నీతి ఆయోగ్
అమృత మహోత్సవాల్లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత్ లో ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతపై వేడుకలు నిర్వహించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్
प्रविष्टि तिथि:
28 APR 2022 4:09PM by PIB Hyderabad
అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) నీతి ఆయోగ్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలను పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (డీఎఐసీ)లో ఘనంగా నిర్వహించింది.
ఈ సమావేశం భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణ వ్యవస్థను స్వాతంత్ర్యం నుండి ప్రస్తుత కాలం వరకు దాని ప్రయాణాన్ని గుర్తించింది. సంవత్సరాలుగా భారతదేశం యొక్క ఆవిష్కరణ ప్రయాణాన్ని, 75 ఏళ్లలో దేశంలో ఆవిష్కరణలను తెలిపే విధంగా ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క టింకరింగ్ ల్యాబ్లు, ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ నుండి ఇన్నోవేటర్లు రూపొందించిన ఇన్నోవేషన్ ప్రోటోటైప్ల ప్రదర్శన, ఏఐఎం యొక్క ప్రయాణం ఆవిష్కరణల కోసం చేసిన సహకారం ఈ కార్యక్రమంలో పొందుపరిచారు.
ఈ కార్యక్రమం అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్ (ఎఎన్ఐసీ) రెండవ ఎడిషన్ను కూడా ప్రారంభించింది. గ్రాంట్ ఆధారిత మెకానిజం ద్వారా జాతీయ ప్రాముఖ్యత మరియు సామాజిక ఔచిత్యం ఉన్న ప్రాంతాల్లో అధునాతన సాంకేతికతల ఆధారంగా ఉత్పత్తులు/పరిష్కారాలను రూపొందించడానికి ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడం ఎఎన్ఐసీ లక్ష్యం.
ఎఐఎమ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విద్యార్థుల కోసం 'హార్సెస్ స్టేబుల్ జూనియర్'ని కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. హార్స్ స్టేబుల్ అనేది భారతదేశం యొక్క స్వంత పెట్టుబడి రియాలిటీ షో, ఇది స్టార్టప్ వ్యవస్థలో వ్యవస్థాపకతను మరియు స్టార్టప్ ఫండింగ్ను ప్రోత్సహించడానికి, ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.
డాక్టర్ జితేంద్ర సింగ్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ; సహాయ మంత్రి , ప్రధాన మంత్రి కార్యాలయం; మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్; డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, మాట్లాడుతూ, “దేశంలో సమస్యల పరిష్కారానికి, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ మరియు ఎంఎస్ఎంఈ రంగం మరియు పెద్ద మొత్తంలో సమాజాలలో వ్యవస్థాపకతలలో వినూత్న ఆలోచనా విధానాన్ని రూపొందించడానికి, సమగ్ర విధానాన్ని సులభతరం చేసినందుకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ను ఈ సందర్భంగా అభినందించాలనుకుంటున్నాను. "
అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి సంస్థల ద్వారా వివిధ వాటాదారులకు ప్లాట్ఫారమ్లు మరియు సహకార అవకాశాలను అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించే ఆవిష్కరణ వ్యవస్థను రూపొందించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది.
తన ప్రసంగంలో స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రణాళికా మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రావ్ ఇందర్జిత్ సింగ్ మాట్లాడుతూ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభించి ఇటీవలే 6వ సంవత్సరాన్ని పూర్తిచేసుకున్నదని, "సబ్కా సాత్, సబ్కా వికాస్" అనే ప్రభుత్వ దార్శనికతకు అనుబంధంగా ఉందని అన్నారు.
"అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా పాఠశాల పిల్లలలో వినూత్న ఆలోచనలను పెంపొందించడం నుండి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లు మరియు ఎఎన్ఐసీ ఛాలెంజ్ల వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు మరియు ఇన్నోవేటర్లకు మద్దతు ఇవ్వడం వరకు, ఎఐఎం దేశంలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత ల్యాండ్స్కేప్ను సమగ్రంగా మారుస్తోంది. యువతలో, పాఠశాల విద్యార్థులలో ఆవిష్కరణ వ్యవస్థాపకత స్ఫూర్తిని రగిలించే అటువంటి మిషన్ను కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము.
అమితాబ్ కాంత్, సీఈఓ, నీతి ఆయోగ్, తన ప్రసంగంలో ఎఐఎంని అభినందించారు. “అటల్ టింకరింగ్ ల్యాబ్స్ చాలా చిన్న వయస్సులోనే సమస్యలను పరిష్కరించే మనస్తత్వాన్ని పెంపొందించడం ద్వారా పాఠశాల విద్యలో ఒక నమూనా మార్పును తీసుకువస్తోందన్నారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు భారతదేశంలోని యువతకు ఒక వేదికను అందిస్తున్నాయన్నారు..
“ ఇన్నోవేషన్ & ఎకోసిస్టమ్ యొక్క అసాధారణ వృద్ధి భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి పరిష్కారాలను రూపొందించడానికి అవకాశాన్ని అందిస్తుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో, దేశం 44 కొత్త యునికార్న్లను చూసింది, ఇది గొప్ప విజయం. రాబోయే రెండు మూడు సంవత్సరాలలో, ఈ ప్రయాణంలో ఏఐఎం పది రెట్లు అధికంగా వృద్ధి చెందుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. గత 75 సంవత్సరాలుగా దేశాన్ని మార్చిన భారతదేశం యొక్క వినూత్న మరియు సృజనాత్మక స్ఫూర్తి యొక్క ఈ గొప్ప వేడుక కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్ను అభినందించాలనుకుంటున్నాను.
ఈ సందర్భంగా మిషన్ డైరెక్టర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ మాట్లాడుతూ, ఏఐఎం ఒక సంస్థగా ప్రారంభమైన 6 సంవత్సరాల నుండి, భౌగోళిక, లింగ, సామాజిక-ఆర్థిక వర్గాల విభజన భాష దేశంలోని ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉందన్నారు. ప్రస్తుతం ఎఐఎం రెండవ దశ అభివృద్ధిలోకి మారుతోంది.
“నేడు, అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణ వ్యవస్థ యొక్క అద్భుత ప్రయాణాన్ని చూశాము. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే తదుపరి పెద్ద మైలురాయిని సాధించడానికి మనమందరం సహకరించడానికి, సాధించడానికి సమయం ఆసన్నమైంది. నేను, ఎఐఎం, నీతి ఆయోగ్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఏఐఎం, ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి చిహ్నంగా ఉంటుందని అనుకుంటున్నాను"
ఏఐఎం గురించి ప్రేక్షకులకు వివరిస్తూ, ఎఐఎం ఉద్దేశం దీర్ఘకాలికంగా దేశంలో సాంస్కృతిక పక్షపాతాలు, వ్యవస్థాపకత పట్ల వైఖరిని మార్చడమేనని, పెద్ద ఎత్తున ఆర్థిక మరియు సామాజిక కార్యక్రమాలకు వ్యవస్థాపకతను జోడించడం, కొత్త అధిక సంభావ్య రంగాలను ప్రోత్సహించడం ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం యొక్క “భారత్లో తయారీ” ప్రచారం ద్వారా, సమన్వయం మరియు సహకారం యొక్క సంస్కృతిని పెంపొందించడం, విజయం యొక్క సాంస్కృతిక భావనలను పునర్నిర్వచించటానికి ప్రయత్నించడం సామాజిక చేరిక ఎజెండాతో వ్యవస్థాపకతను ముడిపెట్టడం ఉంటాయన్నారు.
ఈ సందర్భంగా, రవాణా మరియు మొబిలిటీపై దృష్టి సారించే 'ఇన్నోవేషన్స్ ఫర్ యు' ఇ-బుక్ యొక్క మూడవ ఎడిషన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఎఐఎం మరియు ఇండియన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కి చెందిన అగ్ర ప్రముఖులు, సంస్థలు, స్టార్టప్లు, ఉపాధ్యాయులు, విద్యార్థి ఆవిష్కర్తలు, మార్గదర్శకులు మరియు ఇతర ముఖ్య వాటాదారులు హాజరయ్యారు. వివిధ ఇంటరాక్టివ్ సమావేశాల ద్వారా పరస్పరం నెట్వర్కింగ్ కోసం ఒక వేదికగా అందించారు.
***
(रिलीज़ आईडी: 1821490)
आगंतुक पटल : 307