ప్రధాన మంత్రి కార్యాలయం

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 మహిళల కుస్తీ 62 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత సాక్షి మాలిక్‌కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 05 AUG 2022 11:00PM by PIB Hyderabad

   కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 మహిళల కుస్తీ 62 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సాక్షి మాలిక్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో మన క్రీడాకారులు మనమంతా గర్వించేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాక్షి మాలిక్‌ సాధించిన అద్భుత విజయంతో నేనెంతో పులకించాను. ఆమె ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం కైవసం చేసుకోవడంపై అభినందిస్తున్నాను. నిండైన ప్రతిభాశక్తితో ప్రతికూలతను సానుకూలం చేసుకోగల అద్భుత పోరాటపటిమ ఆమె సొంతం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 



***
 


DS/TS/AK



(Release ID: 1849089) Visitor Counter : 84