ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎఇ కి కొత్త అధ్యక్షుని గాఎన్నికైన శ్రీ శేఖ్ మొహమద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 14 MAY 2022 8:19PM by PIB Hyderabad

యుఎఇ కి కొత్త అధ్యక్షుని గా అబూ ధాబీ పాలకుడు శ్రీ శేఖ్ మొహమద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందన లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘యుఎఇ కి కొత్త అధ్యక్షుని గా అబూ ధాబీ పాలకుడు శ్రీ శేఖ్ మొహమద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ ఎన్నికైన సందర్భం లో ఆయన కు ఇవే నా శుభాకాంక్ష లు. ఆయన యొక్క గతిశీలమైనటువంటి మరియు దూరదర్శి నాయకత్వం లో మన విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత గా ప్రగాఢం అవుతుందనే విశ్వాసం నాకుంది. @MohamedBinZayed’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1825632) Visitor Counter : 84