ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

రెండవ రోజు కొనసాగిన డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (డి ఇ డబ్ల్యూ డి జి) తొలి సమావేశం


డిజిటల్ ఎకానమీలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), సైబర్ సెక్యూరిటీపై ప్రాధాన్య రంగాల గురించి చర్చలు

డిపిఐని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా, భారతదేశం 40 సంవత్సరాల అభివృద్ధిని అధిగమించింది.47 సంవత్సరాలలో సాధించాలని ఆశించిన పురోగతిని 7 సంవత్సరాలలో సాధించింది; ఏ దేశమైనా ఇప్పటికే అభివృద్ధి చెందిన డీపీఐలను ఉపయోగించుకోవచ్చు, వాటిపై నూతన ఆవిష్కరణలు చేయవచ్చు: శ్రీ అమితాబ్ కాంత్, జి 20 షెర్పా

డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ ఎకానమీకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ కీలకం: శ్రీ అల్కేష్ కుమార్ శర్మ, ఎంఈఐటీవై కార్యదర్శి, డీఈడబ్ల్యూజీ చైర్మన్

భూకంప బాధితులకు సంతాపం తెలియజేసిన చైర్మన్: ప్రస్తుత సంక్షోభంలో తుర్కియేకు భారత్ పూర్తి సంఘీభావం ప్రకటించిందని చైర్మన్ వెల్లడి

చర్చలలో పాల్గొన్న జీ20 సభ్యదేశాలు, 8 అతిథి దేశాలు

నాలెడ్జ్ భాగస్వాములుగా పాల్గొన్న
ఐటియు, యుఎన్ డిపి, ఒఇసిడి, యునెస్కో, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు

Posted On: 14 FEB 2023 5:27PM by PIB Hyderabad

మొదటి డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (డిఇడబ్ల్యుజి) సమావేశం రెండవ రోజు కూడా జి 20 సభ్యులు, నాలెడ్జ్ భాగస్వాములు 8 అతిథి దేశాల చురుకైన భాగస్వామ్యంతో ముమ్మరంగా కొనసాగింది, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), డిజిటల్ ఎకానమీలో సైబర్ సెక్యూరిటీ అనే రెండు కీలక ప్రాధాన్య రంగాలపై చర్చించారు.

 

ఎంఈఐటీవై జాయింట్ సెక్రటరీ,  కో-చైర్మన్ శ్రీ సుశీల్ పాల్  స్వాగతోపన్యాసంతో రెండవరోజు సమావేశం ప్రారంభమైంది. అనంతరం ఎంఈఐటీవై కార్యదర్శి, డీఈడబ్ల్యూజీ చైర్మన్ శ్రీ అల్కేష్ కుమార్ శర్మ ప్రారంభోపన్యాసం చేసి,  చర్చలకు అజెండాను నిర్దేశించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకం. డిజిటల్ ఎకానమీ స్థితిస్థాపకత , సైబర్ భద్రత అత్యంత ముఖ్యమైనవని, అసమానత అంతరాన్ని పూడ్చడానికి , భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడానికి డిజిటల్ నైపుణ్యం ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు.

 

ట్రోయికా సభ్యదేశాలైన ఇండోనేషియా, బ్రెజిల్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించి భారత్ జీ20 ఎజెండాకు మద్దతు తెలిపాయి.

 

భారతదేశ జి 20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ ముఖ్యోపన్యాసం చేశారు, ఆయన చేరిక, సామాజిక సేవల పంపిణీ, డిజిటల్ స్పేస్ లో గుత్తాధిపత్యాన్ని నిరోధించడం  భద్రత, గోప్యత , పాలన పరంగా డిపిఐ సాధించిన విజయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆధార్, మోసిప్, కోవిన్, డిజిలాకర్, ఉమాంగ్, డీఈపీఏ, ఓఎన్డీసీ, యూలిప్ వంటి భారతీయ డీపీఐల పూర్తి వివరాలను పంచుకున్నారు. డిపిఐని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా, భారతదేశం 40 సంవత్సరాల అభివృద్ధి , పురోగతిని అధిగమించింది, ఇది 47 సంవత్సరాలలో సాధించబడుతుందని ఆశించబడింది. ఏ దేశమైనా ఇప్పటికే అభివృద్ధి చేసిన డీపీఐలను ఉపయోగించుకోవచ్చు.

 

రోజంతా, జి 20 సభ్యులు, కీలక విజ్ఞాన భాగస్వాములు , అతిథి దేశాల నుండి అంతర్దృష్టితో కూడిన ప్రదర్శనలు జోక్యాలు జరిగాయి. తుర్కియేలో భూకంప బాధితులకు సంతాపం తెలిపేందుకు ప్రతినిధులు కాసేపు సమయం తీసుకున్నారు.

 

కో-చైర్మన్ శ్రీ సుశీల్ పాల్  ముగింపు ప్రసంగం చేశారు.

 

***



(Release ID: 1899250) Visitor Counter : 213