రైల్వే మంత్రిత్వ శాఖ

దేశంలో 2030 నాటికి నికరశూన్య కర్బన ఉద్గార లక్ష్య సాధనకు భారత రైల్వేల (ఐఆర్‌) సంకల్పం


బ్రాడ్ గేజ్ (బీజీ) రైలుమార్గాల 100 శాతం విద్యుదీకరణకు ‘ఐఆర్‌’ కట్టుబాటు

Posted On: 07 DEC 2022 3:50PM by PIB Hyderabad

భారత రైల్వేలు (ఐఆర్‌) 2030 నాటికి నికరశూన్య కర్బన ఉద్గార లక్ష్యం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ దిశగా కింద పేర్కొన్న చర్యలు చేపట్టింది:

  1. రైలు మార్గాల నెట్‌వర్క్‌ 100 శాతం విద్యుదీకరణ
  2. రైల్వేల పరిధిలో (31.10.2022 వరకు) దాదాపు 142 మెగావాట్ల సామర్థ్యంగల సౌర విద్యుత్‌ ప్లాంట్లు, సుమారు 103 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు (పైకప్పులు, ఖాళీ స్థలాలు రెండింటా) ప్రారంభించబడ్డాయి.
  3. రైలు ఇంజన్లు, విద్యుత్‌ మల్టిపుల్ యూనిట్ (ఇఎంయు-ఎము) రైళ్లు, ప్రధాన మార్గాల విద్యుత్‌ మల్టిపుల్ యూనిట్ (ఎంఇఎంయు-మెము) రైళ్లు, కోల్‌కతా మెట్రో సెట్లు, విద్యుత్‌ రైలు సెట్లలో పునరుత్పాదక బ్రేకింగ్‌తో ‘ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ (ఐజీబీటీ) ఆధారిత 3-ఫేజ్ ప్రొపల్షన్ వ్యవస్థ వినియోగం.
  4. శబ్దం, వాయు కాలుష్యం, డీజిల్ వినియోగం తగ్గింపులో భాగంగా ‘ఎండ్ ఆన్ జనరేషన్’ (ఇఓజి) రైళ్లు ‘హెడ్ ఆన్ జనరేషన్’ (హెచ్‌ఓజి) రైళ్లుగా మార్పిడి.
  5. విద్యుత్ వినియోగం తగ్గించడం కోసం రైల్వే స్టేషన్లు, సర్వీస్ భవనాలు, నివాస గృహాలు, కోచ్‌లుసహా అన్ని రైల్వే సంబంధిత భవన సముదాయాల్లో ‘లైట్ ఎమిటింగ్ డయోడ్’ (ఎల్‌ఇడి)ల ఏర్పాటు.
  6. కర్బన సంగ్రహణం కోసం రైల్వే భూముల అటవీకరణ.
  7. హరిత ధ్రువీకరణ- వివిధ పారిశ్రామిక యూనిట్లు, రైల్వే స్టేషన్లు, ఇతరత్రా రైల్వే సంస్థలు హరిత ధ్రువీకరణ చేయబడ్డాయి. అంతేకాకుండా పర్యావరణ నిర్వహణ వ్యవస్థ కింద: వివిధ రైల్వే స్టేషన్లకు ‘ఐఎస్‌ఓ 14001’ ధ్రువీకరణ కూడా చేయబడింది.
  8. తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల (డిఎఫ్‌సి) నిర్మాణం.
  9. వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తిచేసే ప్లాంట్ల ఏర్పాటు.

చర్యలతోపాటు సంప్రదాయ వనరుల ద్వారా ఇంధన వినియోగం తగ్గింపు దిశగా పునరుత్పాదక ఇంధన ఉత్పాదకతను పెంచుకోవాలని ‘ఐఆర్‌’ నిర్ణయించింది. కాగా, ప్రస్తుత రైళ్ల సమూహంలో సౌరశక్తి రైలును చేర్చే ప్రతిపాదన లేదు. సౌరశక్తి వ్యవస్థ పగటివేళ పని చేసేది కావడంతోపాటు సుమారు 4 నుంచి 5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలదు. అలాగే పొగమంచు/శీతల, వర్షాకాలాల్లో ఈ వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతోపాటు వాతావరణ పరిస్థితులను బట్టి బ్యాటరీ బ్యాకప్ 2 నుంచి 3 గంటలకు మించదు. అందువల్ల ఈ వ్యవస్థ పొడిగింపు ముందుకు సాగలేదు.

రైల్వేలు-కమ్యూనికేషన్లు/ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

 

******

 



(Release ID: 1881698) Visitor Counter : 121