పర్యటక మంత్రిత్వ శాఖ

భారతదేశం చేపట్టిన భారీ టీకా డ్రైవ్ విజయవంతం కావడంతో దేశం సురక్షితమైన పర్యాటక కేంద్రంగా మారింది. లండన్‌లోని వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2022లో ఇదే విషయం హైలైట్ చేయబడింది

Posted On: 09 NOV 2022 5:15PM by PIB Hyderabad
భారతదేశ పర్యాటక రంగానికి  పర్యాటక ఆఫర్లను ప్రదర్శించడానికి జీ-20 ప్రెసిడెన్సీ అసమానమైన అవకాశాన్ని అందిస్తుంది.
 
ప్రధానాంశాలు:
 
  • లండన్‌లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2022లో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు
  • లండన్‌లోని వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2022లో సుస్థిరమైన పర్యాటకం, పర్యాటక రంగాన్ని డిజిటలైజేషన్ చేయడం మరియు పర్యాటక ఎంఎస్‌ఎంఈల అభివృద్ధిపై భారతదేశ ప్రాధాన్యతలను హైలెట్‌
  • పర్యాటక రంగం గొప్ప అభివృద్ధికి అవకాశం ఉన్న రంగం.  కోవిడ్ 19తో పాటు వివిధ ప్రతికూలతలు మరియు సంక్షోభాల అనంతరం ఈ రంగం తిరిగి పుంజుకుంది.
  • భారతదేశంలో భారీ టీకా డ్రైవ్ విజయవంతం కావడంతో దీనిని సురక్షితమైన పర్యాటక కేంద్రంగా మార్చారు
  • ఈ ఏడాది ఎగ్జిబిషన్ థీమ్ ‘ది ఫ్యూచర్ ఆఫ్ ట్రావెల్ స్టార్ట్స్ నౌ’

 
లండన్‌లోని వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2022లో టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు మరియు మీడియా వంటి గ్లోబల్ టూరిజం పరిశ్రమ వాటాదారులకు దేశంలోని పలు విభిన్న టూరిజం ఆఫర్‌లను భారతదేశం ప్రదర్శిస్తోంది. సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించడం, పర్యాటక రంగాన్ని డిజిటలైజేషన్ చేయడం, టూరిజం ఎంఎస్‌ఎంఈలు మరియు నైపుణ్యాల అభివృద్ధిపై భారతదేశ ప్రాధాన్యతలను  కొనసాగుతున్న డబ్ల్యూటిఎంలో మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా హైలైట్ చేస్తున్నారు. కోవిడ్ 19 అనంతరం భారతదేశం సురక్షితమైన పర్యాటక కేంద్రంగా కూడా డబ్ల్యూటిఎంలో ప్రచారం చేయబడుతోంది. జీ-20 ప్రెసిడెన్సీ దేశ పర్యాటక రంగానికి భారతదేశ పర్యాటక సామర్థ్యాన్ని హైలైట్ చేయడానికి అపూర్వమైన అవకాశాన్ని ఇస్తుంది.

లండన్‌ ఎక్స్‌సెల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రాకేష్ కుమార్ వర్మ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ వివరించారు.

 
image.png


ప్రెస్ మీట్‌ని నిర్వహించినందుకు మరియు సమావేశానికి దారితీసిన అన్ని దేశాలతో విజయవంతంగా సమన్వయం చేసుకున్నందుకు డబ్ల్యుటిఎంని అదనపు కార్యదర్శి అభినందించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో మీడియా పోషించిన కీలక పాత్రను ఆయన ప్రశంసించారు. నవంబర్ 7 నుండి 9 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యుటిఎం) 2022లో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ పాల్గొంటున్నదని, భారత ప్రభుత్వ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారని మరియు సీనియర్ అధికారులతో కూడి ఉంటారని ఆయన మీడియాకు తెలియజేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు భారతీయ ప్రయాణ మరియు పర్యాటక వాటాదారుల నుండి ప్రతినిధులు ఉంటారని పేర్కొన్నారు. డబ్ల్యుటిఎం 2022 సందర్శన సందర్భంగా భారత ప్రతినిధి బృందం టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు మరియు మీడియా వంటి ప్రపంచ పర్యాటక పరిశ్రమ వాటాదారులకు భారతదేశం యొక్క విభిన్న పర్యాటక ఆఫర్లను ప్రదర్శిస్తోంది. సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించడం, పర్యాటక రంగాన్ని డిజిటలైజేషన్ చేయడం, టూరిజం ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి మరియు నైపుణ్యాలను ప్రోత్సహించడంపై భారతదేశం ఎలా దృష్టిసారిస్తుందో కూడా ఆయన మీడియాకు వివరించారు.

image.png

కోవిడ్-19 మహమ్మారి కారణంగా పర్యాటక రంగం భారీగా ప్రభావితమైందని అయితే పర్యాటక రంగం గొప్ప స్థితిస్థాపకతను కలిగి ఉందని మరియు వివిధ ప్రతికూలతలు మరియు సంక్షోభాల నుండి పుంజుకుందని అదనపు కార్యదర్శి పేర్కొన్నారు. భారతదేశంలో పర్యాటకం బాగా పుంజుకుంటోందని ఆయన తెలియజేశారు. మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క బలమైన నాయకత్వంలో మన ప్రజలకు టీకాలు వేయడంలో భారతదేశం అపూర్వమైన విజయాన్ని సాధించింది. ప్రస్తుత మహమ్మారి వల్ల ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి పర్యాటక కేంద్రంగా భారతదేశం సురక్షితమైనదని మరియు మరింత స్థితిస్థాపకంగా ఉందని చూపిస్తూ 2.19 బిలియన్ డోస్‌లు నిర్వహించబడ్డాయని ఆయన వివరించారు.

డిసెంబర్ 01, 2022 నుండి ప్రారంభం కానున్న జీ20 ప్రెసిడెన్సీ కోసం భారతదేశం కూడా సిద్ధమవుతోందని మీడియాకు తెలియజేసే అవకాశాన్ని కూడా మేము ఉపయోగించుకోవాలనుకుంటున్నాము అని శ్రీ రాకేష్ వర్మ వివరించారు. ప్రెసిడెన్సీ కాలంలో దేశంలోని 55 నగరాల్లో 200 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుందని భావిస్తున్నారు. జీ-20 ప్రెసిడెన్సీ భారతదేశ పర్యాటక రంగానికి భారతదేశం యొక్క పర్యాటక ఆఫర్లను హైలైట్ చేయడానికి మరియు భారతదేశ పర్యాటక విజయ గాథలను ప్రపంచ వేదికపై పంచుకోవడానికి అసమానమైన అవకాశాన్ని ఇస్తుందన్నారు.

పర్యాటక రంగాన్ని ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత కొత్త శిఖరాలకు అభివృద్ధి చేయడం మరియు 2030 యొక్క స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పరివర్తనను వేగవంతం చేయాలని పర్యాటక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

యూఎన్‌డబ్ల్యుటిఓ మరియు డబ్ల్యుటిటిసి- రీథింకింగ్ టూరిజంతో కలిసి వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో జరిగిన మంత్రుల సదస్సుకు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ హాజరయ్యారు. తరువాత పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ సిఎన్‌బిసి,సిఎన్‌ఎన్‌,బిబిసి మరియు యూరో న్యూస్‌లకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

సాయంత్రం జరిగిన డబ్ల్యుటిటిసి వార్షిక రిసెప్షన్‌కు సెక్రటరీ టూరిజం హాజరయ్యారు.

సంబంధిత కథనాలు:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1873930

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1874453

 

***

 


(Release ID: 1874838) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi , Marathi