భారత ఎన్నికల సంఘం
ఓటర్లలో అవగాహన కల్పించేందుకు ఆల్ ఇండియా రేడియో సహకారంతో రేడియో సిరీస్ "మత్దాత జంక్షన్"ను ప్రారంభించిన ఈసీఐ
వివిధ భారతి స్టేషన్లతో పాటు ఎఫ్ఎమ్ రెయిన్బో, ఎఫ్ఎమ్ గోల్డ్ మరియు ఎయిర్ ప్రైమరీ ఛానెల్లలో ప్రతి శుక్రవారం 15 నిమిషాల పాటు 52 ఎపిసోడ్లు ప్రసారం చేయబడతాయి
230 ఎయిర్ ఛానెల్లలో 23 భాషల్లో కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి
నటుడు & స్టేట్ ఐకాన్ శ్రీ పంకజ్ త్రిపాఠి మత్దాత జంక్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు-ఈసీఐ జాతీయ ఐకన్గా ప్రకటించబడ్డారు
అక్టోబర్ 7, 2022న ప్రసారం కానున్న మత్దాత జంక్షన్ మొదటి ఎపిసోడ్
Posted On:
03 OCT 2022 5:03PM by PIB Hyderabad
ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండేతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి రంగ్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'మత్దాత జంక్షన్' ప్రారంభించారు. 'మత్దాత జంక్షన్' అనేది ఆల్ ఇండియా రేడియో సహకారంతో భారత ఎన్నికల సంఘం రూపొందించిన 52 ఎపిసోడ్ల రేడియో సిరీస్. ఈ కార్యక్రమంలో సీనియర్ ఈసీఐ అధికారులు, ప్రసార భారతి సిఈఓ, ఎయిర్ న్యూస్ డిజి మరియు ఐసీఐ ఐకాన్ & నటుడు శ్రీ పంకజ్ త్రిపాఠి కూడా పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ..ఆల్ ఇండియా రేడియో సహకారంతో రూపొందించిన మత్దాత జంక్షన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లతో అనుసంధానం కావడానికి బలమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. సమాచారం మరియు వినోదం కలయికగా రూపొందిన ఈ కార్యక్రమంగా ప్రత్యేకంగా పట్టణ ఉదాసీనతను పరిష్కరించడానికి మరియు ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఫార్మాట్లో నిష్పాక్షికమైన, పారదర్శకమైన, ఎవరి ప్రభావం లేని, ప్రాప్యత మరియు సమ్మిళిత ఎన్నికల నిర్వహణలో ప్రక్రియల గురించి ప్రేక్షకులకు తెలియజేయడంలో సహాయపడుతుందన్నారు.
ఓటర్లలో అవగాహన కల్పించడంలో ఈసీఐతో అనుబంధం ఉన్నందుకు నటుడు మరియు ఈసీఐ స్టేట్ ఐకాన్ అయిన శ్రీ పంకజ్ త్రిపాఠిని అభినందించిన సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ శ్రీ పంకజ్ త్రిపాఠి..ఇకపై ఆయన దేశవ్యాప్త విస్తృత విజ్ఞప్తి నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్కు జాతీయ చిహ్నంగా ఉంటారని ప్రకటించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈసీ శ్రీ అనూప్ చంద్ర పాండే మాట్లాడుతూ..ఆల్ ఇండియా రేడియో ఎప్పటి నుంచో తన వాయిస్ అప్పీల్తో మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడంతో ప్రజలను ఉత్సాహపరుస్తోందని గుర్తు చేసుకున్నారు. మొట్టమొదటి సాధారణ ఎన్నికల నుండి ఎయిర్ తన విస్తృతమైన కవరేజీతో విభిన్న ప్రేక్షకులకు చేరువైంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పౌరులతో కమ్యూనికేషన్ ప్రాథమిక మాధ్యమంగా ఉందని చెప్పారు.
ప్రేక్షకులను ఉద్దేశించి శ్రీ పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ..మొదటి సారి తాను ఓటరు అయినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ ప్రక్రియ తనకు మట్దాన్ హక్కును మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యంలో సమ్మాన్గా కూడా ఒక సహకారాన్ని అందించిందన్నారు. ఓటర్లకు చేరువయ్యేందుకు ఈసీఐ చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ..యువ ఓటర్లందరూ తమ ప్రజాస్వామ్య నిర్ణయాలను ప్రతిబింబించేలా మరియు వారి వాణిని వినిపించేలా ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలని కోరారు.

తన స్వాగత ప్రసంగంలో డైరెక్టర్ జనరల్ (మీడియా) శ్రీమతి షేఫాలీ శరణ్ ప్రోగ్రామ్ గురించి వివరణాత్మక స్థూలదృష్టిని ఇచ్చారు -"మత్దాత జంక్షన్: హర్ ఓటర్ కా అప్నా స్టేషన్'. ఐసీఐ & ఎయిర్ విశ్వసనీయత మరియు గ్రాస్రూట్ కనెక్షన్కు ప్రసిద్ధి చెందిన రెండు దిగ్గజ సంస్థలు, విస్తృతమైన వ్యాప్తిని నిర్ధారించడానికి సముచితమైన సహకారాన్ని పొందాయని ఆమె తెలిపారు.
15 నిమిషాల కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో నెట్వర్క్లోని 25 ఎఫ్ఎమ్ స్టేషన్లు, 4 ఎఫ్ఎమ్ గోల్డ్ స్టేషన్లు, 42 వివిధ్ భారతి స్టేషన్లు మరియు 159 ప్రైమరీ ఛానెల్లు/లోకల్ రేడియో స్టేషన్లలో 23 భాషల్లో, అంటే అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలీ మరియు డోగ్రీలో ప్రతి శుక్రవారం 7-9 పిఎం స్లాట్లో ప్రసారం చేయబడుతుంది.
52 ఎపిసోడ్ సిరీస్ ఓటర్ల దృక్కోణం నుండి ఎన్నికల మరియు సంబంధిత ప్రక్రియల యొక్క వివిధ అంశాలను కవర్ చేస్తుంది. ఇందులో ఓటరు నమోదు, సమాచారం & నైతిక ఓటింగ్, ఓటు విలువ, ఎన్నికలు నిర్వహించే విధానం , మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఐటీ అప్లికేషన్లు, ఈవీఎంలు, ఎన్నికల అధికారుల కథనాలు, బిఎల్ఓలు మొదలైన వాటిపై థీమాటిక్ ఎపిసోడ్లు ఉంటాయి. అర్హులైన పౌరులు మరియు ముఖ్యంగా యువకులు మరియు మొదటిసారి ఓటర్లు ఓటు వేయడానికి మరియు ఎన్నికల సమయంలో సమాచారంతో నిర్ణయం తీసుకోవడానికి అన్ని ఎపిసోడ్లలో ఇంటరాక్టివ్ మెసేజింగ్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్లో భారత ఎన్నికల సంఘం యొక్క ఎస్విఈఈపి(సిస్టమాటిక్ ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యం) విభాగం రూపొందించిన డ్రామా, స్టోరీ టెల్లింగ్, క్విజ్, నిపుణుల ఇంటర్వ్యూ మరియు పాటల కాలిడోస్కోప్తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ ప్రోగ్రామ్ జానర్లో సిరీస్ ఉంటుంది. ప్రోగ్రామ్ సిటిజన్స్ కార్నర్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఏ పౌరుడైనా ఒక ప్రశ్న అడగవచ్చు లేదా ఎన్నికలను కలుపుకొని మరియు పాల్గొనేలా చేయడానికి సూచనలను అందించవచ్చు.
ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ థీమ్- 'ఓటర్ నమోదు' 7 అక్టోబర్, 2022 శుక్రవారం 7:25 పిఎంకి ప్రసారం చేయబడుతుంది. పౌరులు 'ట్విట్టర్ ఆన్ @airnewsalerts మరియు @ECISVEEP, న్యూస్ ఆన్ ఎయిర్' యాప్ మరియు ఈసీఐ & ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానెల్లలో ప్రోగ్రామ్ను కూడా వినవచ్చు. ట్యూన్ చేయండి మరియు భారతదేశ శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో భాగంగా ఉండండి.
****
(Release ID: 1864882)