యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ను ప్రధాని ప్రారంభింభిస్తూ మనం ఆరోగ్యంగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే స్పష్టమైన సందేశాన్ని అందించారు: కాశ్మీర్‌లో ‘మీట్ ది ఛాంపియన్స్’ సందర్భంగా ఒలింపియన్ ఆరిఫ్ ఖాన్

Posted On: 06 MAY 2022 5:11PM by PIB Hyderabad

జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ప్రభుత్వ ఎస్పీ మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో శుక్రవారం 'మీట్ ది ఛాంపియన్స్' అనే ప్రత్యేకమైన ప్రచారం మొదలయింది. కశ్మీర్ లోయకు చెందిన దేశంలోని స్టార్ వింటర్ ఒలింపియన్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు విద్యార్థులు అద్భుతమైన స్వాగతం పలికారు.   ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ తీసుకున్న ఈ విశిష్ట చొరవ  17వ ఎడిషన్‌ ఈరోజు మొదలయింది. సుందరమైన లోయలోని పురాతన పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థులతో   ఇండియన్ ఆల్పైన్ స్కీయర్ (ఖాన్) మాట్లాడుతూ, “మన ప్రధాన మంత్రి ఫిట్‌ ఇండియా ప్రచారోద్యమాన్ని ప్రారంభించడం ద్వారా  మనలో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా సరైన ఆహారం తీసుకోవాలని  ఫిట్‌నెస్‌ను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని  చాటి చెప్పారు. ప్రతి భారతీయుడికి ఇది స్పష్టమైన సూచన”అని వివరించారు.  సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పిన ఆరిఫ్, "సంతులిత్ ఆహార్ (సమతుల్య ఆహారం) అంటే మీరు సమీపంలోని కేఫ్‌కి వెళ్లడం మానేయమని కాదు, కానీ మీరు తినే ఏదైనా సమతుల్యంగా తినాలి" అని వివరణ ఇచ్చారు.

 

ఇదిలా ఉండగా, ఆహారం,  ఫిట్‌నెస్, లోయలో వారు ఎదుర్కొనే సవాళ్లు, క్రీడలు  విద్యావేత్తలను సమతుల్యం చేసే మార్గాలు మొదలైన వాటికి సంబంధించిన అనేక ప్రశ్నలకు ఆయన ఉత్సాహంగా సమాధారం చెప్పారు.  ఉత్సుకతతో సంభాషించిన విద్యార్థులతో మాట్లాడారు. ఎస్పీ హెచ్ఎస్ఎస్ విద్యార్థి ఒకరు ఇలా అడిగారు, "కశ్మీర్ అంతర్జాతీయ స్కీయర్‌లను సంపాదించేందుకు మీరు ఎలాంటి మౌలిక సదుపాయాల మార్పులను కోరుకుంటున్నారు?" ఇందుకు ఆయన బదులిస్తూ "వివిధ సమస్యలు  పరిస్థితుల కారణంగా నేను చాలా అవకాశాలను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కోరుకున్నదానిపై నేను ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాను కాబట్టి నేను ఎప్పుడూ అలా చేయలేదు. కాబట్టి, మీరు చేయాలనుకుంటున్నది చేయండి  ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించండి, కానీ ఎప్పటికీ వదులుకోవద్దు, ”అని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు దేశం  ఏకైక ప్రతినిధి అయిన ఖాన్ బదులిచ్చారు. సేంద్రియ ఆహారం, తాజా పండ్లు  దానిలో చాలా పోషకాలను కలిగి ఉన్న  కశ్మీర్ వంటకాలను తినాలని, ఈ విషయంలో కాశ్మీర్ ఎంతో గొప్పదని ఖాన్ విద్యార్థులకు వివరించారు.  “మన రెగ్యులర్, ఇంటి భోజనంలో చాలా పోషకాహారం ఉంది. లోయలో ఉన్నందుకు మనమందరం ఎంత అదృష్టవంతులమో మనం అర్థం చేసుకోవాలి. మనకు వివిధ పండ్లతో కూడిన తోటలు ఉన్నాయి.  మనం ఇప్పటికీ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాము. కాబట్టి, మనం ఫిట్‌గా ఉండడానికి కావలసిన ప్రతిదీ మనకు అందుబాటులో ఉంది ”అని ఆరిఫ్  చెప్పాడు. ఈ విశిష్ట చొరవను యువజన వ్యవహారాలు  క్రీడల మంత్రిత్వ శాఖ  విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో ఈ కార్యక్రమం భాగం.

***



(Release ID: 1823400) Visitor Counter : 157