

   మేరకు ‘ఆర్‌ఐఐజి’ కార్యక్రమాల తేదీలు, వేదికలు ఇలా ఉన్నాయి: ప్రారంభ సమావేశం: కోల్‌కతా (2023 ఫిబ్రవరి 9-10); సమాంతర కార్యక్రమం-1: రాంచీ (2023 మార్చి 21-22); సమాంతర కార్యక్రమం-2: దిబ్రూగఢ్‌/ఇటానగర్ (2023 మార్చి 24-25); సమాంతర కార్యక్రమం-3: సిమ్లా (2023 ఏప్రిల్ 19-20); సమాంతర కార్యక్రమం-4: డయ్యూ (2023 మే 18-19); ఆర్‌ఐఐజి ప్రధాన-రిసెర్చ్ మినిస్టర్ సమావేశం: ముంబై (2023 జూలై 4-6).

 

*****



(Release ID: 1901875) Visitor Counter : 148