ఆర్థిక మంత్రిత్వ శాఖ

కర్ణాటకలోని బెంగళూరులో జి 20 ఇండియా ప్రెసిడెన్సీ కింద     భారతదేశం మొదటి జి 20 ఫైనాన్స్ , సెంట్రల్ బ్యాంక్డిప్యూటీల (ఎఫ్ సి బి డి) సమావేశానికి భారత్ ఆతిథ్యం

భారత అధ్యక్షత కింద జి 20 ఫైనాన్స్ ట్రాక్ ప్రారంభాన్ని సూచించే ఎఫ్ సి బిడి సమావేశానికి 160 మందికి పైగా ప్రతినిధులు హాజరు

 రెండు రోజుల ఎఫ్ సి బి డి సమావేశంలో గ్లోబల్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, గ్లోబల్హెల్త్, ఫైనాన్షియల్ సెక్టార్ , ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంశాలపై ఏడు సెషన్లలో చర్చలు 


‘‘21 వ శతాబ్దంలో పంచుకోబడిన అంతర్జాతీయ సవాళ్ళను పరిష్కరించడానికి ఎండిబిల బలోపేతం‘‘, 'క్లైమేట్ రిస్క్ మేనేజ్ మెంట్ లోను, గ్రీన్ ఫైనాన్సింగ్ లోను కేంద్ర బ్యాంకులపాత్ర' పై చర్చలు

Posted On: 14 DEC 2022 6:34PM by PIB Hyderabad

భారత అధ్యక్ష హయాంలో మొదటి జి 20 ఫైనాన్స్ , సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధుల సమావేశం 2022 డిసెంబర్ 13-14 తేదీలలో కర్ణాటకలోని బెంగళూరులో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైఖేల్ పాత్ర అధ్యక్షతన జరిగింది.

 

జీ20 సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సహా 160 మందికి పైగా విదేశీ

ఔత్సాహిక ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం భారత అధ్యక్ష హోదా కింద జీ-20 ఫైనాన్స్ ట్రాక్ ప్రారంభాన్ని సూచిస్తుంది.

 

రెండు రోజుల సమావేశంలో ఏడు చర్చా సెషన్లు, రెండు సైడ్ ఈవెంట్లను

నిర్వహించారు. వివిధ కళారూపాల ప్రదర్శన ద్వారా కర్ణాటక సాంప్రదాయ , సమకాలీన సంస్కృతిని ప్రతినిధులకు అందించారు.

 

ప్రధాన మంత్రి శ్రీ న lరేంద్ర మోదీ

దార్శనిక తను, భారత ప్రెసిడెన్సీ జి20 థీమ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ

సమావేశం ఎజెండాను రూపొందించారు.

 

వివిధ వర్క్ స్ట్రీమ్ ల్లో 2023 సంవత్సరానికి భారతదేశ జి 20 ఫైనాన్స్ ట్రాక్ ప్రాధాన్యతలపై జి 20 సభ్యుల అభిప్రాయాలను కోరే లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది. ప్రతినిధుల సమావేశం సందర్భంగా '21వ శతాబ్దపు భాగస్వామ్య గ్లోబల్ సవాళ్లను పరిష్కరించడానికి ఎండిబిలను బలోపేతం చేయడం' అనే అంశంపై ఒక సైడ్ ఈవెంట్ జరిగింది.

 

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బేరీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరిహద్దు సవాళ్లను పరిష్కరించడంలో ఎండిబిలు దేశాలకు ఎలా సహాయపడతాయనే అంశాన్ని చర్చించడంపై దృష్టి సారించారు. అమెరికా ఫైనాన్స్ డిప్యూటీ ఆండీ బాకోల్, సౌదీ అరేబియా ఫైనాన్స్ డిప్యూటీ ర్యాద్ అల్ ఖరీఫ్, ఏడీబీ డైరెక్టర్ జనరల్ టోమోయుకి కిమురా, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవేశ్ కపూర్ ప్యానలిస్టులుగా పాల్గొని ఈ అంశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'క్లైమేట్ రిస్క్ మేనేజ్ మెంట్ అండ్ గ్రీన్ ఫైనాన్సింగ్ లో సెంట్రల్ బ్యాంకుల పాత్ర' అనే అంశంపై మరో సైడ్ ఈవెంట్ కూడా జరిగింది.

 

ఎక్కువ మంది జి 20 ప్రతినిధి వర్గాలు, ఆహ్వానితులు , అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు బెంగళూరు సమావేశానికి భౌతికంగా హాజరు కావడం సవాళ్లతో కూడిన ప్రపంచ ఆర్థిక వాతావరణం మధ్య.భారతదేశ జి 20 అధ్యక్ష హోదాకు మద్దతు ఇవ్వడంలో ప్రపంచ నిబద్ధతను చాటుతోంది.

 

"వసుధైక కుటుంబం", "ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు" అనే ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ , ప్రమాదాలకు సంబంధించిన అంశాలపై, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండిబి) బలోపేతం చేయడం, ప్రపంచ రుణ దుర్బలత్వాన్ని నిర్వహించడం, ఆర్థిక వాతావరణ చర్య , సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డిజి) కు నిధులు సమకూర్చడం, రేపటి స్థితిస్థాపక, సమ్మిళిత ,స్థిరమైన నగరాల నిర్మాణంపై చర్చలు దృష్టి సారించాయి.

 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఫ్రేమ్ వర్క్ వర్కింగ్ గ్రూప్ ప్రాధాన్యతలపై మొదటి సెషన్ లో, జి 20 సభ్యులు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, ఆహార , ఇంధన అభద్రత, వాతావరణ మార్పుల స్థూల ఆర్థిక ప్రభావాలతో సహా ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించారు.

 

అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ సెషన్ లో, ప్రతినిధులు బహుళపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (ఎండిబి) బలోపేతంతో సహా వివిధ అంశాలపై చర్చించారు. ప్రపంచ రుణ సంక్షోభం, మూలధన ప్రవాహాలు , ప్రపంచ ఆర్థిక భద్రతా వలయం తో సహా కీలక అంశాలపై 2023 లో చేపట్టాల్సిన కార్యాచరణ పై అభిప్రాయాలను పంచుకున్నారు.

 

మౌలిక సదుపాయాల సెషన్ లో, "రేపటి ఫైనాన్సింగ్ సిటీస్: సమ్మిళిత, స్థితిస్థాపక స్థిరమైన" సహా మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ 2023 కోసం భారతదేశ ప్రాధాన్యతలపై చర్చలు జరిగాయి.

 

సుస్థిర ఆర్థిక సమస్యలపై సభ్యులు- సుస్థిర , స్థితిస్థాపక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వీలుగా వాతావరణ చర్యతో సహా.సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి) కోసం ఫైనాన్సింగ్ పై అభిప్రాయాలను పంచుకున్నారు,

 

ఒ.ఇ.సి.డి/జి 20 సమ్మిళిత ఫ్రేమ్ వర్క్ కింద అభివృద్ధి చేయబడుతున్న రెండు స్తంభాల పన్ను ప్యాకేజీ పురోగతిని పర్యవేక్షించడం, పన్ను పారదర్శకతను పెంచడం , పన్నులపై బహుపాక్షిక సామర్థ్య నిర్మాణంతో సహా 2023 కోసం ప్రాధాన్యతా రంగాలపై అంతర్జాతీయ పన్నుల గురించి సెషన్ లో గణనీయమైన చర్చలు జరిగాయి.

 

గ్లోబల్ హెల్త్ సెషన్ లో, జి 20 ప్రతినిధులు చర్చల్లోకి ప్రధాన ప్రాంతీయ సంస్థలను ఆహ్వానించడం ద్వారా తక్కువ ఆదాయ దేశాల స్వరాన్ని విస్తరించడంతో సహా.

ఆర్థిక ,ఆరోగ్య మంత్రిత్వ శాఖల మధ్య మహమ్మారి నివారణ సంసిద్ధత ,ప్రతిస్పందన (పిపిఆర్) మధ్య సమన్వయ ఒప్పందాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు,

 

ఈ సమావేశం చివరి సెషన్ లో ఫైనాన్షియల్ సెక్టార్ , ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సమస్యలను చర్చించారు. ఆర్థిక రంగ పరిణామాలు,ప్రజల కేంద్రీకృత దృష్టి ద్వారా ఆర్థిక సమీకృతాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాలపై చర్చలు దృష్టి సారించాయి. సముచిత ఆర్థిక నిబంధనలు ,ఉమ్మడి విధానం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం కోసం ప్రాధాన్యతలపై ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు.

 

మొత్తం మీద, 2023 లో భారతదేశ జి- 20 ఫైనాన్స్ ట్రాక్ ఎజెండా లోని ప్రతిపాదిత ప్రాధాన్యతలకు సమావేశంలో విస్తృత మద్దతు లభించింది. భారత జి-20 ప్రెసిడెన్సీ సమయంలో ఎజెండా అంశాల మరింత అభివృద్ధి అనేది ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీలు విస్తృత శ్రేణి దృక్కోణాలను సూచించే అభిప్రాయాలతో సుసంపన్నం అవుతుంది.

 

ఈ చర్చలు ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు కర్ణాటకలోని బెంగళూరులో జరిగే మొదటి జి 20 ఆర్థిక మంత్రులు , సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి మార్గం సుగమం చేస్తాయి.

 

****



(Release ID: 1883642) Visitor Counter : 250


Read this release in: English , Urdu , Marathi , Kannada