రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మహమ్మద్ అల్-ముతైర్ భార‌త దేశ చారిత్రక ప‌ర్య‌ట‌న‌

Posted On: 15 FEB 2022 5:21PM by PIB Hyderabad

రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మొహమ్మద్ అల్-ముటైర్, 14 ఫిబ్రవరి 2022న భారతదేశ ప‌ర్య‌ట‌న‌కు చేరుకున్నారు. చారిత్రాత్మక మరియు మైలురాయి ప‌ర్య‌ట‌న‌. రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్ ఒకరు భారత దేశ ప‌ర్య‌ట‌న‌కు రావడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ఈ ప‌ర్య‌ట‌న మరింతగా పెంపొందించడాన్ని సూచిస్తుంది. జనరల్ ఎంఎం నరవాణే  2020 డిసెంబర్‌లో సౌదీ అరేబియా ప‌ర్య‌ట‌న చేశారు. అది  ఒక చారిత్రాత్మక పర్యటన,  భారత ఆర్మీ చీఫ్ సౌదీ అరేబియాను సందర్శించడం అదే తొలిసారి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం. లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మహ్మద్ అల్-ముతైర్‌ను 15 ఫిబ్రవరి 2022న సౌత్ బ్లాక్‌లో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఆహ్వానం ప‌లికారు, అక్కడ అతనికి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. ఇరు దేశాల మ‌ధ్య‌ ముఖ్యమైన ద్వైపాక్షిక చర్చల కోసం ఆయ‌న  సీఓఏఎస్‌ను కలుసుకున్నారు, ఇరువురు భద్రతా అంశాల గురించి వివరించాడు. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు ఆర్థిక శ్రేయస్సు, తీవ్రవాద భయాల‌ను తొలగించడం మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం వంటి సాధారణ ప్రయోజనాల కారణంగా ఎంత‌గానో వృద్ధి చెందాయి. రక్షణ దౌత్యం అనేది మొత్తం సంబంధాల యొక్క ప్రధాన సిద్ధాంతాలలో ఒకటి. లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మహమ్మద్ అల్-ముటైర్ 16 ఫిబ్రవరి 2022న సౌదీ అరేబియాకు తిరుగు ప్రయాణమ‌వుతారు.

***

 



(Release ID: 1798631) Visitor Counter : 174