ప్రధాన మంత్రి కార్యాలయం
భాగల్ పుర్ లో జరిగిన పేలుడు లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 MAR 2022 12:02PM by PIB Hyderabad
భాగల్ పుర్ లో జరిగిన పేలుడు లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన కు సంబంధించిన స్థితి ని గురించి ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు. పాలన యంత్రాంగం రక్షణ మరియు సహాయ కార్యకలాపాల లో తలమునకలు గా ఉందని, బాధితుల కు సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం జరుగుతోందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బిహార్ లోని భాగల్ పుర్ లో జరిగిన విస్ఫోటం వల్ల ప్రాణనష్టం వాటిల్లిందన్న కబురు దుఃఖాన్ని కలిగించింది. గాయపడిన వారు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని కోరుకొంటున్నాను. ఈ ఘటన తో ముడిపడిన పరిస్థితుల ను గురించి ముఖ్యమంత్రి @NitishKumar గారి తో మాట్లాడడం జరిగింది. పాలన యంత్రాంగం రక్షణ చర్యల లో మరియు సహాయ కార్యకలాపాల లో నిమగ్నమైంది. బాధితుల కు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడం జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1802955)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam