ఆర్థిక మంత్రిత్వ శాఖ

టెక్స్ టైల్స్, అగ్రికల్చర్ మినహా ఇతర వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రేట్లు 21 నుంచి 13కు తగ్గింపు


ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్ తయారీ కోసం క్యాపిటల్ గూడ్స్ ,మెషినరీ దిగుమతిపై కస్టమ్ డ్యూటీ మినహాయింపు

వివిధ ఐటి , ఎలక్ట్రానిక్స్ భాగాలపై కస్టమ్ డ్యూటీ మినహాయింపు

ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీల డ్యూటీ స్ట్రక్చర్ లో సరిదిద్ద బడిన విలోమం

బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి డీనాట్రేటెడ్ ఇథైల్ ఆల్కహాల్ కు మినహాయింపు

ఆక్వాటిక్ ఫీడ్ దేశీయ తయారీకి పెద్ద పీట

ల్యాబ్ లో అభివృద్ధి చేసిన వజ్రాల తయారీలో ఉపయోగించే విత్తనాలపై ఎలాంటి కస్టమ్స్ సుంకం లేదు

నిర్దిష్ట సిగరెట్లపై జాతీయ విపత్తు సుంకం (ఎన్ సి సి డి)సుమారు 16% పెంపు

Posted On: 01 FEB 2023 12:54PM by PIB Hyderabad

ఎగుమతులను ప్రోత్సహించడం, దేశీయ తయారీని పెంచడం, దేశీయ విలువ జోడింపును పెంచడం,గ్రీన్ ఎనర్జీ ,మొబిలిటీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2023-24 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. "తక్కువ పన్ను రేట్లతో సరళీకృత పన్ను నిర్మాణం కట్టుబాటు భారాన్ని తగ్గించడానికి ,పన్ను పరిపాలనను మెరుగుపరచడానికి సహాయపడుతుంది" అని ఆర్థిక మంత్రి అన్నారు.

టెక్స్ టైల్స్, వ్యవసాయం మినహా ఇతర వస్తువులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) రేట్లను 21 నుంచి 13కు తగ్గించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

దీంతో బొమ్మలు, సైకిళ్లు, ఆటోమొబైల్స్, నాఫ్తా సహా కొన్ని వస్తువులపై బేసిక్ కస్టమ్ డ్యూటీలు, సెస్ లు, సర్ ఛార్జీల్లో స్వల్ప మార్పులు చేయాల్సి వచ్చింది.

 

గ్రీన్ మొబిలిటీ

బ్లెండెడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ పై పన్నులు పెరగకుండా ఉండేందుకు అందులో ఉన్న జీఎస్టీ పెయిడ్ కంప్రెస్డ్ బయో గ్యాస్ పై ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.  మొబిలిటీకి మరింత ఊతమిచ్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్ తయారీకి అవసరమైన క్యాపిటల్ గూడ్స్, యంత్రాల దిగుమతికి కస్టమ్స్ సుంకం మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

 

ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్

 

కెమెరా లెన్స్ వంటి కొన్ని భాగాలు, ఇన్ పుట్ ల దిగుమతిపై కస్టమ్స్ సుంకంలో ఉపశమనం కల్పించాలని, మొబైల్ ఫోన్ల తయారీలో దేశీయ విలువ జోడింపును మరింత బలోపేతం చేయడానికి బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్ పై రాయితీ సుంకాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. దశలవారీ తయారీ కార్యక్రమంతో సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ఫలితంగా 2014-15లో సుమారు రూ.18,900 కోట్ల విలువైన 5.8 కోట్ల యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,75,000 కోట్లకు పైగా విలువైన 31 కోట్ల యూనిట్లకు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. టెలివిజన్ల తయారీలో విలువ జోడింపును ప్రోత్సహించడానికి టీవీ ప్యానెల్స్ ఓపెన్ సెల్స్ భాగాలపై బిసిడిని 2.5 శాతానికి తగ్గించాలని కూడా ఆమె ప్రతిపాదించారు.

 

ఎలక్ట్రికల్

 

ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీపై బీసీడీని 7.5 శాతం నుంచి 15 శాతానికి, హీట్ కాయిల్స్ పై 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ మార్పు డ్యూటీ స్ట్రక్చర్ లో లోపాన్ని సరిదిద్దడంతో పాటు ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీల తయారీని ప్రోత్సహిస్తుంది.

 

రసాయనాలు - పెట్రోకెమికల్స్

 

ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి , ఇంధన మార్పు కోసం భారతదేశం ప్రయత్నాన్ని సులభతరం చేయడానికి, డీనాట్రేటెడ్ ఇథైల్ ఆల్క హాల్ పై బిసిడి ని మినహాయించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దేశీయ ఫ్లోరోకెమికల్స్ పరిశ్రమను పోటీ పడేలా చేయడానికి యాసిడ్ గ్రేడ్ ఫ్లోర్ స్పార్ పై బిసిడి ని 5% నుండి 2.5% కు తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఎపికోలోర్హైడ్రిన్ తయారీలో ఉపయోగించడానికి ముడి గ్లిజరిన్ పై బిసిడిని 7.5% నుండి 2.5% కు తగ్గించాలని ప్రతిపాదించారు.

 

సముద్ర ఉత్పత్తులు

 

సముద్ర ఉత్పత్తుల ఎగుమతి పోటీతత్వాన్ని పెంచడానికి రొయ్యల దాణా దేశీయ తయారీకి బిసిడిని తగ్గించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.గత ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తులు అత్యధిక ఎగుమతి వృద్ధిని నమోదు చేశాయని, ఇది దేశంలోని తీరప్రాంత రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె పేర్కొన్నారు.

 

ప్రయోగశాలలో పెరిగిన వజ్రాలు

 

ల్యాబ్ గ్రోత్ డైమండ్స్ తయారీలో ఉపయోగించే విత్తనాలపై బీసీడీని ప్రస్తుతమున్న 5 శాతం నుంచి రద్దు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు.

సహజ వజ్రాల పరిశ్రమ కటింగ్,

పాలిషింగ్ లో విలువ ద్వారా అంతర్జాతీయ టర్నోవర్ లో భారతదేశం నాలుగింట మూడొంతులు దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

సహజసిద్ధమైన వజ్రాల నిక్షేపాలు క్షీణించడంతో పరిశ్రమ ల్యాబ్ గ్రోత్ డైమండ్స్ వైపు అడుగులు వేస్తోంది

 

విలువైన లోహాలు

 

డ్యూటీ వ్యత్యాసాన్ని పెంచడానికి దోరే, బంగారు కడ్డీలు, ప్లాటినంతో తయారు చేసే వస్తువులపై సుంకాలను పెంచాలని మంత్రి ప్రతిపాదించారు. బంగారం, ప్లాటినం కడ్డీలపై కస్టమ్స్ సుంకాలను ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెంచారు.

బంగారం, ప్లాటినంతో సమానంగా వెండి దోరలు, కడ్డీలు, వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచాలని ఆమె ప్రతిపాదించారు.

 

లోహాలు

 

ఉక్కు రంగానికి ముడి సరుకుల లభ్యతను సులభతరం చేయడానికి,

సి ఆర్ జి ఒ స్టీల్, ఫెర్రస్ స్క్రాప్ , నికెల్ కాథోడ్ తయారీకి ముడి పదార్థాలపై బిసిడి నుండి మినహాయింపును కొనసాగించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ప్రధానంగా

ఎంఎస్ఎం ఇ రంగంలో ఉన్న సెకండరీ రాగి ఉత్పత్తిదారులకు ముడి పదార్థాల లభ్యతను నిర్ధారించడానికి రాగి స్క్రాప్ పై 2.5% రాయితీ బిసిడిని కొనసాగించాలని ఆమె ప్రతిపాదించారు.

 

కాంపౌండెడ్ రబ్బరు

 

సుంకం ఉల్లంఘనను అరికట్టడానికి, కాంపౌండెడ్ రబ్బర్ పై బిసిడి రేటును 10% నుండి '25% లేదా కిలోకు రూ.30 ఏది తక్కువైతే అది పెంచాలని శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు.

 

సిగరెట్లు

నిర్దేశిత సిగరెట్లపై జాతీయ విపత్తు సుంకాన్ని (ఎన్ సి సి డీ) 16 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీనిని చివరిసారిగా మూడు సంవత్సరాల క్రితం సవరించారు.

జీఎస్ టి చట్టాల్లో లెజిస్లేటివ్ మార్పులు

 

సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 132, 138లకు సవరణలు ప్రతిపాదించారు.

వస్తువులు లేదా సేవల సరఫరా లేదా రెండింటినీ సరఫరా చేయకుండా ఇన్వాయిస్లు జారీ చేసిన నేరం మినహా, జిఎస్ టి కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి పన్ను మొత్తం కనీస పరిమితిని రూ .1 కోటి నుండి రూ .2 కోట్లకుపెంచడం; .కాంపౌండింగ్ మొత్తాన్ని పన్ను మొత్తంలో ప్రస్తుత 50% నుండి 150% వరకు 25% నుండి 100% వరకు తగ్గించడం; సిజిఎస్ టి చట్టం, 2017 లోని ఏ అధికారి అయినా తన విధులు నిర్వర్తించడంలో ఆటంకం కలిగించడం లేదా నిరోధించడం వంటి సెక్షన్ 132 లోని సబ్ సెక్షన్ (1) క్లాజ్ (జి), (జె) ,(కె) కింద పేర్కొన్న కొన్ని నేరాలను నేరంగా పరిగణించడం; రిటర్న్‌లు/స్టేట్‌మెంట్‌ల ఫైల్‌ను దాఖలు చేసే సమయాన్ని గడువు తేదీ నుండి గరిష్టంగా మూడేళ్ల కాలానికి పరిమితం చేయడానికి సీ జీ ఎస్ టి చట్టం, 2017లోని 37, 39, 44 , 52 సెక్షన్‌లను సవరించాలని కూడా శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు,

******



(Release ID: 1895582) Visitor Counter : 237