వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లాస్ ఏంజిల్స్‌ లో 9.9.22న జరిగే ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫోరమ్ (ఐపీఈఎఫ్) మంత్రివర్గ సమావేశానికి హాజరు కానున్న శ్రీ పీయూష్ గోయల్


ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫోరమ్ (IPEF) ఇండో-పసిఫిక్ ప్రాంతం సురక్షిత వ్యాపార నిమిత్తం తెరిచి ఉండేలా చేసేందుకు కృషి చేస్తుంది: శ్రీ పీయూష్ గోయల్


IPEF వాణిజ్యాన్ని సులభతరం చేయడం ద్వారా, ముఖ్యంగా సవాళ్లు ఎదుర్కొనే కష్ట సమయాల్లో సరఫరా సరళి కొనసాగించడంపై దృష్టి సారిస్తుంది, : శ్రీ గోయల్


శ్రీ గోయల్ భారతీయ కంపెనీలతో గొప్ప వ్యాపార సహకారాన్ని అన్వేషించడానికి అగ్ర సెమీకండక్టర్ తయారీ కంపెనీలు, ల్యాబ్‌లతో నిమగ్నమై ఉన్నారు


శాన్ ఫ్రాన్సిస్కోలో అప్లైడ్ మెటీరియల్స్ కోసం మేడాన్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి

Posted On: 08 SEP 2022 9:58AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యంపరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీజౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కొనసాగుతున్న  తన అమెరికా  పర్యటనలో రెండవ విడతలో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం(IPEF),  మొదటి వ్యక్తిగత మంత్రివర్గ సమావేశానికి, అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) సమావేశం, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు  హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్‌ కు వెళ్లనున్నారు.

 అంతకుముందు రోజు, శ్రీ గోయల్ ‘ఇండియాస్పోరా’తో మధ్యాన్న భోజన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

 IPEF మంత్రివర్గానికి ముందు రోజు  మీడియాతో మాటామంతీ  జరిపిన  శ్రీ పీయూష్ గోయల్, IPEFలో చర్చల ద్వారా  సభ్య దేశాలు ఒకదానికొకటి భాగస్వామ్యంతో పనిచేయడానికి ప్రత్యేకించి సవాళ్ళు ఉత్పన్నమయ్యే  సందర్భాలలో కష్ట సమయాల్లో, సరఫరా సరళి  నిర్ధారించడానికి, కోవిడ్ సంఘర్షణ వంటి అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా వ్యాపార ఇక్కట్లతో దేశాల ప్రజలు బాధపడకుండా కొత్త అవకాశాలను తెరవడంపై దృష్టి పెడతాయని అన్నారు.

 IPEF ఒక కొత్తప్రత్యేకమైన ప్రయత్నంగా  పారదర్శక ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న నిబంధనల ఆధారిత, భావసారూప్యత కలిగిన దేశాల మధ్య భాగస్వామ్యం అని పేర్కొన్న శ్రీ గోయల్, ఇండో-పసిఫిక్ ప్రాంతం సురక్షిత వ్యాపారానికి అందుబాటులో ఉండేలా IPEF పని చేస్తుందని చెప్పారు.

 మంత్రి మరింత వివరిస్తూ, IPEF, బహిరంగ వాణిజ్యాన్ని సులభతరం చేయడం, సరఫరా గొలుసులను తెరిచి ఉంచడంపై మంత్రివర్గ  చర్చలు దృష్టి సారిస్తాయని మంత్రి చెప్పారు. IPEF దేశాలతో వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్నందున, భారతదేశం నుంచే కాకుండా, భారతదేశంలోనికి కూడా  పెట్టుబడులు పెరుగుతాయని ఆయన అన్నారు. రేపు సమావేశమయ్యే అన్ని దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత పరంగా ఒకదానికొకటి చాలా ఆఫర్లను కలిగి ఉన్నాయి. మనం  అన్ని రంగాలతో కలిసి పని చేస్తాము, అన్నారాయన.

 శ్రీ గోయల్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, అమెరికా-భారతదేశం చాలా మంచి, బలమైన వ్యాపార సంబంధాన్ని పంచుకుంటున్నాయని చెప్పారు. అమెరికా  భారతదేశ అతిపెద్ద వ్యాపార భాగస్వామి. అంతేకాకుండా అనేక భారతీయ కంపెనీలు అమెరికాలో తమ సహచరుల కోసం పని చేస్తాయి. ప్రస్తుతం  అమెరికా నుంచి భారత్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

 అమెరికా, భారత్‌లు మరింత దగ్గరవుతున్నాయని గమనించిన మంత్రి, ఇప్పుడు రెండు పరస్పర వ్యాపార లావాదేవీల ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నాయని- ఒకటి జపాన్,ఆస్ట్రేలియాతో, మరొకటి ఇజ్రాయెల్,అరబ్ దేశాలతో. భారతదేశం- అమెరికా మధ్య 2 ప్లస్ 2 మంత్రుల సంభాషణలు దృఢమైన, శక్తివంతమైన,  భౌగోళిక రాజకీయ, సున్నితమైన ప్రాంతాలతో సహా అనేక రంగాలలో ఇరు దేశాల నడుమ ఒప్పందాలు  విస్తరిస్తున్నాయి. ఇరు దేశాల అధినేతలు, ఇరు దేశాల వ్యాపారాలు, ఇరు దేశాల ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా సన్నిహితంగా ఉన్నారని ఆయన తెలిపారు.

 సంఘర్షణ, ద్రవ్యోల్బణం, మాంద్యం ముప్పు వంటి మహమ్మారి సవాళ్లు ఉన్నప్పటికీ, 675 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ వాణిజ్యం వంటి అంతర్జాతీయ వర్తకం లో భారతదేశం సాధించిన కొన్ని మైలురాళ్లను హైలైట్ చేస్తూ, గత ఎనిమిదేళ్లలో భారతదేశం, రికార్డు స్థాయిలో ఎఫ్‌డిఐలు సాధిస్తున్నాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. భారీ మార్కెట్, నిజాయితీ, ప్రభుత్వ పారదర్శక ఆర్థిక విధానాలు, న్యాయ పాలన, శక్తివంతమైన మీడియా తో పాటు న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు, ప్రపంచానికి ప్రాధాన్యత కలిగిన వ్యాపార భాగస్వామి ఐన భారతదేశానికి పెట్టుబడి గమ్యస్థానంగా ఉండండి. ఇది భారతదేశంలోని ప్రజల శ్రేయస్సును మెరుగుపరుస్తుంది, ఉద్యోగాలు, ఆర్థిక కార్యకలాపాలకుతద్వారా వృద్ధిని అందిస్తుంది అని మంత్రి అన్నారు.

 భారతీయ కంపెనీలతో మరింత సహకారాన్ని అన్వేషించడానికి సెమీకండక్టర్ తయారీపరిశోధనలకు సంబంధించిన టాప్ కంపెనీలు, ల్యాబ్‌లతో మంత్రి నిమగ్నమయ్యారు. లామ్ రీసెర్చ్ సీఈవో టిమ్ ఆర్చర్‌తో ఆయన సమావేశమయ్యారు.

 "మన  యువ నైపుణ్యాలను వినిమయం చేసుకునేట్టు శ్రామికశక్తిని నిర్మించడంపైనా, లామ్ పరిశోధనతో కలిసి భారతదేశం సెమీ కండక్టర్ ఆవిష్కరణలో అగ్రగామిగా ఎలా రూపొందగలదో టిమ్ ఆర్చర్‌ చర్చించారు" అని సమావేశం తర్వాత ఆయన ట్వీట్ చేశారు.

 

శ్రీ గోయల్ అప్పుడు మేడాన్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించారుఅప్లైడ్ మెటీరియల్స్ ప్రెసిడెంట్ & CEO అయిన గ్యారీ డికర్సన్‌తో సమావేశమయ్యారు.

"ప్రపంచంలోని అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీలలో ఒకటి  ఐన మేడాన్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించారు. భారతదేశం సెమీకండక్టర్, డిస్ప్లే, సోలార్ తయారీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయగల అవకాశాలపై  చర్చించారు" అని మంత్రి ట్వీట్ చేశారు.

 

మేడాన్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించారు@Applied4Tech ప్రెసిడెంట్,కార్య నిర్వహణాధికారి ఐన  గ్యారీ డికర్సన్‌ను కలిశారు.

 

 

***


(Release ID: 1858100) Visitor Counter : 122