మంత్రిమండలి

రైల్ వేఉద్యోగుల కు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులవేతనానికి సమానమైన ఉత్పాదకత తో ముడిపెట్టిన బోనస్ చెల్లింపునకు ఆమోదం తెలిపినమంత్రిమండలి

Posted On: 12 OCT 2022 4:23PM by PIB Hyderabad

రైల్ వే ఉద్యోగుల కు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్పాదకత తో ముడిపెట్టిన బోనస్ (పిఎల్ బి) చెల్లించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ రోజు న ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

అర్హులైన రైల్వే ఉద్యోగుల కు పిఎల్ బి ని ప్రతి సంవత్సరం దసరా/ పూజ సెలవు దినాల కంటే ముందే చెల్లించడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కూడా దాదాపు గా 11.27 లక్షల మంది నాన్ గజిటెడ్ రైల్ వే ఉద్యోగుల కు 78 రోజుల వేతనాని కి సమానమైనటువంటి పిఎల్ బి సొమ్ము ను చెల్లించడమైంది. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైల్ వే ఉద్యోగి కి 78 రోజుల కు గాను ఇచ్చేటటువంటి అధికతమ సొమ్ము 17, 951 రూపాయలు గా ఉంది. పైన ప్రస్తావించిన సొమ్ము చెల్లింపు ను వివిధ శ్రేణుల లో చేయడమైంది. అవి ఎటువంటి శ్రేణులు అంటే, వాటి లో ట్రాక్ మేంటెనర్ లు, డ్రైవర్ లు, గార్డు లు, స్టేశన్ మాస్టర్ లు, సూపర్ వైజర్ లు, టెక్నీశియన్, టెక్నీశియన్ హెల్పర్, కంట్రోలర్, పాయింట్స్ మన్ లు, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు ఇతర గ్రూప్ సిస్టాఫ్ ఉన్నారు అన్నమాట.

రైల్ వే ఉద్యోగుల కు 78 రోజుల పిఎల్ బి చెల్లింపు తాలూకు విత్తీయ ఖర్చు 1832.09 కోట్ల రూపాయలు గా ఉండవచ్చని అంచనా వేయడఃమైంది. పీఎల్ బి చెల్లింపు తాలూకు పైన ప్రస్తావించినటువంటి నిర్ణయాన్ని కోవిడ్-19 తరువాతి సవాళ్ళ కారణం గా ఏర్పడ్డ ప్రతికూల విత్తీయ స్థితి లో కూడాను తీసుకోవడం జరిగింది.

చెల్లింపు జరిగినటువంటి పిఎల్ బి దినాల వాస్తవిక సంఖ్య అనేది నిర్ణీత ఫార్మూలా ల ఆధారం గా తీసిన రోజు ల కంటే ఎక్కువ గా ఉంది. పిఎల్ బి ని చెల్లించడం అనే ప్రక్రియ రైల్ వే ల ప్రదర్శన ను మెరుగుపరచే దిశ లో పాటుపడేందుకు గాను రైల్ వే ఉద్యోగుల కు ప్రేరణ ను ఇచ్చేటటువంటి ప్రోత్సాహకం రూపం లో పనిచేస్తుంది.

***



(Release ID: 1867184) Visitor Counter : 271