సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము


ప్రజలను ప్రభావితం చేయడానికి చలనచిత్రాలు గొప్ప మాధ్యమం. సినిమాల నాణ్యతను పెంపొందించడం వల్ల ఆ శక్తి మరింత ప్రభావవంతంగా ఉంటుంది: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

అవార్డులు మన దేశానికి ప్రాంతీయ బలాన్ని అందిస్తాయి: కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 30 SEP 2022 7:28PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి, శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 68వ ఎడిషన్ వేడుకలో వివిధ విభాగాల కింద 2020 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి (ఐ అండ్ బి) శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, ఐ&బి  సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, ఐ&బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, జ్యూరీ చైర్‌పర్సన్‌లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ..సినీ ప్రపంచానికి విశేష కృషి చేసిన దాదాసాహెబ్ ఫాల్కే అవేర్ శ్రీమతి ఆశా పరేఖ్‌ను అభినందించారు. ఆమెకు అందించిన ఈ పురస్కారం మహిళా సాధికారతకు గుర్తింపు అని అన్నారు.

అన్ని కళారూపాలలో చలనచిత్రాలు విస్తృత ప్రభావాన్ని చూపుతాయి. సినిమాలు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, మన విలువ వ్యవస్థ యొక్క కళాత్మక వ్యక్తీకరణకు మాధ్యమం కూడా అని ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. సినిమా అనేది దేశ నిర్మాణానికి కూడా సమర్థవంతమైన సాధనం.

దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నందున..స్వాతంత్ర్య సమరయోధుల జీవిత కథలకు సంబంధించిన ఫీచర్ మరియు నాన్-ఫీచర్ చిత్రాలను భారతీయ ప్రేక్షకులు స్వాగతిస్తారని శ్రీమతి ముర్ము అన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందించే, దేశాభివృద్ధి వేగాన్ని పెంచే మరియు పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను పటిష్టం చేసే ఇలాంటి చిత్రాలను నిర్మించాలని ప్రేక్షకులు కోరుకుంటారని తెలిపారు.

విదేశాల్లో భారతీయ సంగీతానికి ఉన్న గుర్తింపును ప్రస్తావిస్తూ భారతదేశం యొక్క శక్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి ఇది గొప్ప మాధ్యమమని రాష్ట్రపతి అన్నారు. ఈ ఏడాది జూలైలో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఉజ్బెకిస్తాన్‌లో జరిగిందని, ముగింపు వేడుకలో 1960ల నాటి హిందీ చలనచిత్రంలోని ఒక ప్రసిద్ధ పాటను ఒక విదేశీ బృందం ప్రదర్శించిందని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ సాఫ్ట్ పవర్‌ని మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవడానికి మన సినిమాల నాణ్యతను పెంచుకోవాలని చెప్పారు. "ఇప్పుడు మన దేశంలో ఒక ప్రాంతంలో తీసిన సినిమాలు మిగతా అన్ని ప్రాంతాల్లోనూ బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ విధంగా భారతీయ సినిమా దేశప్రజలందరినీ ఒక సాంస్కృతిక దారంలో కట్టిపడేస్తోంది. భారతీయ సమాజానికి ఈ సినిమా కమ్యూనిటీ ఎంతో కృషి చేసింది" అని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..మనల్ని సజీవంగా, మనిషిగా భావించే మాయాజాలం, అద్భుతం, చిత్రాలలో సినిమా కవిత్వం అని తనకు గట్టి నమ్మకం ఉందన్నారు. సినిమా మన దేశ మనస్సాక్షిని, సమాజాన్ని మరియు సంస్కృతిని సంగ్రహించి చెక్కిందన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన అరంగేట్రం చేసినవారు, నిపుణులు మరియు లెజెండ్‌లు ఒక శతాబ్దానికి పైగా మన హృదయాలను మరియు మనస్సులను హత్తుకున్నారని ఆయన అన్నారు.

కొవిడ్19 మహమ్మారి సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పోషించిన పాత్రపై మంత్రి మాట్లాడుతూ..ఓటీటీ రాకతో ఈ రోజు సినిమా థియేటర్ హద్దులు దాటి మన గృహాలు మరియు మొబైల్ ఫోన్‌ల సౌకర్యాలకు చేరుకుందని అన్నారు. మహమ్మారి సమయంలో భారతదేశ చలనచిత్ర తారలు చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు. కోవిడ్ యొక్క భయంకరమైన వాస్తవికత మరియు సంక్షోభంలో ఉన్న ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య మీరు అందించిన మనోరంజన్ మరియు సందేశం మా ఆశాకిరణం అని అన్నారు.

ఐదేళ్లలో రెండోసారి మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ అవార్డును గెలుచుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి అభినందించారు. 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ద్వారా ఎంపిక చేయబడుతున్న సినిమా మ్యాజిక్  భావి సృష్టికర్తలకు మార్గదర్శకత్వం వహించాలని అవార్డు గ్రహీతలను మంత్రి ఆహ్వానించారు. యువకులను ప్రోత్సహించే మరియు మార్గనిర్దేశం చేసే ఈ ప్రత్యేక చొరవకు వారి మద్దతు తదుపరి తరం అవార్డు విజేతలను రూపొందిస్తుందని అన్నారు.

భారతదేశం భాషా వైవిధ్యం ఉన్న దేశం మరియు ఈ వైవిధ్యాన్ని జాతీయ చలనచిత్ర అవార్డుల కంటే మెరుగైన ప్రదర్శన మరొకటి లేదు. దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రతిభావంతులైన విజేతల గురించి శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..ఈ అవార్డులు దేశంలోని ప్రాంతీయ బలాన్ని మరోసారి వెలికి తీశాయని మరియు భారతీయ సినిమా ఎలా ప్రకాశవంతంగా మరియు ప్రతిభతో వికసించిందో మనకు గుర్తుచేస్తుందని అన్నారు. ఈ వేడుకలో కర్బీ భాషలోని కచిచినీతు, టెస్టిమనీ ఆఫ్ అన అనే చిత్రాలకు ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డు లభించగా, సూరరై పొట్రుకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు లభించింది. సూర్య మరియు అజయ్ దేవగన్ సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డును అందుకోగా, అపర్ణ బాలమురళి ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. మలయాళ చిత్రం ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్ మరియు తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్‌కు ఉత్తమ దర్శకుడిగా సచ్చిదానందన్ కెఆర్‌కు అవార్డు లభించింది, సంపూర్ణ వినోదాన్ని అందించిన ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును అందుకున్నారు. అవార్డు విజేతల పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు.

***



(Release ID: 1864206) Visitor Counter : 129