ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

శోషరస ఫైలేరియాసిస్ (ఎల్ఎఫ్) నిర్మూలనకు భారతదేశ రోడ్‌మ్యాప్‌పై


కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జాతీయ సదస్సు

భారతదేశానికి, ఎల్ఎఫ్ అనేది నిర్లక్ష్యం చేసిన వ్యాధి కాదు, నిర్మూలనకు ప్రాధాన్యత కలిగిన వ్యాధి: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"ఐదు కోణాల రోడ్‌మ్యాప్ ద్వారా గ్లోబల్ టార్గెట్ కంటే మూడేళ్ల ముందు 2027 నాటికి
శోషరస ఫైలేరియాసిస్‌ను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుందాం"

Posted On: 13 JAN 2023 1:49PM by PIB Hyderabad

“భారతదేశానికి, శోషరస ఫైలేరియాసిస్ (ఎల్ఎఫ్) అనేది కొన్ని ఇతర దేశాల్లో లాగ నిర్లక్ష్యం చేసిన వ్యాధి కాదు, కానీ సమయానుకూలంగా నిర్మూలనకు ప్రాధాన్యత కలిగిన వ్యాధి. 2027 నాటికి శోషరస ఫైలేరియాసిస్‌ను నిర్మూలించడానికి భారతదేశం కట్టుబడి ఉంది, మిషన్ మోడ్, మల్టీ పార్టనర్, మల్టీ సెక్టార్, టార్గెటెడ్ డ్రైవ్ ద్వారా ప్రపంచ లక్ష్యానికి మూడు సంవత్సరాలు ముందుగా మేము రోడ్‌మ్యాప్‌ను రూపొందించాము”. ఈ రోజు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ఎల్‌ఎఫ్) నిర్మూలనకు భారతదేశ రోడ్‌మ్యాప్‌పై జాతీయ సింపోజియం అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా పాల్గొన్నారు.

డాక్టర్ మాండవ్య మాట్లాడుతూ, ఇతర వ్యాధుల నిర్మూలనలో దేశానికి ఉన్న విస్తృత అనుభవం ద్వారా, ఎల్‌ఎఫ్ నిర్మూలన కోసం తాము ఒక  పునరుద్ధరించిన పంచముఖ వ్యూహంతో ముందుకు వచ్చామని అన్నారు. ఈ ఐదు స్తంభాలు క్రింది విధంగా ఉన్నాయి:

* బహుళ-ఔషధ పరిపాలన (ఎండిఏ) ప్రచారం సంవత్సరానికి రెండుసార్లు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (10 ఫిబ్రవరి మరియు 10 ఆగస్టు)తో సమకాలీకరించి ఉంది 

* ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్స; అనారోగ్య నిర్వహణ, వైకల్యం (ఎంఎండిపి) సేవలను బలోపేతం చేయడానికి వైద్య కళాశాలలతో ఏర్పాటు 

* బహుళ రంగాల సమన్వయ ప్రయత్నాలతో ఇంటిగ్రేటెడ్ వెక్టర్ నియంత్రణ

* అనుబంధ విభాగాలు, మంత్రిత్వ శాఖలతో ఇంటర్ సెక్టోరల్ కన్వర్జెన్స్

* ఎల్ఎఫ్ కోసం ఇప్పటికే ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవడం,  ప్రత్యామ్నాయ విశ్లేషణలను అన్వేషించడం

ఎల్‌ఎఫ్‌ని సకాలంలో నిర్మూలించాలనే భారతదేశ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ, భారతదేశం విభిన్న భౌగోళిక, సామాజిక-ఆర్థిక పరిమాణాలు ఉన్నప్పటికీ, ప్రతి ప్రాంతం,  భాగస్వామికి దాని బలాలు ఉన్నాయని  డాక్టర్ మన్సుఖ్ మాండవియా అన్నారు. ఈ ప్రయత్నాన్ని ముగించే దిశగా సాగుతున్నప్పుడు దానిని ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డాక్టర్ మన్సుఖ్ మాండవియా నొక్కి చెప్పారు. జన్-భాగిదరి ద్వారా పోలియో రహితంగా ఉండవచ్చని భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పిందని, ఎల్ఎఫ్ నిరోధం కూడా అదే విధానానికి పిలుపునిస్తుందన చెప్పారు. ఇక్కడ వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్రం, రాష్ట్రాలలోని విభాగాలు, ఎన్ జి ఓ లు, సిఎస్ఆర్ ద్వారా ప్రైవేట్ రంగం, సామాజికంగా ప్రభావవంతులు మొదలైనవి సేవా, సహయోగ్ స్ఫూర్తితో కలిసి వస్తారని ఆయన తెలిపారు. మన ప్రాధాన్యతలను గుర్తించడం, మన ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేయడానికి మన బలాలను ఉపయోగించడం ఆధారంగా మన స్వంత "భారత నమూనా"ని కలిగి ఉంటామని ఆయన తెలిపారు. 

భారతదేశ అంత్యోదయ ఆలోచన విధానాన్ని  పునరుద్ఘాటిస్తూ, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్, ఎల్ఎఫ్ సమాజంలోని నిర్దిష్ట భౌగోళికాలను, ఎక్కువగా పేద, అణగారిన వర్గాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేసిన ఈ సమయానుకూలమైన, పునరుత్తేజిత జోక్యాన్ని అభినందిస్తూ, వ్యాధిగ్రస్తుల బ్యాక్‌లాగ్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక శిబిరాలు, ప్రైవేట్ రంగం, అభివృద్ధి భాగస్వాముల ప్రమేయం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి వినూత్న పద్ధతులను కోరారు. తీవ్రతను తగ్గించడం. జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలలో స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం, సామూహిక విజిబిలిటీ ప్రచారాల ద్వారా ఏకకాల పరిశోధనల ఆవశ్యకతను వివరించారు. 

నాలుగు రాష్ట్రాలు (యుపి, ఒడిషా, తెలంగాణ, బీహార్) ~60% లింఫెడెమా కేసులను కలిగి ఉండగా, నాలుగు రాష్ట్రాలు (ఒడిషా, జార్ఖండ్, యుపి, బీహార్) ~ 80% హైడ్రోసెల్ కేసులను కలిగి ఉన్నాయి.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ (వర్చ్యువల్ గా ),  అదనపు కార్యదర్శి & మిషన్ డైరెక్టర్ (ఎన్హెచ్ఎం)  శ్రీమతి రోలీ సింగ్, జాయింట్ సెక్రటరీ శ్రీ రాజీవ్ మాంఝీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలసీ రూపకర్తలు, సీనియర్ ప్రభుత్వ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, పరిశోధన, అభివృద్ధి నిపుణులు పాల్గొన్నారు. 

 

కేంద్ర ఆరోగ్య మంత్రి చేసిన ఈ ట్వీట్ నుండి ఈవెంట్ సంగ్రహావలోకనం చూడవచ్చు:



(Release ID: 1891046) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Marathi , Odia , Tamil