ప్రధాన మంత్రి కార్యాలయం
వాయుసేన దినోత్సవం సందర్భంగా వైమానిక దళానికి ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
08 OCT 2022 9:27AM by PIB Hyderabad
భారత వాయుసేన దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“భారత వాయుసేన దినోత్సవం సందర్భంగా సాహసులైన వైమానిక యోధులకు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘నభః స్పృశం దీప్తం’ కర్తవ్యానికి తగినట్లు భారత వైమానిక దళం దశాబ్దాలుగా అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. వారు దేశాన్ని సురక్షితంగా ఉంచడమేగాక విపత్తు సమయాల్లో అద్భుత మానవీయ స్ఫూర్తిని కూడా ప్రదర్శిస్తారు” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1866092)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam