ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

171.28 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 46.44 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 96.95%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 67,084

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 7,90,789

వారపు పాజిటివిటీ రేటు 6.58%

Posted On: 10 FEB 2022 9:21AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 46.44 లక్షలకు పైగా ( 46,44,382 ) డోసులతో కలిపి, 171.28 కోట్ల ( 1,71,28,19,947 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,91,17,879 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,98,679

రెండో డోసు

99,16,566

ముందు జాగ్రత్త డోసు

37,74,605

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,03,692

రెండో డోసు

1,73,47,897

ముందు జాగ్రత్త డోసు

50,68,860

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,08,96,400

రెండో డోసు

1,05,23,483

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,65,63,415

రెండో డోసు

42,13,47,177

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,13,26,926

రెండో డోసు

17,51,89,201

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,56,52,278

రెండో డోసు

10,91,38,465

ముందు జాగ్రత్త డోసు

72,72,303

ముందు జాగ్రత్త డోసులు

1,61,15,768

మొత్తం డోసులు

1,71,28,19,947

 

గత 24 గంటల్లో 1,67,882 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,11,80,751 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 96.95 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 67,084 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 7,90,789. ఇది మొత్తం కేసుల్లో 1.86 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,11,321 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74.61 కోట్లకు పైగా ( 74,61,96,071 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 6.58 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1797198) Visitor Counter : 183