ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) మొహాలి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కలకత్తాతో కలిసి మౌలిక సదుపాయాల రంగంలో సామర్ధ్య నిర్మాణాల చొరవలలో భాగంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించిన డిఇఎ
నాడు పోస్టు చేయడమైనది:
02 AUG 2022 6:19PM by PIB Hyderabad
దేశంలో మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మౌలిక సదుపాయాల అమలులో విస్త్రత పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన తగు సామర్ధ్యాలను ప్రోత్సహించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సామర్ధ్య నిర్మాణ కమిషన్ - సిబిసి) సహకారంతో ఆర్థిక వ్యవహారాల విభాగం (డిఇఎ) కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ప్లాన్ ( సామర్ధ్యాల పెంపు ప్రణాళిక- సిఇపి) ను రూపొందించింది. నేటి వరకూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులప్రణాళిక, నిర్వహణ, అమలు, పర్యవేక్షణతో సంబంధం కలిగి ఉన్న 358మంది సీనియర్ పన్నెండు శిక్షణా కార్య్రకమాలు (ఆఫ్లైన్, ఆన్లైన్లు కలిపి)నిర్వహించింది.
ఈ క్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినదెస్ భాగస్వామ్యంతో వారి మొహాలీ క్యాంపస్లో ప్రాజెక్టు నిర్వహణ, నాయకత్వం అనే అంశంపై 11 నుంచి 15 జులై వరకూ 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రాజెక్టుల గుర్తింపు & ఎంపిక, సమకాలీన ఉపకరణాలు & పద్ధతులు, కాంట్రాక్టు నిర్వహణ, పనితీరు & మార్పు కోసం నాయకత్వం, ప్రభావవంతమైన చర్చల కోసం వ్యూహాలు అన్న అంశాలను ఈ శిక్షణా కార్య్రకమం కవర్ చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, సిపిఎస్ఇలు, రాష్ట్ర ప్రభ/త్వాలకు చెందిన 34మంది సీనియర్ అధికారులు పాలుపంచుకున్నారు.
మరొక 5రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కలకత్తా (ఐఐఎం-సి)భాగస్వామ్యంతో 25 నుంచి 29 జులై వరకూ వారి క్యాంపస్లో నిర్వహించారు., ప్రాజెక్టు నిర్వహణలో సామర్ధ్య నిర్మాణాలు అన్న విషయాంశం పై ప్రధానంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనితో పాటుగా, ప్రాజెక్టు యాజమాన్య నమూనా, విపత్తు నిర్వహణ, షెడ్యూలింగ్, పర్యవేక్షణ & నియంత్రణ, విలువ విశ్లేషణ, కాంట్రాక్టు నిర్వహణ, వివాదాల పరిష్కారం అన్న అంశాలు కూడా ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి. ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, సిపిఎస్ఇలు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 35మంది అధికారులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1847670)
సందర్శకుల సూచీ సంఖ్య : : 173