మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దత్తత నిబంధనలు 2022 జారీ తర్వాత ఇప్పటి వరకు మొత్తం 691 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు; పెండెన్సీ 905 నుంచి 617కి తగ్గింది 2745 ఆర్‌ఐలు, 13 ఎన్‌ఆర్‌ఐలు, 15 ఓసిఐ, 38 విదేశీయులు మరియు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం కింద 5 కేసులు కొత్త మాడ్యూల్‌పై నమోదయ్యాయి

Posted On: 20 DEC 2022 12:46PM by PIB Hyderabad

సెప్టెంబర్ 2022 నెలలో దత్తత నిబంధనలు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా జిల్లా మెజిస్ట్రేట్‌లు అనేక దత్తత ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నేటి వరకు మొత్తం 691 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. నోటిఫికేషన్ తేదీలో 905 దత్తత ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు పెండింగ్‌ 617కి తగ్గింది. ఇప్పుడు కాబోయే పెంపుడు తల్లిదండ్రులు  (PAP) లు తమ సొంత రాష్ట్రాలు/ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఒకే సామాజిక-సాంస్కృతిక పరిసరాలకు చెందిన పిల్లలు మరియు కుటుంబం ఒకరితో ఒకరు చక్కగా సర్దుబాటు చేసుకునేలా ఇది తప్పనిసరి చేయబడింది.  10.11.2022 నుండి   మాడ్యూల్ అమలులోకి వచ్చింది మరియు అప్పటి నుండి 2745 భారతీయులు, 13  ప్రవాస భారతీయులు, 15 ఓవర్సీస్ కార్డ్ హోల్డర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI), 38 మంది విదేశీయులు మరియు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ (HAMA) కింద 5 కేసులు కొత్త మాడ్యూల్‌పై నమోదు చేయబడ్డాయి. దేశంలో దత్తతలను ప్రోత్సహించడానికి, దత్తత నిబంధనలు 2022లో ఒక కొత్త నిబంధన తప్పనిసరి చేయబడింది, ఇక్కడ వారి నిర్దేశిత రెఫరల్ సైకిల్స్‌లో పెంపుడు తల్లిదండ్రులను కనుగొనలేని పిల్లలలో, ఇప్పుడు సీనియారిటీతో సంబంధం లేకుండా భారతీయులు (RI), ప్రవాస భారతీయులు (NRI), ఓవర్సీస్ కార్డ్ హోల్డర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI), కాబోయే పెంపుడు తల్లిదండ్రులు (PAP) లకు దత్తత ఇస్తారు.ఈ చర్యను కాబోయే పెంపుడు తల్లిదండ్రులు  (PAPలు) స్వాగతించారు. నిబంధన కింద మొదటి రెఫరల్ 14.11.2022న అమలు చేయబడింది మరియు ఇప్పటివరకు 47 మంది పిల్లలు రిజర్వ్ చేయబడ్డారు. లేకుంటే ఈ పిల్లలను  విదేశీ పెంపుడు తల్లిదండ్రులకు సూచించబడేవారు. హెచ్ ఏ ఏం ఏ మాడ్యూల్ 10.11.2022 నుండి అమలు చేయబడింది. హెచ్ ఏ ఏం ఏ కింద దత్తత తీసుకున్న మరియు పిల్లలను విదేశాలకు తరలించాలనుకునే కాబోయే పెంపుడు తల్లిదండ్రుల నమోదును మాడ్యూల్ సులభతరం చేస్తుంది. ఇప్పటికే ఐదు కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా దత్తత ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దేశంలోని అన్ని డీ ఎం లు మాడ్యూల్‌లో నమోదు చేయబడ్డారు. ఇది అడాప్షన్ ఆర్డర్ జారీ ప్రక్రియను వేగవంతం మరియు పారదర్శకంగా చేసింది. సీ ఎం ఓ ద్వారా పిల్లల ఆరోగ్య స్థితిని ధృవీకరించడం కూడా ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ప్రారంభించబడింది. మాడ్యూల్‌లో ఇప్పటివరకు 338 సిఎంఓలు రిజిస్టర్ చేయబడ్డారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) జే జే చట్టం ప్రకారం పిల్లల చట్టపరమైన స్థితిని త్వరితగతిన ప్రకటించేందుకు వీలుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీల స్థాయిలో పెండెన్సీని తగ్గించే దిశగా క్రియాశీలక ప్రయత్నాలను తీసుకుంటోంది. సీ ఏ ఆర్ ఏ CARA హెల్ప్ డెస్క్ జోక్యంతో 23-09-2022న నిబంధనల నోటిఫికేషన్ తర్వాత, (నాలుగు నెలలకు మించి)సీ డబ్ల్యూ సీ పెండెన్సీ 812కి తగ్గింది. నిబంధనల నోటిఫికేషన్ తేదీ నుండి 19-12-2022 వరకు, 503 చట్టబద్ధంగా ఉచిత దత్తత (LFA) సర్టిఫికెట్‌లు అప్‌లోడ్ చేయబడ్డాయి.

 

23 సెప్టెంబర్, 2022న జారీ చేసిన దత్తత నిబంధనలు-2022లో దత్తత ప్రక్రియను రూపొందించినప్పటికీ, పిల్లలకు శాశ్వత పునరావాసం కల్పించేందుకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. జే జే నియమాలను 1 సెప్టెంబర్, 2022న ప్రకటించారు. జే జే నియమాలు 2022 ప్రకారం, దత్తత ఉత్తర్వు జారీ చేసే అధికారం జిల్లా మేజిస్ట్రేట్‌కు ఇవ్వబడింది. గతంలో ఈ అధికారాన్ని న్యాయవ్యవస్థ వినియోగించేది.

***


(Release ID: 1885062) Visitor Counter : 254