నీతి ఆయోగ్
కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ & యు ఎన్ డి ఫై ఇండియా
Posted On:
11 FEB 2022 3:51PM by PIB Hyderabad
అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), నీతి ఆయోగ్ యు ఎన్ డి పి ఇండియా సహకారంతో, "విజ్ఞానశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం" సందర్భంగా కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ (సిఐఎఫ్)ని ప్రారంభించింది.
ఫెలోషిప్- ప్రీ-ఇంక్యుబేషన్ మోడల్గా అభివృద్ధి చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డి జి) ఆధారిత పరిష్కారాలపై సమాజ సమస్యలను పరిష్కరించడానికి ఇది యువతకు వారి సామాజిక సంస్థను స్థాపించడానికి అవకాశం కల్పిస్తుంది
ఇది వారి సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా వర్ధమాన ఆవిష్కర్తల కోసం రూపొందించిన ఒక-సంవత్సరం పాటు సాగే ఇంటెన్సివ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఈ ఫెలోషిప్ సమయంలో, ప్రతి సహచరుడు ఏఐఎం అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లలో (ఏసిఐసిలు) హోస్ట్ చేయబడతారు. వారు తమ ఆలోచనపై పని చేస్తున్నప్పుడు ఎస్ డి జి అవగాహన, వ్యవస్థాపక నైపుణ్యాలు మరియు జీవిత నైపుణ్యాలను పొందాలి. ఆపరేటింగ్ సౌకర్యాలు, కో-వర్కింగ్ స్పేస్, మేకర్ ల్యాబ్లు మరియు ఆవిష్కర్తకు డైనమిక్ బిజినెస్ నెట్వర్క్ పరంగా తగిన వనరులను అందించడం ద్వారా ఏసిఐసిలు యువత నేతృత్వంలోని ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి.
ఏసిఐసిల ద్వారా, ఫెలోషిప్ ఫోకస్డ్ ఒక-సంవత్సరం మోడల్ ద్వారా ఒక ఆవిష్కర్త ఆలోచన నుండి వాణిజ్యీకరించడం వరకు ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది. సిఐఎఫ్ ప్రోగ్రామ్ వారి వ్యవస్థాపకత ప్రయాణానికి అవసరమైన కమ్యూనిటీ ఆవిష్కర్తల మధ్య జ్ఞానం మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్లో ఒక సంస్కృతిగా సోషల్ ఎంటర్ప్రైజ్ను మెయిన్ స్ట్రీమింగ్ చేయడంలో యువత భాగస్వామ్యాన్ని, అలాగే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి మహిళా ప్రెన్యూర్లను ప్రోత్సహించడంలో ఏఐఎం ప్రయత్నించే మార్గాలలో ఇది ఒకటి.
ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, “యువ కమ్యూనిటీ ఇన్నోవేటర్లకు వారి వ్యవస్థాపక ప్రయాణంలో అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు జ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఫెలోషిప్ ఏడాది పొడవునా కార్యక్రమం. భారతదేశంలోని అట్టడుగు ప్రజలు కలిగి ఉన్న సృజనాత్మకత మరియు ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఇది ఒక చోదక కార్యక్రమం అని అన్నారు. ఈ ఫెలోషిప్ను గొప్పగా విజయవంతం చేయడానికి అన్ని వాటాదారులందరూ కలిసి రావాలని ఆయన అన్నారు, దీనికి చాలా అభిరుచి మరియు ఉత్సాహం అవసరం అని డాక్టర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
సిఐఎఫ్ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, “యువ, శక్తివంతమైన ఆవిష్కర్తల కోసం ప్రీ-ఇంక్యుబేషన్ స్థలాన్ని సృష్టించడం అనేది సమాజ సమస్యలకు శక్తివంతమైన, ఉత్తేజకరమైన పరిష్కారాలను రూపొందించడంలో చాలా ముఖ్యమైన దశ అని తెలిపారు. ఈ ఫెలోషిప్ సంపూర్ణమైన మరియు సమగ్రమైన ఆవిష్కరణలను నిర్మించడంలో కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లోని యువ మార్పు తయారీదారులతో పాటు అనేక ఇతర వాటాదారులను భాగస్వామ్యం చేయడానికి ఒక తెలివిగల మార్గమని ఆయన తెలిపారు.
***
(Release ID: 1797972)