వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ వాటాను 10% పెంచాలని శ్రీ పీయూష్ గోయల్ పిలుపు


“ఇతర దేశాలు కూడా ఆత్మనిర్భర్ భారత్ లాంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాయి; ఈ రోజు ప్రపంచం భారతదేశ కథను అనుకరించాలనుకుంటోంది”: శ్రీ గోయల్

మనమందరం ఉద్యోగ సృష్టికర్తలుగా మారి, భారతదేశ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేద్దాం అని చెప్పిన శ్రీ గోయల్

పరిశ్రమల రంగం కోసం రేపటికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: శ్రీ గోయల్

Posted On: 03 MAR 2022 8:01PM by PIB Hyderabad

వాణిజ్యం , పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ , జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ వాటాను 10% పెంచాలని , జాతీయ స్థూల ఉత్పత్తిలో మన ఎగుమతుల వాటాను 25% కి చేర్చాలని పిలుపునిచ్చారు.

"ఇవి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు, కానీ ఇవి ఆచరణ సాధ్యమైనవని భావిస్తున్నాను" అని శ్రీ గోయల్ '’మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’'పై బడ్జెట్ అనంతర ఆన్ లైన్ సమావేశ ముగింపు అంకంలో ప్రసంగిస్తూ అన్నారు.
ప్రధాన మంత్రి, వెబ్‌నార్‌  ప్రారంభ ప్రసంగంలో, తయారీని ప్రోత్సహించడానికి , భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రయత్నించాలని శ్రీ గోయల్ పేర్కొన్నారు.


“నేడు ఇతర దేశాలు కూడా ఆత్మనిర్భర్ భారత్ లాంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాయి, ఈ దార్శనికత  ప్రాముఖ్యత , విజయాన్ని చూసి  ఈ రోజు ప్రపంచం భారతదేశ కథను అనుకరించాలనుకుంటోంది అనే వాస్తవం కంటే మెరుగైన ఆమోదం మరొకటి ఉండదని నేను భావిస్తున్నాను, ”అని ఆయన చెప్పారు.


ప్రపంచ సేవల వాణిజ్యంలో భారతదేశాన్ని మొదటి 3 స్థానాలలో చేర్చాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. భారతదేశం @100(2047) దిశగా అమృత్ కాల్‌ను ప్రారంభించినందున రాబోయే 25 సంవత్సరాలలో సాంకేతికతలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రపంచంలో  మొదటి  10 పరిశోధన, అభివృద్ధి ల్యాబ్‌లు/ఇన్నోవేషన్ సెంటర్‌లను సృష్టించడంతోపాటు, విదేశీ వాణిజ్యంలో MSMEలకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.


"మనమందరం ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి, మనమందరం సహకార విధానంలో భారతదేశ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేద్దాం, మనమందరం భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మారుద్దాం" అని ఆయన అన్నారు.
రక్షణ వ్యవస్థలను మినహాయించి డ్రోన్‌ల రంగానికి మరింత సరళమైన నియంత్రణ పాలనను ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్న శ్రీ గోయల్, భారతదేశాన్ని డ్రోన్‌ల తయారీ కేంద్రంగా మార్చాలని పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. ‘పూర్తి విలువ గొలుసు’లో నాణ్యతను సమగ్రపరచాలని ఆయన పిలుపునిచ్చారు. తుది ఉత్పత్తిని తయారు చేసిన తర్వాత మాత్రమే నాణ్యత  పరిగణన లోకి  రాకూడదని అన్నారు.


పరిశ్రమ కోసం రేపటి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన శ్రీ గోయల్, “నేటి అవసరాలకు” సంబంధితంగా ఉండేలా పాఠ్య అంశాలను  మార్చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

"చాలా తరచుగా, కాలానుగుణ అవసరాలు  చాలా వేగంగా కదులుతున్నాయి, పాఠ్యాంశాల్లో మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంది, వాస్తవానికి, చాలా సమస్యలు ఉన్నాయి, మీరు రాత్రికి రాత్రే  పాఠ్యాంశాలను మార్చలేరు,  సమకాలీన విద్య కూడా అంతే ముఖ్యం.  కాబట్టి మీకు కావాల్సిన వాటికి సంబంధించిన మరిన్ని విద్యా కోర్సులు, , దాని కోసం మేము ఈ రోజు ఏమి బోధిస్తున్నాము , అది ఎంత సమకాలీనమైనది అనే దాని గురించి కొంత పరిశోధన చేయవలసి ఉంటుంది, ”అని ఆయన అన్నారు.


అంతకుముందు రోజు, వాణిజ్యం , పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమ , అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT) ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగం చేశారు. ప్రారంభ అంకం తర్వాత, (i) భారతదేశంలో తయారీలో నమూనా మార్పు @ 100, (ii) ఎగుమతుల్లో భారతదేశం  ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి వ్యూహాన్ని రూపొందించడం , (iii) MSMEలు ఎలా పనిచేస్తాయో అన్వేషించడం కోసం భారత ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్ లపై వరుసగా మూడు సెషన్‌లు జరిగాయి.. ముగింపు సెషన్‌లో ముగ్గురు సీనియర్ పరిశ్రమ నాయకులు, అంటే సెషన్ సందానకర్తలు   ముందుకు వెళ్లే మార్గాలపై కార్యాచరణ ప్రణాళికలను ప్రదర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు.

****



(Release ID: 1802842) Visitor Counter : 175