రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మ‌లేషియా నిర్వ‌హిస్తున్న ద్వైపాక్షిక విన్యాసాల‌లో పాల్గొంటున్న భార‌తీయ వైమానిక ద‌ళం

Posted On: 12 AUG 2022 1:51PM by PIB Hyderabad

ఉద‌ర‌శ‌క్తి పేరిట జ‌రుగుతున్న ద్వైపాక్షిక విన్యాసాల కోసం భార‌తీయ వైమానిక ద‌ళ బృందం ఒక శుక్ర‌వారం మ‌లేషియాకు బ‌య‌లుదేరి వెళ్ళింది. 
భార‌త వైమానిక ద‌ళం  ఎస్‌యు-30 ఎంకెఐను, సి-17 విమానంతో ఆకాశ విన్యాసాల‌లో పాల్గొంటుండ‌గా, ఆర్ఎంఎఎఫ్ ఎస్‌యు 30 ఎంకెఎం విమానాల‌ను ఎగుర‌వేయ‌నుంది. భార‌తీయ వైమానిక ద‌ళం నేరుగా కౌంత‌న్‌లోని ఆర్ఎంఎఎఫ్ స్థావ‌రాన్ని చేరుకునేందుకు త‌న వైమానిక స్థావ‌రాల‌లో ఒక‌దాని నుంచి బ‌య‌లుదేరి వెళ్ళింది. 
ఈ విన్యాసాలు భార‌తీయ వైమానిక ద‌ళ స‌భ్యుల‌కు ఆర్ఎంఎఎఫ్‌లోని అత్యుత్త‌మ నిపుణుల‌తో ఉత్త‌మ అభ్యాసాల‌ను పంచుకునేందుకు, నేర్చుకునేందుకు అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. అదే స‌మ‌యంలో ప‌ర‌స్ప‌ర పోరాట సామ‌ర్ధ్యాల‌ను చ‌ర్చించేందుకు తావు ఇవ్వ‌నుంది. 
నాలుగు రోజులు జ‌రుగ‌నున్న ఈ విన్యాసాలలో ఇరు వైమానిక ద‌ళాల మ‌ధ్య  ప‌లు వైమానిక పోరాట క‌వాతులు జ‌రుగ‌నున్నాయి. 
ఉద‌ర‌శ‌క్తి దీర్ఘ‌కాలిక స్నేహ బంధాన్ని బ‌ల‌ప‌ర‌చ‌డ‌మే కాక రెండు వైమానిక ద‌ళాల మ‌ధ్య ర‌క్ష‌ణ స‌హ‌కార మార్గాల‌ను మెరుగుప‌ర‌చ‌డం ద్వారా ఈ ప్రాంతంలో భ‌ద్ర‌త‌ను పెంచ‌నుంది. 

***



(Release ID: 1851497) Visitor Counter : 213